ప్రముఖ కవి రచయిత అందెశ్రీ కన్నుమూత
ప్రముఖ కవి రచయిత అందెశ్రీ కన్నుమూత
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక న్యూస్...
హైదరాబాద్ న్యూస్,నవంబర్-10,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్:ప్రముఖ కవి రచయిత అందెశ్రీ కన్నుమూశారు.ఆ క్రమంలో చూస్తే..సోమవారం తెల్లవారు జామున హైదరాబాద్ లాలాగూడలోని తన నివాసంలో ఆదివారం రాత్రి అస్వస్థతకు గురి అయ్యారు.దాంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన ఆయనను గాంధీ ఆస్పత్రికి తరలించారు.కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ..ఆయన ఈరోజు ఉదయం 7:30 గంటలకు తుదిశ్వాస విడిచారు.అందెశ్రీ మరణంతో సాహితీ లోకం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది.అందెశ్రీ 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు.ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య.గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభించారు.భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు.అందెశ్రీ పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు.తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారు.ఉద్యమ పాటలతో అందెశ్రీకి ప్రత్యేక గుర్తింపు లభించింది.అందెశ్రీ రాసిన‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించిన విషయం తెలిసిందే.అందెశ్రీకి ముగ్గురు కుమార్తులు,కుమారుడు ఉన్నారు.అలాగే మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’అనే గీతంతో ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు.కాకతీయ యూనివర్శిటీ నుంచి అందెశ్రీకి గౌరవ డాక్టరేట్ లభించింది.ఆ విధంగా మంచి రచయిత,గేయాలతో అందరి మనసులో స్థిరంగా ఆయన గొప్పగా నిలిచాడు.

Comments
Post a Comment