Posts

గోదావరి ఒడ్డున పేలుడు పరికరాలు-బర్లకు తీవ్ర గాయాలు?

Image
గోదావరి ఒడ్డున పేలుడు పరికరాలు-బర్లకు తీవ్ర గాయాలు?  తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్.. జన్నారం న్యూస్,ఏప్రిల్ -20: మంచిర్యాల జిల్లా జన్నారం_ మండల కేంద్రంలోని బాదంపల్లి గ్రామ సమీపంలో గోదావరి నది ప్రవాహ ఒడ్డున ఆదివారం ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది.ఆ వన్యప్రాణులను వేటాడేందుకు గుర్తుతెలియని వేటగాళ్లు పేలుడు పరికరాలు అమర్చినట్లు సమాచారం గుండా తెలిసింది.ఆ గ్రామానికి చెందిన పశువుల కాపరులు తమ బర్లను మేత కోసం గోదావరి తీర ప్రాంతానికి తీసుకువెళ్లగా అక్కడ మేత కోసం తిరుగుతున్న బర్లలో కొన్ని ఆ పేలుడు పరికరాలను తినడంతో ఒక్కసారిగా పేలుళ్లు చోటుచేసుకున్నాయి.ఆ ఘటనలో పలు బర్లకు తీవ్ర గాయాలు కావడంతో కాపరులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.గాయపడిన పశువులను సమీపంలోని వెటర్నరీ వైద్యుల వద్ద చికిత్సకు తరలించారు.ఆ ఘటనతో గ్రామస్థుల్లో భయం నెలకొంది.వేటగాళ్లు వన్యప్రాణుల కోసం ఇలాంటి ప్రమాదకర పేలుడు పరికరాలు అమర్చడం వల్ల నిరపరాధ పశువులు బలవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సంబంధిత అటవీ శాఖ అధికారులు,పోలీసు అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు పున:రావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గ్ర...

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ “దోచుకో-దాచుకో” పథకం ప్రారంభించింది-కేటీఆర్

Image
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ “దోచుకో-దాచుకో” అనే పథకం ప్రారంభించింది  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందుకే ముఖ్యమంత్రితో సహా మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ దోచుకుంటున్నారు  కాంగ్రెస్ పార్టీ అంతా అవినీతిమయం  రేవంత్ రెడ్డి అంతా భారీ అవినీతిపరుడు దేశంలో ఇంకొకరు లేరు  బీజేపీ-కాంగ్రెస్ తోడు దొంగల మాదిరి కలిసి నడుస్తున్నాయి  అందుకే సింగరేణి నుంచి మొదలుకొని కేంద్ర ప్రభుత్వ పథకాల్లో జరుగుతున్న అవినీతిపైన విచారణ లేదు  ప్రధానమంత్రి ఆర్ఆర్ టాక్స్ , హోంమంత్రి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం అని చెప్పినా ఇప్పటిదాకా ఒక ఎంక్వయిరీ లేదు  అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ బిజెపి కలిసి ఒకరిని ఒకరు కాపాడుకుంటున్నాయి  సింగరేణి కార్మికుల కోసం కొట్లాడుతాం  కార్మికుల సమస్యలు పట్టించుకోకుంటే…సింగరేణిలో అవినీతి ఆపకుంటే…ప్రతి బొగ్గు గనిమీద అగ్గిపుట్టిస్తాం…. తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక..... మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో క్యాతన పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లను సన్మాంచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.ఆ సందర్భంగా కేటీఆర్ మ...

విలేకరి ముసుగులో వసూళ్లు?

Image
విలేకరి ముసుగులో వసూళ్లు దందా? కత్తితో బెదిరించి ఫోన్ పే ద్వారా వసూలు వేములవాడలో నకిలీ జర్నలిస్టు అరెస్ట్,రిమాండ్ బాధితులను బెదిరిస్తే కఠిన చర్యలు తప్పవు వేములవాడ టౌన్ సీఐ వీర ప్రసాద్ హెచ్చరిక తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక న్యూస్... విలేకరుల ముసుగులో కొంత మంది నకిలీ జర్నలిస్టులు వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారు.ఆ క్రమంలో చూస్తే..తాజా గా వేములవాడ పట్టణంలోని ఓక సూపర్ మార్కెట్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన నిందితుడిని వేములవాడ టౌన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.ఆ మేరకు వేములవాడ టౌన్ సీఐ బి.వీర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేటకు చెందిన గోడిశేల మహేష్ అనే వ్యక్తి జర్నలిస్టుగా పరిచయం చేసుకుని,సూపర్ మార్కెట్ యాజమానిని భయభ్రాంతులకు గురిచేశాడు.అధికారులతో తనిఖీలు చేయిస్తానని,పత్రికల్లో వ్యతిరేక వార్తలు రాస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.కత్తితో ప్రాణహాని తలపెడతానని హెచ్చరించి బాధితుడి నుంచి ఫోన్ పే ద్వారా రూ.42,000 వసూలు చేశాడు.నిందితుడు మళ్లీ డబ్బుల కోసం వేధిస్తుండటంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.ఎస్‌ఐ రామ్మోహన్,కానిస్టేబుల్ గ...

బైకు అదుపుతప్పి ఆ ఇద్దరికీ గాయాలు?

Image
బైకు అదుపుతప్పి బొక్కలగుట్ట జాతీయ రహదారిపై ఆ ఇద్దరికీ గాయాలు  తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక... రామకృష్ణాపూర్ న్యూస్,ఏప్రిల్-11,తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొక్కలగుట్ట సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోవడంతో అక్కడ ప్రమాదం చోటుచేసుకుంది.ఆ ఘటనలో వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.ఆ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇంకా మరిన్ని వివరాలు కోసం ప్రతినిత్యం వీక్షిస్తూనే ఉండండి.తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక పేపర్-టీవీ ఛానల్ న్యూస్.

వాటర్ బిల్లు పేరుతో సైబర్ మోసాలు-సిపి సజ్జనార్ హెచ్చరిక

Image
వాటర్ బిల్లు పేరుతో సైబర్ మోసాలు-సిపి సజ్జనార్ హెచ్చరిక తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక... హైదరాబాదు న్యూస్, ఏప్రిల్-11,తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాలను ఎంచుకొని ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు.ఆ క్రమంలో చూస్తే..నగరవాసులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు వాటర్ బిల్లుల పేరుతో కొత్త తరహా మోసాలకు తెరలేపారు."మీ నీటి బిల్లు బకాయి ఉంది.వెంటనే చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేస్తాం"అంటూ వాటర్ బోర్డు (HMWSSB) అధికారుల పేరుతో ఫోన్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు.ఆ సైబర్ నేరగాళ్లు బిల్లు అప్డేట్ పేరుతో HMWSSB WATER BILL UPDATE.apk పంపి, దానిని ఇన్స్టాల్ చేయాలని నమ్మిస్తున్నారు.ఒక్కసారి ఆ ఏపీకే ఫైల్ను ఫోన్లో డౌన్లోడ్ చేస్తే..మీ మొబైల్ నియంత్రణ మొత్తం కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్తుందని దాంతో వాళ్లు మీ కాల్స్ను డైవర్ట్ చేయడమే కాకుండా బ్యాంక్ ఓటీపీలను తస్కరించి క్షణాల్లో ఖాతాలను ఖాళీ చేస్తున్నారని ఎక్స్ వేదికగా సీపీ సజ్జనార్ అలర్ట్ గా ఉండాలని ప్రకటిం...

ఫ్లాష్ ఫ్లాష్ న్యూస్..ఆర్కే-5 గనిలో ప్రమాదం-ఇద్దరికి గాయాలు?

Image
ఫ్లాష్ ఫ్లాష్ న్యూస్..ఆర్కే-5 గనిలో ప్రమాదం-ఇద్దరిలో ఒకరికి గాయాలు,మరొకరికి తీవ్ర గాయాలు! తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక... శ్రీరాంపూర్ న్యూస్,తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక న్యూస్-టీవీ ఛానల్ న్యూస్,ఏప్రిల్-9:సింగరేణి కాలరీస్ లోని శ్రీరాంపూర్ డివిజన్ పరిధిలోగల ఆర్కే ఐదు గనిలో గురువారం రెండవ షిఫ్ట్ లో జరిగిన ఒక ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు తీవ్రంగా గాయాలు అయ్యాయి.ఆ క్రమంలో చూస్తే...గని భూగర్భంలో వేల్డర్ గా పనిచేస్తున్న వేణుగోపాల్ అనే కార్మికుడు ఇనుప రాడ్లను వెల్డింగ్ చేస్తున్న సమయంలో దాంట్లో ఒక చిన్న రాడ్ చువ్వలు మిరుగులు వెళ్లి అక్కడే ఉన్న పాత పూర్ణికి తగలడంతో అది ఒక్కసారిగా బ్లాస్ట్ అయిందనీ తెలుస్తుంది.ఆ ప్రమాదంలో వేణుగోపాల్ పై బ్లాస్టింగ్ వల్ల ఒక్కసారిగా బొగ్గు పిల్లలు ఇనుపరాడులు అన్ని కూడా మీద పడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.అలాగే అతని హెల్పర్ కు కూడా స్వల్పంగా గాయాలు పాలయ్యాడు. వెంటనే రామకృష్ణాపూర్ లోని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించడంతో ఆ ఇద్దరు కార్మికులు చికిత్స పొందుతున్నారు.దాంట్లో వేణుగోపాల్ కు బలమైన గాయాలు కావడంతో ఎక్స్రేలు తీసారు.ఆయన దేహంలో చిన్న చిన్న ఇనుప ముక్కలు ఉన్నట్లుగా వైద...

2-లక్షలు లంచం తీసుకుంటూ ఏసిబికి పట్టుబడ్డ సిఐ,ఎస్ఐ

Image
2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసిబికి పట్టుబడ్డ సిఐ,ఎస్ఐ  తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక... హైదరాబాద్ న్యూస్,ఏప్రిల్-8,తెలంగాణ జర్నలిస్టు న్యూస్ పేపర్-టీవీ ఛానల్ న్యూస్:నకిలీ పాస్ పోర్ట్ కేసులో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ సిఐ సంపతి కనకయ్య,ఎస్సై సిద్దేశ్వర్,రూ.రెండు లక్షలు లంచం తీసుకుం టూ ఏసీబీ అధికారులకు మంగళవారం సాయంత్రం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.ఆ క్రమంలో చూస్తే...ఆ దాడులు మంగళ వారం సాయంత్రం ప్రారంభ మై అర్ధరాత్రి వరకు కొనసాగాయి.రంగారెడ్డి జిల్లా ఏసీబీ డిఎస్పి ఆనంద్ కుమార్ తెలిపిన వివరాలు ప్రకారం చూస్తే..కేరళకు చెందిన ఒక వ్యక్తి ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ తో ప్రయాణించేందుకు ప్రయత్నిస్తూ ఇటీవల కాలంలో అతను పట్టు పడ్డాడు.శంషాబాద్ ఔట్  పోస్ట్ పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు  నమోదు అయింది.అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.కొద్దిరోజుల తర్వాత జైలు నుంచి అతడు రిలీజ్ అయ్యాడు.ఆ నేపథ్యంలోనే అతడు ప్రతి వారం పోలీస్ స్టేషన్ కు హాజరవుతున్నాడు.ఆ కేసులో ఛార్జ్ సీట్ ధాఖలు  చేయడానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ కనుకయ్య ఎస్సై సిద్ధేశ్వర్ తో కలిసి ఆ బాధితుడి నుంచి...