Posts

Showing posts from February, 2026

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులుగా మేంగని చంద్రశేఖర్

Image
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులుగా మేంగని చంద్రశేఖర్ జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్...  తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా మేంగని చంద్రశేఖర్ ను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్ నియమించడం జరిగింది.ఆయన ఆదేశానుసారం నియామక పత్రం మేంగని చంద్రశేఖర్ కి అందించడం జరిగింది.ఈ సందర్భంగా మేంగాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పెద్దపల్లి జిల్లా పరిధిలోగల అన్ని మండలాలలో వారం రోజుల్లో మండల కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలంగాణ ఉద్యమకారుల యొక్క హామీలు అమలు అయంత వరకు పోరాటం కొనసాగిస్తామని వారు తెలపడం జరిగింది.ఆయన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్, ఉపాధ్యక్షులు పడిగేలా రవీందర్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉద్యమకారుల ఫోరం చైర్మన్ కనకం కుమారస్వామికి తెలంగాణ ఉద్యమకారులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు

ఆర్కేపిలో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి-ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్...

Image
ఆర్కేపి లో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి-ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్... జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్... రామకృష్ణాపూర్ న్యూస్,ఫిబ్రవరి-25,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ ప్రధాన రహదారి పై బుధవారం రాత్రి  అర్థగంట క్రితం ట్రాక్టర్ ఢీకొనడంతో మందమర్రి కి చెందిన పి.మల్లేశ్వరి(38) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.ఆ క్రమంలో చూస్తే...బైకుపై ఇద్దరు వస్తుండగా ఎదురుగా ఒక ట్రాక్టర్ కూడా రావడంతో అదే సమయంలో 2 ఎద్దులు పోట్లాడుతూ బైక్ మీదకు రావడంతో బైక్ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఎడమవైపు ఆ బైకుపై కూర్చున్న మహిళ కుడివైపు పడడంతో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఆమె తల మీద వెళ్ళింది.దాంతో ఆమె తల పగిలి మెదడు బయటికి వచ్చి తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందింది.ప్రధానంగా చూస్తే..ట్రాక్టర్ డ్రైవర్ స్పీడ్ తో డ్రైవింగ్ చేయడం అలాగే ఎద్దులు కూడా  బైకు మీదకు రావడం చేత అవి పోట్లాడుకోవడం చేత బైకుకు ఎదురుంగా అడ్డంగా రావడంతోనే ఆ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.ఆ విషయం తెలిసిన వెంటనే రామకృష్ణాపూర్ స...

బాల్కసుమన్ పిటిషన్ ఎల్లుండికి వాయిదా!జర్నలిస్టు టీవీ ఛానల్ సర్వేలో అన్ని నిజాలే చెప్పాం

Image
బాల్కసుమన్ పిటిషన్ ఎల్లుండికి వాయిదా!జర్నలిస్టు టీవీ ఛానల్ సర్వేపై విశేషమైన ఆదరణ బాల్కసుమన్ పిటిషన్ ఎల్లుండికి వాయిదా!జర్నలిస్టు టీవీ ఛానల్ సర్వేపై విశేషమైన ఆదరణ జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్....

బ్రెయిన్ ఆపరేషన్ చేస్తుండగా గిటార్ వాయించాడు

Image
బ్రెయిన్ ఆపరేషన్ చేస్తుండగా గిటార్ వాయించాడు జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్... మెదడులోని కణితిని తొలగించేందుకు వైద్యులు'అవేక్ క్రానియోటమి'అనే ఆపరేషన్ చేస్తున్నారు.ఆ పద్ధతిలో రోగి మేల్కొని ఉండగానే ఆపరేషన్ చేస్తారు.ఇటీవల ఓక రోగి గిటార్ వాయిస్తుండగా ఈ చికిత్స విజయవంతంగా ముగిసింది.ప్రధానంగా మాటలు,కదలికలకు అంతరాయం కలగకుండా ఉండేందుకే వైద్యులు ఈ విధానాన్ని ఎంచుకుంటారు.ప్రస్తుతం భారత్లోని ఎయిమ్స్,సిఎంసి వెల్లూర్ వంటి ప్రముఖ ఆసుపత్రులలో 30ఏళ్లుగా ఈ అత్యాధునిక సౌకర్యం అందుబాటులో ఉంది.

ప్రజలను రక్షిస్తున్న పోలీసులకు సెల్యూట్-ఆర్కేపిలో బంద్ సక్సెస్!

Image
జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్...

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై పోలీసు కేసు నమోదు

Image
రామకృష్ణపూర్ న్యూస్,ఫిబ్రవరి-17,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్:మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ పై దేవాపూర్ ఎస్ హెచ్ ఓ గంగారాం ఫీర్యాదు చేశారు.ఆ క్రమంలో చూస్తే..క్యాతన పల్లి మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం పురస్కరించుకుని పోలీసుల యొక్క బందోబస్తు విధులకు ఆటంకం కలిగించడం,కోటపల్లి ఎస్సై రాజశేఖర్,కానిస్టేబుల్ రాకేష్ లకు గాయాలు చేసినట్లు ఆ దాడికి పాల్పడిన బాల్క సుమన్,మూల రాజిరెడ్డి,గుడిసెల రాజా రమేష్,గాజుల చంద్ర కిరణ్,మేడిపల్లి సంపత్,గోగుల రవీందర్ రెడ్డిలపై చట్టరీత్యా అండర్ సెక్షన్ 189(3),191(2),191(3),121(2),223 r/w 190 BNS సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

క్యాతనపల్లిలో-16న చైర్మన్-వైస్ చైర్మన్ లు ప్రమాణ స్వీకారం-మంత్రి అభివృద్ధి చేసిన ఓటమి ఏంటి?వీక్షించండి

Image
క్యాతనపల్లిలో-16న చైర్మన్-వైస్ చైర్మన్ లు ప్రమాణ స్వీకారం-మంత్రి అభివృద్ధి చేసిన ఓటమి ఎందుకు-వీక్షించండి? జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్....

💥దేశమే శ్వాసగా,దేశ రక్షణే ధ్యేయంగా...

Image
 *💥దేశమే శ్వాసగా,దేశ రక్షణే ధ్యేయంగా...* జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్.... *అనుక్షణం కంటికి రెప్పలా దేశాన్ని కాపాడుతూ....* *అణువణువునా దేశభక్తిని,గుండెలనిండా..ఈ దేశం మీద ప్రేమను నింపుకొని పుల్వామా దాడిలో అమరులైన వీర సైనికులకు జోహార్లు అర్పిస్తున్నాను....* *మీ త్యాగం వృధాకాదు,మీ ఆశయం ఆగిపోదు,మీ వెంటే మేము....

క్యాతనపల్లిలో బిఆర్ఎస్-సిపిఐ హవా!మెజార్టీ స్థానాలు దక్కించుకుంది

Image
క్యాతనపల్లిలో బిఆర్ఎస్-సిపిఐ హవా!మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్... రామకృష్ణాపూర్ న్యూస్,ఫిబ్రవరి-13,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులకు జరిగిన పోలింగ్ లో శుక్రవారం పట్టణంలో ఆర్కేసిఓఏ క్లబ్లో కౌంటింగ్ ప్రక్రియ భారీ ఎత్తున నిర్వహించారు.దాంట్లో చూస్తే..1వ వార్డు నుంచి 22 వార్డు వరకు ప్రజల ఓట్ల చేత గెలుపొందిన బిఆర్ఎస్,సీపీఐ,కాంగ్రెస్ పార్టీలతోపాటు ఇండిపెండెంట్ గా గెలుపొందిన అభ్యర్థుల పేర్లను సంబంధిత అధికారులు ప్రకటించారు.దాంట్లో చూస్తే..ఒకటో వార్డు సిపిఐ అభ్యర్థి సాంబయ్య కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ పై గెలుపొందాడు.రెండవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పొల్లూరి కళ్యాణ్ భార్య సిపిఐ అభ్యర్థిని ఆర్.లక్ష్మణ్ భార్యపై గెలుపొందారు.మూడవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మల్లమ్మ బిఆర్ఎస్ అభ్యర్థిని జయమ్మ పై గెలుపొందారు.నాలుగో వార్డు బైఆర్ఎస్ అభ్యర్థి జంజిపల్లి శ్రీధర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామగిరి శ్రీనుపై గెలుపొందాడు.ఐదవ వార్డు అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి దామర రమేష్ బ...

ఆర్కేసిఓఏ క్లబ్ వద్ద భారీ పోలీసు బందోబస్తు-బెల్లంపల్లి ఏసిపి

Image
ఆర్కేసిఓఏ క్లబ్ వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు -బెల్లంపల్లి ఏసిపి ఆర్కేసిఓఏ క్లబ్ వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు -బెల్లంపల్లి ఏసిపి జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్... రామకృష్ణాపూర్ న్యూస్,ఫిబ్రవరి-12,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులకు జరిగిన మున్సిపల్ కౌన్సిలర్ పోలింగ్ యొక్క కౌంటింగ్ సెంటర్ కాబడిన ఆర్కేసిఓఎ క్లబ్బును బెల్లంపల్లి ఏసిపి ఏ.రవికుమార్ గురువారం సాయంత్రం సంబంధిత పోలీస్ అధికారులతో కలిసి సందర్శించారు.ఆ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ..పోలీసులకు పలు సూచనలు చేశారు.ఆ కౌంటింగ్ కేంద్రానికి ఇరువైపులా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అలాగే క్యాతనపల్లి కమిషనర్ మారుతి ప్రసాద్,పట్టణ ఎస్సై జే.శ్రీధర్ మాట్లాడారు.ఆ కార్యక్రమంలో మందమర్రి సిఐ పి.రమేష్,ఏసిపి,సిఐలు,ఎస్ఐలు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

క్యాతనపల్లిలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి

Image
క్యాతనపల్లిలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి  జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్...   రామకృష్ణాపూర్ న్యూస్,ఫిబ్రవరి-11,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులలో బుధవారం జరిగిన మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా సజావుగా కొనసాగింది.ఆ క్రమంలో చూస్తే..పట్టణంలోని అన్ని వార్డులకు సంబంధించిన ఓటర్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ యొక్క అమూల్యమైన ఓటు హక్కును మంచిగా వినియోగించుకున్నారు.ప్రధానంగా చూస్తే..29 వేల 731 మంది పట్టణ మున్సిపాలిటీ పరిధిలో ఓటర్లు ఉన్నారు.దాంట్లో మహిళలు 14,998 వరకు ఉన్నారు.అలాగే పురుషులు విషయంలో 14,732 వరకు ఉన్నారు.ముఖ్యంగా అన్ని వార్డులలో సంబంధిత అధికారులు దాదాపు మొత్తంగా 45 పోలింగ్ బూతులు ఏర్పాటు చేయడంతో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.

క్యాతనపల్లిలో ఓటుకు పెద్ద నోటులు ఇస్తున్నారని నిలదీసింది

Image
ఓటుకు పెద్ద నోటులు ఇస్తున్నారని నిలదీసిన స్వతంత్ర అభ్యర్థిని  జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్... రామకృష్ణాపూర్ న్యూస్,ఫిబ్రవరి-11,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని  ఏరియా హాస్పిటల్ రోడ్డులో గల సెయింట్ జోసఫ్ స్కూల్ యొక్క పోలింగ్ బూత్ 21లో ఆ వార్డుకు చెందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని స్వర్ణలతకు చెందిన ఐదుగురు అనుచరులు ఓటుకు పెద్ద నోట్లు ఇస్తుండడంతో అదే వార్డుకు చెందిన స్వతంత్ర అభ్యర్థిని దోమల సౌజన్య ఆమె భర్త తిరుపతి వాళ్లకు సంబంధించిన వ్యక్తులు పట్టుకొని నిలదీశారు. ఆ సందర్భంగా స్వతంత్ర అభ్యర్థిని మాట్లాడుతూ..ఆమె గెలుపును చూసి ఓర్వలేకనే ఆ విధంగా చేస్తున్నారని దానిపై ఆమెకు న్యాయం చేయాలని అధికారులను ఆమె డిమాండ్ చేశారు.ఆ విషయమై బిఆర్ఎస్ పార్టీ నాయకులను అవార్డుకు సంబంధించిన పార్టీ శ్రేణులను జర్నలిస్టు టీవీ ఛానల్ ప్రశ్నించగా అది పుకారు మాత్రమే అని కొట్టి పరేశారు.

సింగరేణి సిఎండిగా డా.జ్యోతి బుద్ధ ప్రకాశ్

Image
సింగరేణి సిఎండిగా డా.జ్యోతి బుద్ధ ప్రకాశ్ నియామకం సింగరేణి ప్రతినిధి ఫిబ్రవరి 11,జర్నలిస్ట్ తెలుగు దినపత్రిక న్యూస్: రాష్ట్ర ప్రభుత్వ సేవల్లో కీలక మార్పులు చేపడుతూ..2002 బ్యాచ్ ఐఏఎస్ అధికారి డా. జ్యోతి బుద్ధ ప్రకాశ్ ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం బుధువారం ఉదయం  ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు షెడ్యూల్డ్ కాస్ట్స్ డెవలప్‌మెంట్ శాఖలో కార్యదర్శిగా సేవలందించిన డా. జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ను ఆ బాధ్యతల నుంచి బదిలీ చేస్తూ, రాష్ట్రంలోని కీలక ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. అదే ఉత్తర్వుల్లో, సింగరేణి సీఎండీ గా ఫుల్ అడిషనల్ చార్జ్ నిర్వహిస్తున్న డి. కృష్ణ భాస్కర్, ఐఏఎస్‌ను ఆ అదనపు బాధ్యతల నుంచి విడుదల చేశారు. డా. జ్యోతి బుద్ధ ప్రకాశ్ పరిపాలనా రంగంలో విస్తృత అనుభవం కలిగిన అధికారి. జిల్లా కలెక్టర్‌గా,ఎన్నికల విభాగంలో ఉన్నత బాధ్యతలు, రవాణా శాఖ, కాలుష్య నియంత్రణ మండలి వంటి విభాగాల్లో కీలక పదవుల్లో పనిచేశారు. వైద్య విద్యాభ్యాసం కలిగిన అధికారి అయినప్పటికీ, పరిపాలనా సేవల్లో సమర్థుడిగా గుర్తింపు పొందారు. అయితే గత...

క్యాతనపల్లిలో కౌన్సిలర్ గా గేలిచేది ఎవరు?జర్నలిస్టు టీవీ ఛానల్ సర్వే మీకోసం..వీక్షించండి

Image
క్యాతనపల్లిలో కౌన్సిలర్ గా గేలిచేది ఎవరు?జర్నలిస్టు టీవీ ఛానల్ సర్వే మీకోసం..వీక్షించండి  జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్ ప్రత్యేకం.... రామకృష్ణాపూర్ న్యూస్,ఫిబ్రవరి-10,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 22 వార్డులలో ఈ నేల-11న జరగబోతున్న కౌన్సిలర్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా జర్నలిస్టు టీవీ ఛానల్ ప్రత్యేకమైన సర్వే చేసింది.ఈ సర్వేలో మొదటి వార్డు నుంచి 22వ వార్డు వరకు పోటీ చేస్తున్న వారిలో ఎవరి మధ్యన పోటీ ఉండబోతుంది అనేది తేలింది.ఈ ఎన్నికలు పట్టణంలోని వివిధ వార్డులలోనీ ఎన్నికల బూతులలో ఈ నేల-11న సంబంధిత అధికారులు నిర్వహించబోతున్నారు.దాంతో ఎన్నికల అనంతరం పట్టణంలోని సింగరేణి ఆర్కే శివయ్య క్లబ్బులో ఈ నేల-13న ఓట్ల లెక్కింపు కూడా జరగబోతుంది.అలాగే16 తేదీన చైర్మన్ ను ఎన్నుకుంటారు.అలాగే వైస్ చైర్మన్ ఎవరు ఇంకా నామినేటెడ్ పోస్టులు ఎవరికి వస్తాయనేది కూడా ఆరోజు లేదా తదుపరి రోజు తెలుస్తుంది. ప్రధానంగా చూస్తే..గత వారం రోజులుగా చేపట్టిన సర్వేలో జర్నలిస్టు టీవీ ఛానల్, జర్నలిస్టు డైలీ న్యూస్ పేపర్,జర్నలిస్టు 24 గంటలు వె...

పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉండాలి-ప్రచారం చేయరాదు,బెల్లంపల్లి ఏసిపి

Image
క్యాతనపల్లిలో పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉండాలి -ఎన్నికల ప్రచారం చేయరాదు  బెల్లంపల్లి ఏసిపి ఏ.రవికుమార్ జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్.... రామకృష్ణాపూర్ న్యూస్,ఫిబ్రవరి-9,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులకు ఈ నేల-11న జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలలో కౌన్సిలర్ గా పోటీ చేసే అభ్యర్థులు వాళ్ల యొక్క సన్నిహితులు ఇతరులు ఎవరైన కూడా పోలింగ్ బూతులకు దూరంగా ఉండాలని బెల్లంపల్లి ఏసీపీ ఏ.రవికుమార్ తెలిపారు.ఆ క్రమంలో చూస్తే..మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో సోమవారం సాయంత్రం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంను మందమర్రి సిఐ పి.రమేష్,సిఐ రమేష్ బాబు,ఆర్కేపి ఎస్ఐ జే.శ్రీధర్,ఎస్సైలుతో కలిసి నిర్వహించారు.ఆ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ..ఎన్నికల నియమ,నిబంధనలు అందరూ క్రమశిక్షణతో తప్పకుండా పాటించాలని సూచించారు.ఎన్నికల సంఘం ఆదేశాలను యొక్క నిబంధనలు బేకతారు చేసిన లేదా ఉల్లంఘించిన వ్యక్తుల మీద చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎన్నికల ప్రచారం ముగిసింది-క్యాతనపల్లి అభ్యర్థులలో ఉత్కంఠ ఎక్కువైంది?

Image
ఎన్నికల ప్రచారం ముగిసింది-క్యాతనపల్లి అభ్యర్థులలో ఉత్కంఠ ఎక్కువైంది జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్ రామకృష్ణాపూర్ న్యూస్,ఫిబ్రవరి-9,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఫిబ్రవరి 9 సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది.ఆ క్రమంలో చూస్తే..మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులలో పోటీ చేస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ,బిఆర్ఎస్-సీపీఐ పొత్తుల పార్టీ,స్వతంత్రగా పోటీ చేసే అభ్యర్థుల మధ్య తీవ్రమైన ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.గత కొన్ని రోజులుగా హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ఎన్నికల సంఘం ఆదేశానుసారం ముగుస్తుంది.దాంతో ఇప్పటివరకు ప్రచార జోరులో హోరెత్తిన సంబంధిత రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థుల గుండెల్లో టెన్షన్ మొదలైంది.ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన ప్రచారం ఒక ఎత్తు అయితే మళ్ళీ ఇప్పటినుంచి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ రోజు సమయం వరకు మరో ఎత్తుగా రాజకీయ ఎత్తుగడలతో తీవ్రమైన ఆలోచనలతో గెలుపే ధ్యేయంగా ఇంకా అన్ని రకాలుగా ఓటర్లను దగ్గరగా మచ్చిగా చేసుకోవడానికి పోటీ చేస్తున్న కొంతమంది అభ్య...

15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న పెండ్యాల దేవేంద్ర రెడ్డమ్మ అనే నన్ను భారీ మెజార్టీతో గేలిపించాలి

Image
 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న పెండ్యాల దేవేంద్ర రెడ్డమ్మ అనే నన్ను భారీ మెజార్టీతో గేలిపించాలి జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్

11వ వార్డు అభ్యర్థిని జి.సుమలత అనే నన్ను అధిక మెజార్టీతో గేలిపించాలి

Image
 11వ వార్డు జనసేన పార్టీ అభ్యర్థిని జి.సుమలత అనే నన్ను అధిక మెజార్టీతో గెలిపించాలి జర్నలిస్టు తెలుగు దినపత్రిక- టీవీ ఛానల్ న్యూస్

10వ వార్డు బిఆర్ఎస్ పార్టీ వీనంక శ్రీనివాస్ అనే నన్ను అధిక మెజార్టీతో గేలిపించగలరు

Image
 10వ వార్డు బిఆర్ఎస్ పార్టీ వీనంక శ్రీనివాస్ అనే నన్ను అధిక మెజార్టీతో గెలిపించగలరు

15వ వార్డు అభ్యర్థిని అరుణ సంధ్య-సతీష్ అనే నన్ను అధిక మెజార్టీతో గేలిపించగలరు

Image
 15వ వార్డు అభ్యర్థిని అరుణ సంధ్య-సతీష్ అనే నన్ను అధిక మెజార్టీతో గెలిపించగలరు జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్

11వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి దుర్గాల విక్రం అనే నన్ను అధిక మెజార్టీతో గేలిపించగలరు

Image
 11వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి దుర్గాల విక్రం అనే నన్ను అధిక మెజార్టీతో గేలిపించగలరు

మాజీ మంత్రి హరీష్ రావు ఆర్కేపిలో ఎన్నికల ప్రచారం-గులాబీ,ఎరుపు శ్రేణుల్లో నూతన ఉత్తేజం

Image
మాజీ మంత్రి హరీష్ ఆర్కేపిలో ఎన్నికల ప్రచారం-గులాబీ,ఎరుపు శ్రేణుల్లో నూతన ఉత్తేజం  మాజీ మంత్రి హరీష్ రావు ఆర్కేపిలో ఎన్నికల ప్రచారం-గులాబీ,ఎరుపు శ్రేణుల్లో నూతన ఉత్తేజం  జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్.... మాజీ మంత్రి హరీష్ రావు,మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్,ఏఐటీయుసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ప్రసంగం.... 15 మంది బిఆర్ఎస్ అభ్యర్థులు,7గురు సిపిఐ అభ్యర్థులను పొత్తు ఎన్నికల్లో గేలిపించాలన్నారు. రామకృష్ణాపూర్ న్యూస్,ఫిబ్రవరి-6,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్;మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ పట్టణంలో శుక్రవారం సాయంత్రం మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మున్సిపల్ ఎన్నికలలో భాగంగా పర్యటించారు.ఆ సందర్భంగా పట్టణంలోని రాజీవ్ చౌక్ వద్ద ఏర్పాటుచేసిన సభలో వేదికపై ఆయన ప్రజలను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో కలిసి ప్రసంగించారు.

10వ వార్డు స్వతంత్ర అభ్యర్థి మహేందర్ అనే నన్ను భారీ మెజారిటీతో గేలిపించాలి

Image
మహేందర్ అనే నేను 10వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నన్ను భారీ మెజార్టీతో గేలిపించాలి జర్నలిస్టు తెలుగు దినపత్రిక,టీవీ ఛానల్ న్యూస్....

9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి భీమా మల్లేష్ అనే నన్ను భారీ మెజార్టీతో గేలిపించగలరు

Image
9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి భీమా మల్లేష్ అనే నన్ను అధిక మెజార్టీతో గెలిపించగలరు జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్..

11వ వార్డు బిజెపి కౌన్సిలర్ సంపత్ అనే నన్ను భారీ మెజార్టీతో గేలిపించండి

Image
 11వ వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి సంపత్ అనే నన్ను భారీ మెజార్టీతో గేలిపించండి జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్

క్యాతనపల్లి-14వ వార్డులో ఇంటింటా ప్రచారం-కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ కుమార్

Image
14వ వార్డులో ఇంటింటి ప్రచారం... రామకృష్ణాపూర్‌ న్యూస్,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ ఫిబ్రవరి 5: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నాగుల రాజ్‌ కుమార్‌ ఇంటింటికి ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించారు.గురువారం వార్డులోని పోచమ్మబస్తీ, మల్లిఖార్జున్‌ నగర్‌లో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు.ఆ సందర్బంగా నాగుల రాజ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఈనెల 11న జరిగే మున్సిపల్‌ ఎన్నిలలో  ఆయనకు ఆశీర్వదించి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే వాళ్ల యొక్క వార్డును అభివృద్ది చేసి చూపిస్తాన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం,కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వల్ల చెన్నూర్‌ నియోజక వర్గంలో అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతుందన్నారు.మున్సిపల్‌ ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మేజార్టీతో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.ఆ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు,వార్డు ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

క్యాతనపల్లిలో జోరుగా-హుషారుగా డిజె సాంగ్స్ తో ప్రచారం

Image
డిజె సౌండ్స్,డాన్సులతో క్యాతనపల్లిలో జోరుగా-హుషారుగా ఎన్నికల ప్రచారం

అక్రమ మద్యం బాటిళ్లు పట్టివేత-ఆర్కేపి ఎస్ఐ శ్రీధర్

Image
అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లు పట్టివేత ఆర్కేపి ఎస్ఐ జే.శ్రీధర్ జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్..... రామకృష్ణాపూర్ న్యూస్,ఫిబ్రవరి-4,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్యాతన పల్లి మున్సిపాలిటీలో గల 10వ వార్డులోని ఆల్జా చంద్రయ్య నివాసంలో అక్రమంగా నిల్వ ఉంచిన 87 లీటర్ల మద్యం(12 కాటన్స్)అంచనా విలువ రూ96,228/-ను స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జే.శ్రీధర్ తెలిపారు.మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు సంబంధిత మద్యం తెచ్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు.ఆ విషయంలో చంద్రయ్యను విచారించగా ఆ స్వాధీనం చేసిన మద్యం 10వ వార్డులో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి కాబడిన గోలపెల్లి మహేందర్‌కు చెందినదిగా తేలిందని పోలీసులు కనుగొన్నట్లు తెలిపారు.ఆ సమాచారం అందిన వెంటనే ఎస్‌ఐ జె. శ్రీధర్ నేతృత్వంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి అక్కడి ప్రాంతంలోని మద్యం స్వాధీనం చేసుకున్నారు.ఆ మేరకు చట్టప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎన్నికల సమయంలో అక్రమ మద్యం,నగదు పంపిణీ వంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హ...

క్యాతనపల్లిలో పోటీ చేసే అభ్యర్థులు గొడవలు చేయరాదు-సిఐ హెచ్చరికలు

Image
క్యాతనపల్లి కౌన్సిలర్ పోటీ చేసే అభ్యర్థులు గొడవలకు ఆస్కారం ఇవ్వకూడదు  జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్... రామకృష్ణాపూర్ న్యూస్,ఫిబ్రవరి-4,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్:మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా ఎన్నికలను సామరస్యంగా నిర్వహించుకోవాలని మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి.రమేష్ తెలిపారు.ఎలాంటి గొడవలు,అల్లర్లు చేయకూడదని శాంతియుత వాతావరణంలో మాత్రమే ఎన్నికలు జరిగే విధంగా చూసుకోవాలని సూచించారు.ముఖ్యంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పోటీ చేసే అభ్యర్థులు వాళ్ల అనుచరులు ఇతరులు ఎవరైనా కూడా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే పోలీసు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.ఆ కార్యక్రమంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ మారుతి ప్రసాద్,పోటీ బరిలో ఉన్న అభ్యర్థిని,అభ్యర్థులు,సిబ్బంది పాల్గొన్నారు.

క్యాతనపల్లిలో-113 మంది అభ్యర్థులు పోటి-80 మంది విత్ డ్రా..

Image
క్యాతనపల్లి మున్సిపల్ లో113 మంది అభ్యర్థులు పోటి-80 మంది విత్ డ్రా అయ్యారు    జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్... రామకృష్ణాపూర్ న్యూస్,ఫిబ్రవరి-3,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: ఈనెల-11న జరిగే మున్సిపల్ ఎన్నికలలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులలో దాదాపు 113 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.ఆ క్రమంలో చూస్తే..మంగళవారం మున్సిపాలిటీ ఆఫీసులో జరిగిన విత్ డ్రా ప్రోగ్రాంలో 80 మంది పోటీ చేసే అభ్యర్థులు విత్ డ్రా అయ్యారు.ముఖ్యంగా చూస్తే... ఈ ఎన్నికల పోటీలలో మొత్తంగా 193 అభ్యర్థుల నుంచి నామినేషన్లు వచ్చాయి.దాంతో 22 వార్డులో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు అన్ని ఈ క్రింద చూపెట్టిన విధంగా ఉన్నాయి.దాంట్లో చూస్తే...కాంగ్రెస్ పార్టీ 22 అభ్యర్థులు,బిఆర్ఎస్ సిపిఐ పొత్తుతో కలిపి బిఆర్ఎస్ 15 మంది అభ్యర్థులు సిపిఐ 7 గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.అలాగే బిజెపి 22 అభ్యర్థులు,జనసేన పార్టీ నలుగురు,ఏఐఎఫ్బి నలుగురు,సిపిఎం ఇద్దరూ,బి.ఎస్.పి ఇద్దరు,ఇండిపెండెంట్ లు 35 మంది మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల పోటీ బరిలో ఉన్నారు.అయితే బిఆర్ఎస్ పా...