Posts

Showing posts from March, 2026

బిసి మహిళలకు రిజర్వేషన్ లలో సబ్ కోటాకై అమరణ దీక్షకు సిద్ధం!

Image
బిసి మహిళలకు రిజర్వేషన్ లలో సబ్ కోటాకై అమరణ దీక్షకు సిద్ధం! తెలంగాణ జర్నలిస్టు డైలీ న్యూస్ పేపర్-టీవీ ఛానల్ న్యూస్... మంచిర్యాల న్యూస్,మార్చి-30:బిసి కులాల ఉద్యమ పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పేరం అలేఖ్య హైకోర్టు ప్రముఖ న్యాయవాది తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. 2023 సెప్టెంబర్ లో బీ జే పీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళా రిజర్వేషన్ బిల్లులో 33 శాతానికై ఆగ మేఘాల మీద రెండు రోజులు పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేసి బిల్లును ఆమోదించడం జరిగినది. ఈ బిల్లులో బీసీ మహిళలకు అవకాశం లేకుండా అగ్రవర్ణాల వాళ్లకు ఉపయోగపడే విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించారు. దీనిని స్వతంత్ర భారతదేశంలోని 80 కోట్ల బీసీ జనాభాలో 40 కోట్ల మంది బీసీ మహిళలము వ్యతిరేకిస్తున్నాము.  ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును 2027లో అమలు చేయటానికి ఆమోదం పొందటానికి మళ్లీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు ఉపయోగపడే విధంగా 33 శాతంలో అర్ధ భాగం 16- 1/2 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కోరుత...

ఆర్కేపి సిఎస్ఐ చర్చిలో అత్యంత వైభవంగా మట్టల ఆదివారం వేడుకలు

Image
ఆర్కేపి సిఎస్ఐ చర్చిలో అత్యంత వైభవంగా మట్టల ఆదివారం వేడుకలు ఆర్కేపి సిఎస్ఐ చర్చిలో అత్యంత వైభవంగా మట్టల ఆదివారం వేడుకలు -  పాస్టర్ రెవారెండ్ ఎం.జాషువా దైవ సందేశం అందించారు -  తెలంగాణ జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్  రామకృష్ణాపూర్ న్యూస్,మార్చి-29,తెలంగాణ జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ పట్టణంలోని సీఎస్ఐ సెయింట్ పీటర్స్ చర్చి దేవాలయంలో ఆదివారం మట్టల ఆదివారం మహోత్సవం వేడుకలు ఆ చర్చి క్రైస్తవులు అత్యంత వైభవంగా నిర్వహించారు.ఆ క్రమంలో చూస్తే..సిఎస్ఐ మెదక్ డయాసిస్ సంఘంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల సెయింట్ పీటర్స్ చర్చి బ్రాంచ్ దైవజనులు పాస్టర్ రెవరెండ్ ఎం.జాషువా ఆధ్వర్యంలో మట్టల ఆదివారం వేడుకలు ఆ సంఘానికి చెందిన క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు.ఆ నేపథ్యంలోనే పట్టణంలోని యూనియన్ బ్యాంకు ముందు గల సిఎస్ఐ చర్చి దేవాలయం నుంచి స్థానిక అంబేద్కర్ అంగడి బజార్ వద్దకు సీఎస్ఐ చర్చి క్రైస్తవులు కొబ్బరి మట్టలు చేత పట్టుకొని పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి ఊరేగింపు చేశారు.దాంతో క్రైస్తవులందరూ కూడా ఒక క్రమశిక్షణతో ఇద్దరేసి చ...

విద్యార్థినిగా మారి ఆకతాయిలకు చెక్ పెట్టిన మహిళా ఎస్ఐ

Image
విద్యార్థినిగా మారి ఆకతాయిలకు చెక్ పెట్టిన మహిళా ఎస్సై విద్యార్థినుల భద్రత కోసం వినూత్న చర్యలు  పోలీసులపై ప్రజల్లో పెరిగిన నమ్మకం తెలంగాణ జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్  భూపాలపల్లి న్యూస్ :జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యార్థినుల భద్రత కోసం పోలీసులు తీసుకున్న వినూత్న చర్య ప్రజల్లో విశేషంగా చర్చనీయాంశమైంది.టేకుమట్ల మహిళా ఎస్సై అమూల్య,విద్యార్థిని వేషధారణలో పరీక్షా కేంద్రం వద్ద ప్రత్యక్షమై ఆకతాయిల ఆటకు చెక్ పెట్టారు.పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థినులను వేధిస్తున్నారనే సమాచారం అందుకున్న వెంటనే, పరిస్థితిని స్వయంగా తెలుసుకుని చర్యలు తీసుకోవాలని ఆమె నిర్ణయించారు. ఖాకీ యూనిఫాం వదిలి, సాధారణ విద్యార్థినిలా ఎరుపు రంగు డ్రెస్సులో చేతిలో పుస్తకాలు పట్టుకుని పరీక్షా కేంద్రానికి వెళ్లారు.విద్యార్థినుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు, పరీక్షా కేంద్రాల వద్ద పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ చర్యతో అక్కడి పరిసరాల్లో శాంతి నెలకొనడంతో పాటు, విద్యార్థినులు ధైర్యంగా పరీక్షలకు హాజరయ్యే పరిస్థితి ఏర్పడింది.మహిళల భద్రతకు పోలీసులు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ ఘటన మర...

ఆర్కేపి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో 'అరైవ్ అలైవ్'

Image
ఆర్కేపి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో 'అరైవ్ అలైవ్' ప్రోగ్రాం పట్టణ ఎస్ఐ జే.శ్రీధర్ సూచనలు జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్... రామకృష్ణాపూర్ న్యూస్,మార్చి-26,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్:రహదారి భద్రతే లక్ష్యంగా చేపట్టిన 'అరైవ్ అలైవ్' ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ లోనీ సింగరేణి ఏరియా హాస్పిటల్ లో పోలీసుల ఆధ్వర్యంలో సంబంధిత ప్రోగ్రాం నిర్వహించారు.ఆ సందర్భంగా  పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జే.శ్రీధర్ ఆసుపత్రిలోని ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు.అయితే మోటార్ సైకిల్ పై తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,ఫోర్ వీలర్ దారులు సీటు బెల్టు తప్పకుండా పెట్టుకోవాలని గుర్తు చేశారు.అలాగే వాహనంకు సంబంధించిన పత్రాలు కలిగి ఉండాలని సిబ్బందికి ఉండాల్సిన బాధ్యతలు,క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేశారు.దాంట్లో ముఖ్య అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.చిన్నపిల్లలకు టూవీలర్-ఫోర్ వీలర్ ఇవ్వకూడదని,అతివేగంగా ఆజాగ్రత్తగా నడపకుండా చూడాలని వాహనాలు ఇవ్వకూడదని సూచించారు.ప్రయాణికుల ప్రాణాలను కాపాడటమే ప్ర...

లోక్ సభ,అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు?

Image
లోక్ సభ,అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు? జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్... హైదరాబాద్ న్యూస్,మార్చి-24,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: భారతదేశ రాజకీయాల్లో కీలక మార్పులకు దారి తీసే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.ఆ క్రమంలో చూస్తే..లోక్‌సభ,రాష్ట్ర అసెంబ్లీ స్థానాలను 50% శాతం పెంచాలని నిర్ణయం తీసుకుంది.ఇందుకు సంబంధించిన బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశ పెట్టడానికి సిద్ధమైనట్లు తెలిసింది.దీని ప్రకారం..ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలు 816కి పెరగనున్నాయి.ఇదే విధంగా దేశవ్యాప్తంగా అసెంబ్లీ స్థానాలు కూడా 4,123 నుంచి 6,185కు పెరుగుతాయి.ఈ ప్రతిపాదనలో భాగంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌ లలో లోక్‌సభ,అసెంబ్లీ స్థానాలు గణనీయంగా పెరగనున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 లోక్‌సభ స్థానాలు 26కు..అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి పెరగనున్నాయి.అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి..అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263కు చేరే అవకాశం ఉంటుంది.ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సోమవారం సాయంత్రం ఎన్డీయే సమా వేశంలో కేంద్ర ప్రభుత్వం వామపక...

బొక్కలగుట్ట రోడ్డుపై ప్రమాదం-దంపతులకు తీవ్ర గాయాలు?ఫ్లాష్ న్యూస్..

Image
బొక్కలగుట్ట రోడ్డుపై ప్రమాదం-దంపతులకు తీవ్ర గాయాలు? -- జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్.... రామకృష్ణాపూర్ న్యూస్,మార్చి-24,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్:మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొక్కలగుట్ట జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య భర్తలు కాబడిన దంపతులకు తీవ్ర గాయాలు అయ్యాయి.జిల్లాలోని మందమర్రికి చెందిన సింగరేణి కార్మికుడు వెంకటస్వామి కేకే5 గనిలో ట్రామార్ గా ఉద్యోగం చేస్తున్నాడు.ఆయన భార్య పేరు సుమలత ఆ ఇద్దరు తీవ్రంగా రోడ్డు యాక్సిడెంట్లో గాయపడ్డారు.ఆ క్రమంలో చూస్తే..మంచిర్యాల నుంచి ద్విచక్ర వాహనంపై మందమర్రి వైపు వస్తున్న సమయంలో బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ ఆలయం సమీపంలోని వంతెనపై వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టినట్టు తెలుస్తుంది.ఆ రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆ ఇద్దరు దంపతులను స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భర్త మృతి చెందడంతో పాటు భార్య సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది.మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం...

రంజాన్ పండుగతో ముస్లింలకు శుభాకాంక్షలు-మంత్రి వివేక్

Image
రంజాన్ పండుగతో ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వివేక్ వెంకటస్వామి జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్..... రామకృష్ణాపూర్ న్యూస్,మార్చి-21,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: రంజాన్ పండుగ  పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముస్లిం సోదరి,సోదరులకు శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు.ఆ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రంజాన్ పండుగ శాంతి,సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని అందరి జీవితాల్లో ఆనందం,ఐశ్వర్యం నింపాలని,సమాజంలో ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు.ఆ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు గోపతి రాజయ్య,ప్రభాకర్,మల్లేష్,రమేష్,అబ్దుల్ అజీజ్,అక్బర్ అలీ,పల్లె రాజు,గాండ్ల సమ్మయ్య,పట్టణ ముస్లిం నాయకులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ముస్లిం సోదరులకు పవిత్ర మాసం రంజాన్ తో ఇఫ్తార్ విందు-మంత్రి వివేక్

Image
ముస్లిం సోదరులకు పవిత్ర మాసం రంజాన్ తో ఇఫ్తార్ విందు -- రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ జైపూర్ న్యూస్,మార్చి-19,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్:ముస్లిం సోదరులకు పవిత్ర మాసమైన రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుతో పాటు తోఫా అందిస్తుందని గురువారం రాష్ట్ర కార్మిక,ఉపాధి శిక్షణ,కర్మాగార,గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు.మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం  ఇందారం గ్రామంలోని మసీదులో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు,తోఫా పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాబు రావులతో కలిసి హాజరయ్యారు.ఆ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ..రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుతో పాటు తోఫా అందిస్తుందని తెలిపారు.జైపూర్ మండలానికి 350 మంజూరు చేయగా ఇందారం గ్రామానికి 250 కేటాయించడం జరిగిందని తెలిపారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ప్రజా ప్రతినిధులు,అధికార...

ఆర్కే-3 కనకదుర్గ దేవాలయంలో అత్యంత వైభవంగా అభిషేకం-పూజ

Image
ఆర్కే-3 మూతబడిన గని వద్ద కనకదుర్గ దేవాలయంలో అత్యంత వైభవంగా అభిషేకం-పూజ - భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన భక్తులు,అన్నదానం - జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్.... రామకృష్ణాపూర్ న్యూస్,మార్చి-19,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ పట్టణంలోని మూతబడిన ఆర్కే-3 భూగర్భ గని ప్రాంతంలోని కనకదుర్గా దేవి ఆలయంలో గురువారం అత్యంత వైభవంగా కనకదుర్గ దేవి తల్లికి పూజ మహోత్సవం నిర్వహించారు.ఆ నేపథ్యంలోనే ఉగాది పండుగ పురస్కరించుకొని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో అభిషేకం ఘనంగా చేపట్టారు.ఆ సందర్భంగా పూజారి కటకం కుమారస్వామి భక్తులను దృష్టిలో పెట్టుకొని జర్నలిస్టు టీవీ ఛానల్ తో మాట్లాడారు.అయితే గత 25 సంవత్సరాలుగా కనకదుర్గ దేవి ఆలయంలో అక్కడి ప్రాంతంలో భక్తిశ్రద్ధలతో పూజా మహోత్సవాలు పెద్ద ఎత్తిన చేపడుతున్నట్లు గుర్తు చేశారు.భక్తులు కూడా అధిక సంఖ్యలో విచ్చేసి పూజలు చేసి ఆ తల్లి ఆశీర్వాదాలు పొందుతున్నట్లు పేర్కొన్నారు.ముఖ్యంగా భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని కొబ్బరికాయలు కొట్టి తీర్థప్రసాదాలు స్వీకరించి మొక్కుబడులు సమర్పించుకోవడం పూజలు చేయడం కనిపించింది.అనంతరం...

గోవా గవర్నర్‌కు సీనియర్ జర్నలిస్టుల ఫెడరేషన్ వినతి!

Image
గోవా గవర్నర్‌కు సీనియర్ జర్నలిస్టుల ఫెడరేషన్ వినతి: సామాజిక భద్రత,సంక్షేమం కల్పించాలని విజ్ఞప్తి  జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్... సింగరేణి ప్రతినిధి, మార్చి 18,జర్నలిస్ట్ తెలుగు దినపత్రిక న్యూస్ :దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ జర్నలిస్టుల సామాజిక భద్రత, సంక్షేమం కోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ 'సీనియర్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా' ప్రతినిధి బృందం గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు ని కలిసింది. ఈ నెల 16వ తేదీన రాజ్ భవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రతినిధులు, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, కేంద్ర ప్రభుత్వానికి తగిన సిఫార్సులు చేయాలని కోరుతూ ఒక వినతిపత్రాన్ని అందజేశారు. పదవీ విరమణ పొందిన జర్నలిస్టులు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితులను ఈ సందర్భంగా ప్రతినిధి బృందం గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది. చాలా మీడియా సంస్థల్లో పెన్షన్ విధానం లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అరకొర పెన్షన్లు కేవలం అక్రిడిటేషన్ ఉన్న కొద్దిమందికే (ప్రధానంగా రాజధాని రిపోర్టర్లకు మాత్రమే) పరిమితం కావడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. సరైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు లేకపోవడం, గతం...

క్యాతనపల్లి కౌన్సిలర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల ఖర్చులు తెలుపాలి

Image
క్యాతనపల్లి కౌన్సిలర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల ఖర్చులు వివరాలు తెలుపాలి  - క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ మారుతీ ప్రసాద్ ప్రకటన  - జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్... రామకృష్ణాపూర్ న్యూస్,మార్చి-18,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల  క్యాతనపల్లి మున్సిపాలిటీకి జరిగిన 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో కౌన్సిలర్ గా పోటీ చేసిన సమస్త అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల యొక్క వివరాలు తెలపాలని బుధవారం క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ మారుతి ప్రసాద్ తెలిపారు.ఆ క్రమంలో చూస్తే..తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం హైదరాబాద్ ఆదేశాల మేరకు ఆ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తేదీ(13.02.2026 నుంచి 45 రోజులలో)ఎన్నికల ఖర్చు (ఎలక్షన్ ఎక్స్పెండిచర్) వివరములు నిర్ణీత ఫారంలో ఈ నెల తేదీ 27.03.2026 రోజు లోపు క్యాతనపల్లి పురపాలక సంఘం కార్యాలయంలో సమర్పించాలని ప్రకటించారు.ఆ ఎన్నికల ఖర్చు యొక్క ఫారములు పురపాలక సంఘంలో ఉచితంగా ఇస్తారని దాంతో నిర్ణీత గడువులోగా ఎన్నికల ఖర్చు వివరాలను పురపాలక సంఘం క్యాతనపల్లిలో సమర్పించని పక్షంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకొ...

సుల్తానాబాద్ శ్రీరామ్ నగర్ లో పోచమ్మ బోనాలు

Image
సుల్తానాబాద్ శ్రీరామ్ నగర్ లో పోచమ్మ బోనాలు మాజీ మున్సిపల్ కోఆప్షన్ మేంగని రాధ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ న్యూస్ మార్చి 18 జర్నలిస్టు దినపత్రిక-మీడియా న్యూస్: పెద్దపల్లి జిల్లా బ్యూరో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శ్రీరామ్ నగర్ వీది ప్రజలంతా మాజీ మున్సిపల్  కో ఆప్షన్ మేంగనీ రాధ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో  వాడ ప్రజలు అంతా ఐకమత్యంతో పోచమ్మ బోనాలు నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో వాడ ప్రజలు మహిళలు బోనం ఎత్తుకొని శోబయాత్రగా బయలుదేరి పురవీధుల గుండా పోచమ్మ తల్లి వద్దకు చేరుకొనీ పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మేకలతో మొక్కులు చెల్లించి నారు  ఇట్టి కార్యక్రమంలో విజ్ఞాన్ హై స్కూల్ కరస్పాండెంట్ అబ్బు బుచ్చిరెడ్డి వారి స్కూలు బృందంచే పోచమ్మ బోనాల పాట లతో నృత్యం చేయించినారు ఇట్టి విషయమై చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉగాదికి ముందు 33 కోట్ల దేవతలకు ముందు పోచమ్మ తల్లి దీవెనలు అందరిపై ఉండాలని పోచమ్మ తల్లికి బోనాలతో కొబ్బరికాయలు కోళ్లు మేకలతో మొక్కలు చెల్లించడం ఆనవాయితుగా వస్తున్నది అందులో భాగంగానే బుధవారం శ్రీరామ్నగర్ వీధి నుండి మహిళలు బోనాలతో డప్పు చప్పులతో పోచమ్మ...

ఆర్కేపి భగత్ సింగ్ నగర్ ప్రధాన రహదారిపై వెంటనే స్పీడ్ బ్రేకర్లు వేయాలి

Image
ఆర్కేపి భగత్ సింగ్ నగర్ ప్రధాన రహదారిపై తక్షణమే స్పీడ్ బ్రేకర్లు వేయాలి క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ స్పందించాలని ప్రజల విజ్ఞప్తి జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్... రామకృష్ణాపూర్ న్యూస్,మార్చి-16,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్:మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో ప్రధాన రహదారిపై వెంటనే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.ఆ క్రమంలో చూస్తే..భగత్ సింగ్ నగర్ లోని గణేష్ టెంపుల్ నుంచి విఠల్ నగర్ చౌరస్తా వరకు తక్షణమే ఆ రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు వేయాలని దాంతో రోడ్డు ప్రమాదాలు లేకుండా చూడాలని క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్(ఆఫీసర్)ను స్థానిక ప్రజలు కోరుతున్నారు.ముఖ్యంగా క్యాతనపల్లి కమిషనర్ అధికారి కాబడిన మారుతి ప్రసాద్ వెంటనే అక్కడి సమస్యలపై స్పందించాలని రోడ్డు ప్రమాదాల బారి నుంచి ప్రజలను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.ఇటీవల కాలంలో జరిగిన అక్కడి రోడ్డు ప్రమాదంలో స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్లనే అతి స్పీడ్ గా వస్తున్న వాహనాలతో పాటు అలాగే పశువులు ఎక్కువగా అక్కడి ప్రధాన రోడ్ పై ...

మందమర్రిలో స్విమ్మింగ్ పూల్ ప్రారంభించిన జిఎం రాధాకృష్ణ

Image
మందమర్రిలో స్విమ్మింగ్ పూల్ ప్రారంభించిన జిఎం రాధాకృష్ణ  -- జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్... మందమర్రి న్యూస్,మార్చి-14,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: సింగరేణి కాలరీస్ లోని మందమర్రి ఏరియాలో గల మందమర్రి సిఈఆర్ క్లబ్ లోని  స్విమ్మింగ్ పూల్ ను శనివారం మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్.రాధాకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై ఎట్టకేలకు రిబ్బన్ కట్ చేసి పున:ప్రారంభించారు.ఆ సందర్భంగా డివిజన్ జిఎం మాట్లాడుతూ..స్విమ్మింగ్ శిక్షణకు వచ్చేవాళ్లు స్విమ్మింగ్ పూల్ యొక్క నియమ, నిబంధనలు తప్పకుండా పాటించాలని గుర్తు చేశారు.స్విమ్మింగ్ కోచ్ యొక్క పర్యవేక్షణలో శిక్షణ తీసుకోవాలని సూచించారు.ఆ కార్యక్రమంలో మందమర్రి ఏరియా ఎస్.ఓ.టు జి.ఎం.జి.ఎల్ ప్రసాద్,మందమర్రి బ్రాంచ్ ఏఐటీయూసీ జాయింట్  సెక్రటరీ కంది శ్రీనివాస్,డివైపిఎం ఆసిఫ్,సివిల్ ఎస్ ఈ శ్రీధర్,సీనియర్ పర్సనల్ ఆఫీసర్ కార్తీక్,ఎస్.ఈ ఎలక్ట్రికల్ నరేష్,సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ రవి,సీనియర్ అధికారులు,గుర్తింపు సంఘం ఏరియా నాయకులు,పి.బానయ్య,ఈ రాజేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు.

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను అప్పగించిన ఆర్కేపి పోలీసులు

Image
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను అప్పగించిన ఆర్కేపీ పోలీసులు  -- ఎస్ఐ జే.శ్రీధర్ -- జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్... రామకృష్ణాపూర్ న్యూస్,మార్చి-14,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్)పోర్టల్ ద్వారా గుర్తించి పెద్ద సంఖ్యలో రికవరీ చేసినట్లు రామకృష్ణాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జే.శ్రీధర్ తెలిపారు.ఆ క్రమంలో చూస్తే...రికవరీ చేసిన(5)మొబైల్ ఫోన్లను వాళ్ల యొక్క యాజమానులకు శనివారం ఎస్సై అందించారు.ఆ మొబైల్ ఫోన్లు తిరిగి పొందిన సెల్ ఫోన్ల యొక్క యాజమానులు ఆనందం వ్యక్తం చేశారు.ఆ సందర్భంగా ఎస్‌.ఐ శ్రీధర్ మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేయడంలో కృషి చేసిన సీఈఐ ఆర్ పోర్టల్ ఆపరేటర్ పి.సి.ఎం.అఖిల్ ను అభినందించారు.అలాగే రికవరీలో సహకరించిన పోలీస్ ఐడి పార్టీ సిబ్బంది హెచ్‌.సి.కె.జంగు,పి.సి.వెంకటేష్ లను కూడా అభినందించారు.ఆ సీఈఐ ఆర్ పోర్టల్ ను భారత టెలికమ్యూనికేషన్స్ శాఖ ప్రవేశపెట్టింది.ప్రధానంగా మొబైల్ పోయినప్పుడు లేదా దొంగిలించబడ...

తెలంగాణలో 40 డిగ్రీలు దాటిన ఎండలు-రెండు రోజుల్లో ఉరుములతో వానలు

Image
తెలంగాణలో 40 డిగ్రీలు దాటిన ఎండలు-రెండు రోజుల్లో ఉరుములు-మెరుపులతో వానలు జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్.... మార్చి-14,హైదరాబాదు న్యూస్:తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఆ క్రమంలో చూస్తే...గురు,శుక్రవారాల్లో పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి.శుక్రవారం భద్రాద్రి-కొత్తగూడెం,నల్లగొండ,ఖమ్మం,నిజామాబాద్,జిల్లాల్లో 40.4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు.జగిత్యాల,కుమ్రం భీం ఆసిఫాబాద్‌,అదిలాబాద్, నారాయణపేట,పెద్దపల్లి జిల్లాల్లో 39.6 డిగ్రీలు,జనగామ,మంచిర్యాల జిల్లాల్లో 39.5 డిగ్రీలు నమోదయ్యాయి.హైదరాబాద్ లో 37.3 డిగ్రీలు నమోదైంది.శనివారం ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని,ఆదివారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. *రాబోయే రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు*...... ఆంధ్రప్రదేశ్,తెలంగాణలో రాబోయే రెండు మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.ఈ నెల-16 నుంచి 23 మధ్య తెలంగాణలో పలుచోట్ల వర్షాలు పడనున్నాయి.ఆదిలాబాద్,మంచిర్య...

గ్యాస్ సిలిండర్ బుక్ చేశారా!డెలివరీ చేయలేదా వెంటనే ఫిర్యాదు చేయండి?

Image
జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్... గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నా డెలివరీ కాకపోతే వినియోగదారులు ఫిర్యాదు చేయాలని సూచించిన ఆయిల్ కంపెనీలు. కేంద్రం కొత్త నిబంధనల ప్రకారం బుకింగ్ చేసిన తర్వాత సుమారు రెండున్నర రోజుల్లో సిలిండర్ డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ డెలివరీ ఆలస్యం అయితే.. ఇండేన్ గ్యాస్ కస్టమర్లు 1800-2333-555 లేదా 77189555555 భారత్ గ్యాస్ కస్టమర్లు 1800-22-4344 లేదా 77150123455 HP గ్యాస్ కస్టమర్లు 1800-2333-555 లేదా 9493602222 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని LPG కంపెనీలు ప్రకటించాయి.

పది పరీక్షలతో ఎగ్జామ్స్ సెంటర్లు వద్ద నిషేధాజ్ఞలు అమలు

Image
పది పరీక్షలతో ఎగ్జామ్స్ సెంటర్లు వద్ద నిషేధాజ్ఞలు అమలు రామకృష్ణాపూర్ ఎస్ఐ జే.శ్రీధర్  పరీక్షలు రాసే విద్యార్థులందరికీ పోలీసుల శుభాకాంక్షలు జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్... రామకృష్ణాపూర్ న్యూస్,మార్చి-13,జర్నలిస్టు తెలుగు దిన పత్రిక-టీవీ ఛానల్ న్యూస్:విద్యార్థులందరూ కూడా 365 రోజులు ఎంతో కష్టపడి చదువుకొని శనివారం నుంచి జరిగే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లలో ఆ మూడు గంటల్లోనే ప్రజెంట్ ఇవ్వాల్సి ఉంటుంది.విద్యార్థులు అందరూ కూడా ధైర్యంగా కాన్ఫిడెంట్గా ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ వ్రాసి మంచి ఫలితాలు సాధించాలని శుక్రవారం రామకృష్ణాపూర్ పోలీసులు కోరుతున్నట్లు పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జే.శ్రీధర్ తెలిపారు.పదవ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ఆ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.పట్టణ పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద శాంతిభద్రతల రక్షణలో భాగంగా సెక్షన్ 163 బి ఎన్ ఎస్ ఎస్(144 సెక్షన్)అమలు చేస్తున్నట్లు తెలిపారు.రామకృష్ణాపూర్  పరిధిలోని మొత్తం 2 పరీక్ష కేంద్రాల్లో 14 మార్చి నుంచి ఏప్రిల్ 16-2026 వరకు  ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ...

చల్లటి కబురు-ఈ నేల-16 తేదీతో వర్షాలు

Image
చల్లటి కబురు...ఈ నేల-16 నుంచి వర్షాలు జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్... తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు అందింది.తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతోన్న ఈ తరుణంలో అకాల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఆ క్రమంలో చూస్తే..ఈ నెల 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దాదాపు వారం రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసే విధంగా ఉన్నట్లు వెల్లడించారు.ఆ సందర్భంగా ఉరుములతో కూడిన వడగళ్ల వర్షం పడే ప్రమాదం కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు ప్రకటించారు.రంగారెడ్డి,కరీంనగర్,మహబూబ్ నగర్,అదిలాబాద్,నల్గొండ లాంటి జిల్లాల్లో కొన్నిచోట్ల వడగండ్ల వర్షాలు పడే ప్రమాదం ఉంచి ఉన్నట్లు స్పష్టం చేశారు.ఈ నెల చివరి దాకా ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయని కూడా తెలిపారు.ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు అని స్పష్టం చేశారు.మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 15వ తేదీ వరకు పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది.ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య నమోదు అవుతున్నాయి.మధ్యాహ్నం అయింది అంటే చాలు..విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరిగి...

టీమిండియాకు బిసిసిఐ భారీ నజరానా-ఎన్నికోట్లు తెలిస్తే..కళ్లు చేదరతాయి

Image
టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా..ఎన్ని కోట్లు తెలిస్తే కళ్లు చెదరడం ఖాయం! జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్... ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2026 విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) భారీ నజరానా ప్రకటించింది. ఇండియాకు వరుసగా రెండో టీ20 వరల్డ్ కప్ టైటిల్ అందించిన సూర్యకుమార్ యాదవ్ సేనకు రూ.131 కోట్ల కళ్లు చెదిరే నగదు బహుమతి ప్రకటించింది._ ఆటగాళ్లు,కోచింగ్ స్టాఫ్, సహాయక సిబ్బంది, సెలెక్టర్లందరికీ కలిపి రూ. 131 కోట్లు పంపిణీ చేయనున్నారు. 2026 టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు రూ. 131 కోట్ల నగదు బహుమతిని అందజేస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రకటించారు. కాగా 2024 టీ20 వరల్డ్ కప్ కూడా టీమిండియా గెల్చిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టుకు అప్పుడు బీసీసీఐ రూ.125 కోట్ల క్యాష్ ప్రైజ్ ప్రకటించింది. ఇక, 2026 టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన సూర్యకుమార్ సేనకు బీసీసీఐ రూ.131 కోట్ల నజరానా ప్రకటించింది. 2024 కంటే ఈసారి రూ. 6 కోట్లు అధికంగా నజరానాను పెంచింది బీసీసీఐ. టీ20 వరల్డ్ కప్-2026 విశ్వవిజేతగా భారత్ నిలిచిన విషయం...

కాల్వ శ్రీరాంపూర్ కేజీబీవీలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్

Image
కాల్వ శ్రీరాంపూర్ కేజీబీవీలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ మంచి పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారం అందించాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కాల్వ శ్రీరాంపూర్ కే.జి.బి.వీ ను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ కాల్వ శ్రీరాం పూర్ న్యూస్ మార్చి 10:-జర్నలిస్టు దినపత్రిక మరియు మీడియా న్యూస్ పెద్దపల్లి జిల్లా బ్యూరో:విద్యార్థినులకు మంచి పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు మంగళవారం  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కాల్వ శ్రీరాంపూర్ మండలంలో  కే.జి.బి.వీ ను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థినులతో కలిసి భోజనం చేసారు.ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష,*  కేజీబీవీ  లోని తరగతి గదులు డైనింగ్ హాల్  కిచెన్ ఏరియా పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న విద్యా బోధన, ఇతర సౌకర్యాల గురించి ఆరా తీశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా కేజీబీవీ పరిసరాలను క్లీన్ చేయాలని కలెక్టర్ తెలిపారు. విద్యార్థినులకు అందించే ఆహారం పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వ మార్గ దర్శకాల ప్రక...

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆర్కేపి పోలీస్ స్టేషన్ లో సైన్ చేశారు

Image
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ చేరుకొని సోమవారం సాయంత్రం సంతకం చేశారు. జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్...

టీ20 వరల్డ్ కప్-2026 విశ్వవిజేతగా భారత్

Image
 *టీ20 వరల్డ్ కప్-2026 విశ్వవిజేతగా భారత్* *ఫైనల్‎లో న్యూజిలాండ్‎పై 96 పరుగుల తేడాతో విజయం* *వరుసగా రెండో సారి టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకున్న భారత్* *ఫైనల్‌ మ్యాచ్‎లో  20 ఓవర్లలో భారత్ స్కోర్ 255/5* *జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్*...... *19 ఓవర్లలో159 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్* *హాఫ్‌ సెంచరీలతో రాణించిన అభిషేక్, సంజూ, ఇషాన్‌* *నీషమ్‎కు3 వికెట్లు..హెన్రీ, రవీంద్రకు తలో వికెట్* *హాఫ్ సెంచరీతో న్యూజిలాండ్ ఓపెనర్ టీమ్ సీఫెర్ట్  ఒంటరి పోరాటం* *4 వికెట్లతో న్యూజిలాండ్‎ను కుప్పకూల్చిన బుమ్రా* *అక్షర్ పటేల్‎కు 3, వరుణ్ చక్రవర్తి, పాండ్యా, అభిషేక్‎కు చెరో వికెట్* *చూస్తూనే ఉండండి...జర్నలిస్ట్ న్యూస్ పేపర్ అండ్ డైలీ టీవీ న్యూస్ ఛానల్.

మహిళా దినోత్సవం జరుపుకున్న తెలంగాణ ఉద్యమకారులు

Image
మహిళా దినోత్సవం జరుపుకున్న తెలంగాణ ఉద్యమకారులు కరీంనగర్ న్యూస్ మార్చి 8 జర్నలిస్టు దినపత్రిక పెద్దపల్లి జిల్లా బ్యూరో. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్ మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కనకం కుమార్ స్వామి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు కలిసి మహిళలందరికీ శాలువాతో సత్కరించి మానవ సృష్టికి మూలం స్త్రీ సమాజంలో స్త్రీ యొక్క పాత్ర రేపటి మానవ మనుగడకు మూలాధారం నేటి సమాజంలో వంటింటికి పరిమితమై ఎన్నో నిర్బంధాల మధ్యన నలిగిపోతున్న మహిళా సాధికారత కొరకై గొంతెత్తి నినదించిన మహిళామూర్తులు ఎంతోమంది పోరాటం పట్టిన నేటి సమాజానికి స్ఫూర్తి గనుకనే ఈరోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం గా ఏర్పాటు చేసుకుని మహిళలందరినీ గౌరవప్రదంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుల ఫోరం అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్ మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కనకం కుమారస్వామి రాష్ట్ర మరియు జిల్లా నాయకులు మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు

99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

Image
*99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి* *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* 99 రోజుల కార్యక్రమం పై పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పెద్దపల్లి న్యూస్, మార్చి 06: జర్నలిస్టు దినపత్రిక మరియు మీడియా న్యూస్ పెద్దపల్లి జిల్లా బ్యూరో:99 రోజుల కార్యక్రమాన్ని అధికారులు ప్రజాప్రతినిధులు సంయుక్తంగా పనిచేస్తూ విజయవంతం చేయాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.శుక్రవారం పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో  99 రోజుల కార్యక్రమం అమలు పై నిర్వహించిన సన్నాహక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు.ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* నూతనంగా గెలిచిన స్థానిక నాయకులకు ప్రజలలో మంచి పేరు సుస్థిరం చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని మార్చి 6 నుంచి మార్చి 15 వరకు జరిగే ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ లో స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కౌన్సిలర్ లకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పారిశుధ్య  సంబంధించి చేయాల్సిన పనులు చైర్ పర్సన్ దృష్టికి తీసుకొని వస్తె వెంటనే వాటిని పరిష్కరించడం...

అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్య-ఘోర విషాద ఘటన

Image
అప్పుల భారానికి ప్రాణాలు అర్పించకండి-సమాజానికి హెచ్చరికగా మారిన విషాద ఘటన జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్... మార్చి-5,జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్: మహబూబ్ నగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.ఆ క్రమంలో చూస్తే..అప్పుల బాధ తాళలేక ఒక దంపతులు ఆత్మహత్యకు యత్నించగా ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.జంగమయ్యపల్లి గ్రామానికి చెందిన దంపతులు తమ చిన్న పసిబిడ్డను పొలంలో ఉన్న ఉయ్యాలలో వదిలి,సమీపంలోని చెట్టుకు ఉరివేసుకున్నారు.ఆ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా,భర్త తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడింది.ఆ పొలంలో ఉయ్యాలలో ఒంటరిగా ఉన్న శిశువును గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.అప్పుల ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక సంబంధిత దంపతులు ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకున్నారని గ్రామస్థులు చెబుతున్నారు.ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని కలిగించింది.పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.అయితే ఈ విషాద ఘటన సమాజానికి ఒక గాఢమైన సందేశాన్ని ఇస్తోంది.అ...

అంతర్జాతీయ మహిళా దినోత్సవంతో మహిళలు రక్తదాన శిబిరంకు సిద్ధం

Image
అంతర్జాతీయ మహిళా దినోత్సవంతో మహిళలు రక్తదాన శిబిరంకు సిద్ధం! - మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం... మంచిర్యాల న్యూస్,మార్చి-5జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: ఈ ఏడాది మార్చి-8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని లయన్స్ మంచిర్యాల ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 జి డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్ ఫర్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ లయన్ వి.మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వనిత వాక్కు ఫౌండేషన్,నందగోపాల టీం వాళ్ల యొక్క సహాయసహకారాలతో మొట్టమొదటిసారి ప్రత్యేకంగా "మహిళల రక్తదాన శిబిరాన్ని" నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజర్ లయన్ వి.మధుసూదన్ రెడ్డి తెలిపారు.ఆ నేపథ్యంలోనే సంబంధిత మహిళల రక్తదాన శిబిరం మార్చి-7 శనివారము మధ్యాహ్నము ఒకటి గంట నుంచి నాలుగు గంటల వరకు మంచిర్యాలలోని సురభి ఏసీ హాల్లో రెడ్ క్రాస్ రక్తనిధి సౌజన్యంతో చేపడుతున్నట్లు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఆ రక్తదాన శిబిరము నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశము రక్తదానం మీద మహిళలను చైతన్యపరచుటకు వారికి అవగాహన కల్పించుట వాళ్ళని ప్రోత్సహించడంతోపాటు తరచూ రక్తదానానికి ప్రేరేపించడం తగిన విషయాలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.క...

గోల్డ్ చైన్ దొంగిలించిన మహిళను అరెస్టు చేసిన ఆర్కేపీ పోలీసులు-మందమర్రి సిఐ రమేష్

Image
గోల్డ్ చైన్ దొంగిలించిన మహిళను అరెస్టు చేసిన ఆర్కేపీ పోలీసులు  మందమర్రి సిఐ రమేష్ ప్రకటన  జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్... రామకృష్ణాపూర్ న్యూస్,మార్చి-5,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్:మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ లో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును రామకృష్ణాపూర్ పోలీసులు చేదించినట్లు మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి.రమేష్ తెలిపారు.ఆ క్రమంలో చూస్తే..2 మార్చి 2026 న రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సింగరేణి ఏరియా హాస్పిటల్ దగ్గర ఒక  మహిళ మెడలో నుంచి బంగారు పూస్తేలత్రాడు,సెల్ ఫోన్  దొంగతనం జరిగింది.ప్రధానంగా గాజoగి శ్రావణి అనే ఐబికాలనీ  గోధవరిఖని చెందిన మహిళను తాను గాథలో పరిచయం ఉన్న లాస్య  మభ్య పెట్టింది.దాంతో గోదావరిఖని నుంచి గల సింగరేణి ఏరియా హాస్పిటల్ రామకృష్ణాపుర్ తీసుకు వచ్చింది.శ్రావణి టాయిలెట్ కి వెళ్ళగా వెనుకలనే లాస్య వచ్చి వెనుక ఆమె మెడలో గల బంగారు పుస్తేలత్రాడు లాక్కొని తోసి వేయడంతో బాధితురాలు కింద పడిపోయింది.ఆమె మెడలో గల బంగారు   పుస్తెలత్రాడు,మొబైల్  ఫోన్ తీసుకొని రోడ్డు వైప...

కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెకు పిలుపు-వాసిరెడ్డి సీతారామయ్య

Image
కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెకు పిలుపునిస్తాం. స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో ఒప్పుకున్న డిమాండ్ లను అమలు చేయాలి. ఏసిబి కేసుతో సంబంధం లేకుండా మెడికల్ బోర్డును వెంటనే నిర్వహించాలి. మారుపేర్ల సమస్య పరిష్కరించాలి. పెర్క్స్ పై ఇన్ కంటాక్స్ యాజమాన్యమే చెల్లించాలి. మైనింగ్, క్లరికల్, ట్రేడ్స్ మెన్ ల సమస్యలను పరిష్కరించాలి. జనరల్ సమ్మె లో పాల్గొన్న కాంట్రాక్టు కార్మికుల నుంచి  జీతం రికవరీ చేయొద్దు. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలి. కొత్త గనులను సింగరేణికి కేటాయించాలని కేంద్ర ప్రభుత్వంపై ఆందోళనలు. గోదావరిఖనిలో జరిగిన ఏఐటియుసి కేంద్ర కమిటి సమావేశంలో సీతారామయ్య, రాజ్ కుమార్ ల వెల్లడి. సింగరేణి ప్రతినిధి, మార్చి 05,జర్నలిస్ట్ తెలుగు దినపత్రిక న్యూస్ : సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెకు పిలుపునిస్తామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటియుసి)అద్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య,ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ లు పేర్కొన్నారు.గురువారం గోదావరిఖనిలో జరిగిన ఏఐటియుసి కేంద్ర కమిటి సమావేశంలో జరిగిన వివరాలను వారు వెల్లడించారు. సింగరేణి యాజమాన్యం గుర్తింప...

తెలంగాణలో 4-రోజులు భగభ ఎండలు-జాగ్రత్త సుమా!

Image
తెలంగాణలో 4 రోజులు ఎండలు అధికం-జాగ్రత్త! హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటన మంచిర్యాల న్యూస్,మార్చి-3,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్:తెలంగాణ రాష్ట్రంలో రానున్న 4 రోజులు ఎండలు అధికంగా ఉంటాయి.ఆ క్రమంలో చూస్తే..రాష్ట్రంలో ఎండల తీవ్ర పెరుగుతోందనీ మంగళవారం హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.ప్రధానంగా రాబోయే నాలుగు రోజులు ఉష్ణోగ్రత 2-3 డిగ్రీలు పెరుగుతుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.ఆ నేపథ్యంలోనే ఆదిలాబాద్,కొత్తగూడెం,భూపాలపల్లి,గద్వాల,ఆసిఫాబాద్,మహబూబ్ నగర్,మంచిర్యాల,ములుగు,నాగర్ కర్నూల్,నారాయణ్ పేట,నిర్మల్,నిజామాబాద్ జిల్లాల్లో 36°సి నుంచి 40°సి వరకు సంబంధిత ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.దాంతో ప్రజలు తగిన విధంగా ఎండ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

రేపు కల్వరి టెంపుల్ దైవజనులు సతీష్ కుమార్ మంచిర్యాల రాక-తరలిరావాలి

Image
రేపు కల్వరి టెంపుల్ దైవజనులు సతీష్ కుమార్ మంచిర్యాల విచ్చేస్తున్నారు రేపు కల్వరి టెంపుల్ దైవజనులు సతీష్ కుమార్ మంచిర్యాల పర్యటన విద్యార్థుల విశ్వాసుల విజ్ఞాపన సదస్సులో విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రార్థనలు జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్... మంచిర్యాల న్యూస్,మార్చి-2,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్:మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల గద్దెరాగాడి ప్రాంతంలోని ఎమ్మార్ గార్డెన్స్ లో గల కల్వరి టెంపుల్ లో మంగళవారం భారీ ఎత్తున నిర్వహించే విద్యార్థుల విశ్వాసుల విజ్ఞాపన సదస్సుకు కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు దైవజనులు కాబడిన డాక్టర్ పి.సతీష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు.ఆ క్రమంలో చూస్తే..గద్దె రాగాడి ప్రాంతంలో గల లడ్డ రైస్ మిల్ ఎదురుగా ఉన్న ఎమ్మార్ గార్డెన్స్ లోని కల్వరి టెంపుల్ లో ఈనెల-3న సాయంత్రం 6 గంటలకు పెద్ద ఎత్తున నిర్వహించే విద్యార్థిని విద్యార్థుల కోసం నిర్వహించే సదస్సుకు దైవజనులు సతీష్ కుమార్ విచ్చేస్తున్నారు.దైవజనులు రాకతో కల్వర్ టెంపుల్ వద్ద ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.అంతేకాకుండా ఆ సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్లు,ఫ్లెక్సీలను కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని మ...

మంచిర్యాలలో వైద్య రంగానికి మైలురాయి-టీజీఎంసి సిపిడి-2026 సక్సెస్

Image
మంచిర్యాలలో వైద్య రంగానికి గొప్ప మైలురాయి-టీజీఎంసీ చైర్మన్ టీజీఎంసి ఆధ్వర్యంలో సిపిడి-2026 విజయవంతం  జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్... మంచిర్యాల న్యూస్,మార్చి-1,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్(టీజీఎంసి)ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ),హెల్త్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్(హెచ్ ఆర్ డి ఏ)సంయుక్తంగా ఆదివారం కంటిన్యూయింగ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ (సిపిడి)2026 అనే కార్యక్రమాన్ని మంచిర్యాలలోని శుభం కన్వెన్షన్ హాల్లో భారీ ఎత్తున నిర్వహించారు.ఆ కార్యక్రమానికి టీజీఎంసిఛైర్మన్,వైస్ ఛైర్మన్,టీజీఎంసి సభ్యులు హాజరైనారు.ఆ నేపథ్యంలోనే సుమారు 300 మందికి పైగా వైద్యులు ప్రతినిధులు (డెలిగేట్స్)ఇంకా ఫ్యాకల్టీగా పాల్గొన్నారు.ముఖ్యంగా అంతర్జాతీయ ఖ్యాతి గల ప్రముఖ వక్తలు వివిధ వైద్య విభాగాలకు చెందిన వైద్యులకు తాజా వైద్య విజ్ఞానం,నైపుణ్యాలపై అవగాహన కల్పించారు.ఆ కార్యక్రమంలో భాగంగానే టీజీఎంసి సభ్యులు,జిల్లా వైద్యాధికారి(డి ఎం హెచ్ ఓ),ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు విచ్చేశారు.అయితే క్వాకరీ(అనధికార వైద్యం),అనైతిక వైద్య విధానాలు,ప్రొఫ...

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదు-రామగుండం పోలీస్ కమిషనర్

Image
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనంపై నిషేధాజ్ఞల కొనసాగింపు అనుమతి లేని డ్రోన్లు,డీజే సౌండ్స్‌పై కఠిన చర్యలు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్..... మంచిర్యాల న్యూస్,మార్చి-1,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: సాధారణ పౌరులు,ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల,పెద్దపల్లి జోన్‌లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను కొనసాగిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి కొందరు వ్యక్తులు అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారనే పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.మద్యం మత్తులో వీధులు, రోడ్లపై అసభ్య పదజాలంతో ప్రవర్తించడం వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని,ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిషేధాజ్ఞలు విధించినట్లు తెలిపారు.ఈ నిషేధాజ్ఞలు 01-03-2026 నుండి 01-04-2026 వరకు అమల్లో ఉంటాయని, పరిస్థితులను బట్టి కాలపరిమితిని పొడిగించే అవక...