Posts

Showing posts from October, 2025

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతితో ఆర్కేపిలో 2-కే రన్ చేపట్టిన పోలీసులు

Image
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతితో ఆర్కేపిలో 2-కే రన్ చేపట్టిన పోలీసులు జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్.... రామకృష్ణాపూర్ న్యూస్,అక్టోబరు-31,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :స్వాతంత్ర్య సమరయోధుడు,భారతదేశంలో 500లకు పైగా సంస్థానాలను విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించిన భారతదేశ ఉక్కు మనిషిగా పేరు ప్రఖ్యాతిగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో 2కే రన్ పెద్ద ఎత్తున నిర్వహించారు.ఆ క్రమంలో చూస్తే.."రన్ ఫర్ యూనిటీ" అనే నినాదంతో పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియం నుంచి శ్రీ కోదండ రామాలయం చౌరస్తా వరకు ఈరోజు కాగడా చేత పట్టుకొని పోలీసులు క్రీడాకారులు విద్యార్థినిలు అన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు పరుగులు తీశారు.ఆ సందర్భంగా రామకృష్ణాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.రాజశేఖర్,క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ రాజు,తవక్కల్ విద్యాసంస్థల చైర్మన్ అజీజ్ మాట్లాడారు.ముఖ్యంగా ఉక్కుమనిషిగా మంచి పేరు ప్రతిష్టలు గొప్ప చరిత్ర కలిగిన సర్దార్ వల్లభాయ్ పటేల...

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతితో ఆర్కేపిలో రేపు 2కే రన్

Image
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతితో ఆర్కేపీలో రేపు 2కే రన్   రన్ ఫర్ యూనిటీ నినాదంలో అందరూ ఆహ్వానితులే..తరలి రండి -- ఎస్ఐ జి.రాజశేఖర్ ప్రకటన రామకృష్ణాపూర్ న్యూస్,అక్టోబరు-31,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :స్వాతంత్ర్య సమరయోధుడు,స్వాతంత్ర్యం తరువాత భారతదేశంలో 500 లకు పైగా సంస్థానాలను విలీనం చేయడంలో కీలక పాత్ర పోషిoచి "భారతదేశ ఉక్కు మనిషి" గా పేరు ప్రఖ్యాతిగాంచిన "సర్దార్ వల్లభాయ్ పటేల్ "150వ జయంతి పురస్కరించుకొని తేది :-31-10-2025 "రన్ ఫర్ యూనిటీ" అనే నినాదంతో రామకృష్ణాపూర్ పోలీసులు ఆధ్వర్యంలో (2కే రన్) నిర్వహిస్తున్నట్లు గురువారం రామకృష్ణాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.రాజశేఖర్ తెలిపారు.ఆ క్రమంలో చూస్తే.. 2కే రన్ ప్రోగ్రాంలో పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని  ఎస్సై ప్రకటించారు.కాగా "జాతీయ ఏక్తా దివాస్" వేడుకలను రామకృష్ణాపూర్ లో పెద్ద ఎత్తున చేపడుతున్న దృష్ట్యా జాతీయ సమైక్యతను చాటిచెప్పే "రన్ ఫర్ యూనిటీ" అనే నినాదం కార్యక్రమాన్ని రామకృష్ణాపూర్ పోలీస్ విభాగం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందనీ పేర...

మావోయిస్టు అగ్రనేత,సికాస కార్యదర్శి బండి ప్రకాష్ డీజీపీ ఎదుట లొంగి పోయాడు ?

Image
మావోయిస్టు అగ్రనేత,సికాస కార్యదర్శి బండి ప్రకాష్ డీజీపీ ఎదుట లొంగి పోయాడు  -- జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్.... హైదరాబాదు న్యూస్,జర్నలిస్టు తెలుగు దినపత్రిక,అక్టోబరు-28 :మావోయిస్టులు-అగ్ర నేతల లొంగుబాటులోనే మావోయిస్టు పార్టీ కీలక నేత,తెలంగాణ రాష్ట్ర  కమిటీ సభ్యుడు,సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస )అధ్యక్షుడు బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ మంగళవారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో లొంగి పోయాడు.ఆ క్రమంలో చూస్తే.. 45 సంవత్సరాలుగా బండి ప్రకాష్ అలియాస్ రమాకాంత్ (ఆర్ కే )మావోయిస్టు పార్టీలో అనేక బాధ్యతలు చేపట్టి పని చేశారు.ఆ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ బండి ప్రకాశ్ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాడు.సింగరేణిలో పని చేయడమే కాకుండా ఆనాటి పీపుల్స్‌వార్ ఉద్యమాలకు ఆకర్షితుడైనాడు.దాంతో 1980లో సింగరేణి కార్మిక సమాఖ్య - సికాసలో ఆయన చేరాడు.అలాగే1988 సంవత్సరంలో బెల్లంపల్లిలో కమ్యూనిస్ట్ నేత అబ్రహం హత్య కేసులో జైలుకు వెళ్లారు.ఆదిలాబాద్ సబ్ జైలులో శిక్షను కూడా అనుభవించాడు.పీపుల్స్‌వార్ ముఖ్య నేతలైన నల్లా ఆదిరెడ్డి,మహమ్మద్ హస్సేన్,ముంజ రత్నయ్య గౌడ్లతో కలిసి ఆ సబ్ జైలు గోడలను బ...

తెలంగాణలో 5 రోజులు భారీ వర్షాలు-జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ

Image
తెలంగాణలో 5-రోజులు భారీ వర్షాలు-జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ -- జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్..... మంచిర్యాల న్యూస్,అక్టోబరు-26,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది.ఆ క్రమంలో చూస్తే..రాబోయే ఐదురోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.ఆ నేపథ్యంలోనే అనేక జిల్లాలకు ఆరెంజ్‌,రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.ఆదివారం ఆదిలాబాద్‌,ఆసిఫాబాద్‌,నిర్మల్‌,నిజామాబాద్‌,హైదరాబాద్‌,రంగారెడ్డి,మేడ్చల్‌ మల్కాజ్‌గిరి,వికారాబాద్‌,సంగారెడ్డి, మెదక్‌,కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.అలాగే సోమవారం,ఆదిలాబాద్‌,ఆసిఫాబాద్‌,మంచిర్యాల,నిర్మల్‌,భూపాలపల్లి,ములుగు,కొత్తగూడెం,ఖమ్మం,నల్గొండ,సూర్యాపేట,మహబూబాబాద్‌,వరంగల్‌,హనుమకొండ,జనగాం,నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.దాంతో ఆ జిల్లాలకు ఐఎండి ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.అదేవిధంగా మంగళశారం జయశంకర్‌ భూపాలపల్లి,కొత్తగూడెం,ములుగు,మహబూబాబాద్‌ జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ...

ఆర్కేపిలో ఇన్ ఫార్మర్ లతో శాంతికి విఘాతం?

Image
ఆర్కేపిలో ఇన్ ఫార్మర్ లతో శాంతికి విఘాతం?  రామకృష్ణాపూర్ న్యూస్,అక్టోబరు-24జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్:మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కోల్ బెల్టు ప్రాంతమైన ముఖ్యమైన ఏరియాగా పిలువబడే రామకృష్ణాపూర్ పట్టణంలో ఇన్ఫార్మర్లు ఎక్కువైనట్లు తెలుస్తుంది.ఆ క్రమంలో చూస్తే..స్వార్థం ఎక్కువై,ఓర్వలేని తనం,పైరవీతనంతో ఆ బ్రోకర్లు ఇన్ఫార్మర్లుగా మారుతున్నట్లు కోల్ బెల్ట్ ప్రాంత ప్రజానీకం చర్చించుకుంటుంది.ప్రధానంగా ఎటువంటి బాధ్యత లేకుండా విచ్చలవిడిగా తిరుగుతూ ప్రతి రోజు ఏదో ఒక సాకుతో భజన చేస్తూ పూటగడిపే వాళ్ళ ప్రవర్తన ద్వారానే శాంతికి విఘాతం కలుగుతూ అశాంతికి కారకులు అవుతున్నట్లు పట్టణ ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ఆ నేపథ్యంలోనే ఒకరి మెప్పు పొందడానికి రాజకీయంలో ఇన్ ఫార్మర్ గా అవుతున్నారని ఇంకా పోలీసు అధికారులు తెలుసు అంటూ ఇన్ ఫార్మర్లుగా చలామణి అవుతున్నారని వాళ్ల స్వార్థం కోసం పైరవీలు చేస్తూ బ్రోకర్లుగా మారి ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు వాపోతున్నారు.కొంతమంది నకిలీలు మాత్రం అదేపనిగా ప్రజలను మభ్యపెడుతూ..అధికారుల చుట్టూ తిరుగుతూ ఓర్వలేకనే కొందరిపై తప్పుడు ప్రచారం సైతం ...

ఆర్కేపి ఠాగూర్ స్టేడియం ముఖద్వారం గేటుకు మరమ్మత్తులు

Image
ఆర్కేపి ఠాగూర్ స్టేడియం ముఖద్వారం గేటుకు మరమ్మత్తులు - జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్... రామకృష్ణాపూర్ న్యూస్,అక్టోబరు-24,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల సింగరేణి ఠాగూర్ స్టేడియం ముఖద్వారం యొక్క ప్రధాన గేటుకు శుక్రవారం సింగరేణి మందమర్రి ఏరియా వర్క్ షాప్ ఉద్యోగులు మరమ్మత్తులు చేశారు.ఆ క్రమంలో చూస్తే..ముఖ్యమైన గేటుకు ఒకపక్క గేటుకు పట్టీలు విరిగిన దృష్ట్యా వెల్డింగ్ ద్వారా ఉద్యోగులు ఇంజుస్ వేశారు.ఆ సందర్భంగా మందమర్రి ఏరియా వర్క్ షాప్ కు చెందిన వెల్డర్ ఇన్చార్జి తో పాటు కార్మికులు ఠాగూర్ స్టేడియం చేరుకొని ఠాగూర్ స్టేడియం గేటుకు మరమ్మత్తులు చేసి సరిగా ఉండే విధంగా బాగుగా చేశారు. --  ఆ గేటుకు రెండు వైపులా చక్రాల కింద సిమెంట్ ప్లాస్టింగ్ చేయాలి.. రామకృష్ణాపూర్ లోని సింగరేణి ఠాగూర్ స్టేడియం యొక్క ముఖద్వారంకు ఉన్న భారీ గేట్ల యొక్క కింది భాగంలో ఆ గేటుకు ఉన్న చక్రాలు భూమిలో ఇరుక్కుపోవడం వల్ల ఆ గేటు పట్టీలపై భారం పడి గేటు యొక్క పట్టీలు విరిగిపోతున్నాయి.అయితే ఆ గేటు యొక్క చక్రాలు ఈజీగా తిరగడానికి ఆ గేటుకు ఉన్న చక్రాలు తిరిగ...

అమర పోలీసుల త్యాగాలను స్మరిస్తూ ఆర్కేపిలో క్యాండిల్ ర్యాలీ చేపట్టిన క్రీడాకారులు

Image
అమర పోలీసుల త్యాగాలను స్మరిస్తూ ఆర్కేపిలో క్యాండిల్ ర్యాలీ చేపట్టిన క్రీడాకారులు  --  ముఖ్యఅతిథి ఎస్ఐ జి.రాజశేఖర్  రామకృష్ణాపూర్ న్యూస్,అక్టోబర్-21,జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్: ఉద్యోగరీత్యా పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ..మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో మంగళవారం రాత్రి స్థానిక క్రీడాకారుల ఆధ్వర్యంలో క్రోవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.ఆ క్రమంలో చూస్తే..పట్టణంలోని ఠాగూర్ స్టేడియం వద్ద ప్రారంభమైన ర్యాలీలో క్రీడాకారులు,పోలీసులు కొవ్వొత్తులు చేత పట్టుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్థానిక సూపర్ బజార్ చౌరస్తా వరకు ఆ ర్యాలీ చేపట్టారు.దాంతో పోలీస్ అమరవీరులను జ్ఞాపకం చేసుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఆ సమయంలో నినాదాలు చేస్తూ పోలీస్ అమరవీరుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఆ సందర్భంగా ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి,పట్టణ ఎస్ఐ జి.రాజశేఖర్,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు ప్రసంగించారు.ప్రజల రక్షణ కోసం పోలీసులు 24 గంటలు విధులు నిర్వహిస్తారని గుర్తు చేశారు.చైనా జరిపిన దాడిలో పోలీసులు మరణించిన ద...

దేశ-సమాజ సంరక్షకులు పోలీసులు

Image
దేశ-సమాజ సంరక్షకులు పోలీసులు నేడు పోలీసు అమరవీరుల దినోత్సవం -- జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్.... మంచిర్యాల న్యూస్,అక్టోబరు-21,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: పంచమంతా నిద్రపోయినా మేల్కొని ఉండే ఒకే ఒక్కడు..పోలీస్ మాత్రమే అని చెప్పడంలో అసలు సందేహం లేదు.ఆ క్రమంలో చూస్తే...ప్రపంచమంతా నిద్రలో ఉంటే వీరు శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం కాపలా కాస్తుంటారు.ఆ నేపథ్యంలోనే ఎండ,వాన,పగలు,రాత్రి అనే తేడా అసలు లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండగ పబ్బాల్ని కూడా త్యజించి,ప్రజల కోసం జీవించి,మరణించిన పోలీసు అమరవీరులు ఎందరో.. ఉన్నారు.ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసు చేసిన త్యాగానికి సానుభూతి,గౌరవం చూపించడం మనందరి బాధ్యతగా ఉండాలి.ఆ తరుణంలో పోలీసుల బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్న వారికి విధి నిర్వహణలో నూతనోత్తేజాన్ని,స్ఫూర్తిని నింపడమే పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జరుపుకోవడంలోని ప్రధాన ఉద్దేశంగా తెలుస్తుంది.అక్టోబర్ 21-అంటే పోలీసు అమరవీరుల దినం.గతంలో ప్రపంచాన్ని అంతా అతలాకుతలం చేసిన కరోనా గత్తర కాలంలో పోలీసుల సేవలు మరువలేం.మన కాళ్లు బయటకు రాకుండా..నిత్యం శ్రమిస్తూ అనేక మం...

ఐఎంఏ మంచిర్యాల నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక-ప్రమాణ స్వీకారం

Image
ఐఎంఏ మంచిర్యాల నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక-ప్రమాణ స్వీకారం ముఖ్యఅతిథి టీజీఎంసీ మెంబర్-లీగల్ అండ్ ఎథికల్ కమిటీ డా.ఎగ్గన శ్రీనివాస్ హాజరు -ప్రసంగం... మంచిర్యాల న్యూస్,అక్టోబరు-19,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: మంచిర్యాల జిల్లాలోని పాత మంచిర్యాలలో గల ఐఎంఏ బిల్డింగులో శనివారం ఐఎంఏ 2025-26 నూతన కార్యవర్గ కమిటీ యొక్క ప్రమాణస్వీకారం పెద్ద ఎత్తున నిర్వహించారు.ఆ కమిటీలో అధ్యక్షులుగా డాక్టర్ రావుల రవిప్రసాద్,ముఖ్య కార్యదర్శిగా డాక్టర్ అనిల్ ముత్తినేని,కోశాధికారిగా డాక్టర్ సంతోష్ చందూరి  ఎన్నుకోబడ్డారు.ఆ ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎగ్గన శ్రీనివాస్(టీజీఎంసీ మెంబర్ లీగల్ అండ్ ఎథికల్ కమిటీ) హాజరయ్యారు.ఆ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడారు.కొత్త కార్యవర్గం డాక్టర్స్ సమస్యలను పరిష్కరించటంతో పాటు ప్రజారోగ్య సంరక్షణకు కృషి చేయాలని సూచించారు.అలాగే ప్రజలను ఆర్థికంగా ఆరోగ్యం పరంగా దెబ్బతీసున్న వాళ్ళపైన ఐఎంఏ నుంచి తగిన విధంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -  వైద్య వ్యవస్థ ప్రక్షాళన దిశగా మంచిర్యాల డాక్టర్స్ మరో అడుగు.... ఆ ప్రమాణ స్వీ...

తెలంగాణ బంద్..ఎక్కడికి అక్కడే నిలిచిపోయిన బస్సులు-మద్దతూ తెలిపిన ప్రజానీకం

Image
తెలంగాణ బంద్..ఎక్కడికి అక్కడే నిలిచిపోయిన బస్సులు-మద్దతూ తెలిపిన ప్రజానీకం జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ ప్రత్యేక వార్తలు.... జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్,అక్టోబర్-18: తెలంగాణలో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర బీసీ సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ కొనసాగుతుంది.ఆ క్రమంలో చూస్తే... ఉదయం 4 గంటల నుంచే బంద్ మొదలయింది.జిల్లాల్లోని ఆర్టీసీ డిపోల బయట ఎక్కడికక్కడ బస్సులను బీసీ సంఘాలు అడ్డుకుంటున్నాయి.అటు ఈ బంద్‌కు అధికార కాంగ్రెస్ పార్టీ సహా ప్రతిపక్షాలు సైతం మద్దతు తెలిపాయి.బంద్‌కు ప్రజలు సహకరించాలని బీసీ నేతలు కోరుతున్నారు.రాష్ట్రంలో మెడికల్ షాపులు, అంబులెన్సులు,ఆసుపత్రులు, పెట్రోల్ బంకులు వంటి అత్యవసర సేవలు మినహా సంపూర్ణంగా బందులో పాల్గొంటున్నారు. బీసీ జేఏసీ బంద్‌కు అధికార కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మంచిర్యాల జిల్లాలో బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది.చెన్నూర్,మందమర్రి,రామకృష్ణాపూర్ పట్టణంలో బీసీ బంద్ కు మంత్రి వివేక్ వెంకటస్వామి మద్దతూ తెలిపారు.అందరూ స్వచ్ఛందంగా బంద్ పాటించాలన్నారు.42 శాతం రిజర్వేషన్ల త...

సాక్షి ఎడిటర్ పై చంద్రబాబు కుట్రలను త్రిప్పికొడుతూ మంచిర్యాలలో జర్నలిస్టులు ఆందోళన

Image
సాక్షి ఎడిటర్ పై చంద్రబాబు కుట్రలను త్రిప్పికొడుతూ మంచిర్యాలలో జర్నలిస్టులు ఆందోళన  -- నల్ల బ్యాడ్జీలు ధరించి అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన  --  టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు డేగ సత్యం,పింగిలి సంపత్ రెడ్డిలు ప్రసంగం... మంచిర్యాల న్యూస్,అక్టోబరు-17,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించిన సాక్షి దినపత్రిక మీడియాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న కుట్రలను నిరసిస్తూ శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి జర్నలిస్టులు ఐకమత్యంతో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.ఆ సందర్భంగా టియుడబ్ల్యూజే మంచిర్యాల జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు డేగ సత్యం,పింగళి సంపత్ రెడ్డిలు మాట్లాడుతూ..మద్యం వార్తలపై ఏపీ ప్రభుత్వం గత నాలుగు రోజులుగా సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డికి పలు మార్లు నోటీసులు ఇవ్వడాన్ని ఏపీ ప్రభుత్వ అరాచక పాలన,దమనకాండకు ఇదే నిదర్శనం అన్నారు.ఆ నేపథ్యంలోనే సాక్షి మీడియాపై ఏపీ ప్రభుత్వ కుట్ర సరైంది కాదని,మీడియా గొంతు నొక్కడం చూస్తుంటే పత్రిక స్వేచ్ఛపై దా...

రోడ్డు ప్రమాదంలో తిమ్మాపూర్ భీమా సుధాకర్ మృతి

Image
రోడ్డు ప్రమాదంలో తిమ్మాపూర్ భీమా సుధాకర్ మృతి - ఆర్కేపి ఎస్ఐ జి.రాజశేఖర్ ప్రకటన రామకృష్ణాపూర్ న్యూస్,అక్టోబరు-16,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల క్రైస్ట్ స్స్కూల్ దగ్గర బుధవారం రాత్రి సుమారుగా 8:00 గంటలకు మంచిర్యాల నుంచి మందమర్రి వైపు వెళ్లే నేషనల్ హైవే రోడ్డుపై బీమా సుధాకర్(65)అనే తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ఊహించిన విధంగా మృతి చెందాడు.ఆ క్రమంలో చూస్తే..ఆయన యొక్క సొంత అపార్ట్మెంట్ లోని గణేష్ కిరాణం షాపు పని మీద వెళ్లినాడని ఆ పని ముగించుకొని తిరిగి అతని ద్విచక్ర వాహనం మీద ఇంటికి తిరిగి వస్తుండగా అదే సమయంలో మంచిర్యాల వైపు నుంచి బెల్లంపల్లి వైపునకు వెళ్తున్న ఒక ఆటో దాని డ్రైవర్ అతివేగంగా,అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి ఆటోతో ఢీ కొట్టగా భీమా సుధాకర్ కింద పడిపోయినాడనీ రామకృష్ణాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.రాజశేఖర్ తెలిపారు.అయితే ఆక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిన వెంటనే అతని వరుసకు బాబాయ్ అయినటువంటి భీమా నగేష్ వచ్చి తన కారులో సుధాకర్ ను చికిత్స కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జ...

జ‌ర్న‌లిస్టుల‌ సంక్షేమానికి అత్యంత ప్రాధాన్య‌త‌

Image
జ‌ర్న‌లిస్టుల‌ సంక్షేమానికి అత్యంత ప్రాధాన్య‌త‌ --  త్వ‌ర‌లో అక్రిడిటేష‌న్ పాల‌సీ --  మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి --  జర్నలిస్టులపై దాడులు,దౌర్జన్యాల నివారణకు ప్రత్యేక చర్యలు హైదరాబాద్ న్యూస్,అక్టోబర్-16,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం ప‌నిచేస్తుంద‌ని గురువారం రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.ఆ క్రమంలో చూస్తే..జర్నలిస్టుల కోసం ప్ర‌భుత్వం అమ‌లు చేసే సంక్షేమ కార్య‌క్ర‌మాలు అర్హులైన జ‌ర్న‌లిస్టుల‌కు అందేలా విధి విధానాల‌ను రూపొందిస్తున్నామ‌ని తెలిపారు.డాక్టర్ బి.ఆర్‌.అంబేద్కర్ స‌చివాల‌యంలో మీడియా అకాడ‌మీ ఛైర్మన్ కె.శ్రీ‌నివాస‌రెడ్డి,స‌మాచార పౌర‌సంబంధాల శాఖ క‌మీష‌న‌ర్ సిహెచ్‌.ప్రియాంక,సిపిఆర్‌వో మ‌ల్సూర్‌ తో క‌లిసి అక్రిడిటేష‌న్ పాల‌సీపై సుదీర్ఘంగా చ‌ర్చించారు.ఆ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ..అర్హులైన జ‌ర్న‌లిస్టుల గౌర‌వాన్ని కాపాడేవిధంగా శాస్త్రీయ ప‌ద్ద‌తిలో అక్రిడిటేష‌న్ పాల‌సీ ఉండాల‌ని అధికారుల...

తవక్కల్ విద్యా సంస్థల చైర్మన్ అజీజ్ కు కలాం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

Image
--  తవక్కల్ విద్యా సంస్థల చైర్మన్ అజీజ్ కు కలాం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రామకృష్ణాపూర్ న్యూస్,అక్టోబరు-15,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :లీడ్ ఇండియా నిర్వాహకుల ఆధ్వర్యంలో ప్రియతమ మాజీ రాష్ట్రపతి,భారతదేశ సైన్స్ పితా మహుడు అబ్దుల్ కలాం 94వ జన్మదినం పురస్కరించుకొని హైదరాబాదులోని రవీంద్రభారతిలో బుధవారం కలాం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రోగ్రాం భారీ ఎత్తున నిర్వహించారు.ఆ నేపథ్యంలోనే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపుర్ పట్టణంలో గత 25 సంవత్సరాలుగా విద్యా రంగంలో ఆయన చేసిన నిస్వార్థ సేవలకు గాను తవక్కల్ విద్యా సంస్థల ఛైర్మన్ ఎండి.అబ్దుల్ అజీజ్ ఎంపిక అయ్యారు.దాంతో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మాజీ చేతుల మీదుగా అబ్దుల్ అజీజ్ కు ఘనంగా సత్కారంతోపాటు గౌరవంగా అవార్డు ప్రధానం చేసారు.ఆ సందర్భంగా తవక్కల్ విద్యా సంస్థల ఉపాధ్యాయులు,విద్యార్థులు,విద్యార్థుల తల్లితండ్రులు,అభిమానులు,స్నేహితులు,రాజకీయ నాయకులు,పుర:ప్రముఖులు,ఇతరులు అందరు కూడా అబ్దుల్ అజీజ్ కు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు.

మంచిర్యాల జిల్లా ప్రజలకు ఒకే చోట అన్ని రకాల న్యాయ సేవలు

Image
మంచిర్యాల జిల్లా ప్రజలకు ఒకే చోట అన్ని రకాల న్యాయ సేవలు  --   తేలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ మంచిర్యాల న్యూస్, అక్టోబర్-11,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: మంచిర్యాల జిల్లా ప్రజలకు ఒకే చోట అన్ని రకాల న్యాయస్థాన సేవలు అందించడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అన్నారు.ఆ క్రమంలో చూస్తే..శనివారం జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న న్యాయస్థానం భవన సముదాయ నిర్మాణ కార్యక్రమాన్ని వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు.ఆ సందర్భంగా చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ..మంచిర్యాల జిల్లా ప్రజలకు అన్ని రకాల న్యాయస్థాన సేవలు ఒకే చోట అందించేందుకు భవన నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు.అనంతరం జిల్లాకు విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి,మంచిర్యాల జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి నగేష్ భీమపాక, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.వీరయ్య, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,డి.సి.పి. ఎ.భాస్కర్, జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, మంచిర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండవరం జగన్, న్యాయవాదులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి భూమి పూజ చేశా...