Posts

Showing posts from July, 2026

ఆర్కేపిలో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ-ఘనంగా మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు

Image
ఆర్కేపిలో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ-ఘనంగా మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు  తెలంగాణ జర్నలిస్టు ప్రత్యేక సమాచారం దినపత్రిక... రామకృష్ణాపూర్ న్యూస్,జులై-7,తెలంగాణ జర్నలిస్టు ప్రత్యేక సమాచారం పేపర్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల క్యాతనపల్లి మున్సిపాలిటీ-రామకృష్ణాపూర్ పరిధిలోని సూపర్ బజార్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ 32వ జెండా పండుగతో పెద్ద ఎత్తున వాళ్ల యొక్క సంబంధిత పతాకం  ఆవిష్కరణ చేశారు.ఆ క్రమంలో చూస్తే..పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు పురస్కరించుకొని ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షుడు రాచర్ల సరేష్ మాదిగ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు కూడా పట్టణానికి చెందిన మాదిగ దండోరా శ్రేణులు ఒకరికి ఒకరు తినిపించుకున్నారు.తదానంతరం గర్ల్స్ హైస్కూల్లో విద్యార్థినిలకు పరీక్ష ప్యాడ్లు, పండ్లు  పంపిణీ చేసారు.ఆ కార్యక్రమంలోఎమ్మార్పీఎస్ నాయకులు పుల్లూరు కళ్యాణ్,ఆరుముల్లపోశం,కాదాసీ సంపత్,కన్నూరి రాజేందర్,ఆవునూరి గట్టయ్య,రామిల్లమల్లేష్,దాసరపు ఆగయ్య,మారపల్లి రాజయ్య,ఎల్లసాని శ్రీనివాస్,సలిగోమ్ముల రమేష్,ఎంఎస్ఎఫ్ నాయకులు మారపల్లి సాయికుమార్,రేణిగుంట్...

మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శం...

Image
మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శం... జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి తెలంగాణ జర్నలిస్టు ప్రత్యేక సమాచారం: జూలై- 4 పెద్దపల్లి ప్రతినిధి :మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శమని జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి తెలిపారు.శనివారం జిల్లా రెవెన్యూ అధికారి సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో నిర్వహించిన దొడ్డి కొమురయ్య వర్దంతి,కొణిజెటి రోశయ్య జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి దొడ్డి కొమురయ్య,కొణిజెటి రోశయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి మాట్లాడుతూ,దొడ్డి కొమురయ్య సాయుధ పోరాటంలో నేల రాలిన తొలి అమరుడని,నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛ వాయువులు పీల్చేందుకు ఆత్మ గౌరవ పతాకాన్ని ఎగుర వేసేందుకు ప్రాణాలు పణంగా పెట్టిన గొప్ప యోధుడు కొమురయ్య అని , ఆయన చూపిన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని  తెలిపారు.కొణిజేటి రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రిగా 16 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టారని,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మర్రి చెన్నారెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నేదురుమల్లి జ...