చల్లటి కబురు-ఈ నేల-16 తేదీతో వర్షాలు
చల్లటి కబురు...ఈ నేల-16 నుంచి వర్షాలు
జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్...
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు అందింది.తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతోన్న ఈ తరుణంలో అకాల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఆ క్రమంలో చూస్తే..ఈ నెల 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దాదాపు వారం రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసే విధంగా ఉన్నట్లు వెల్లడించారు.ఆ సందర్భంగా ఉరుములతో కూడిన వడగళ్ల వర్షం పడే ప్రమాదం కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు ప్రకటించారు.రంగారెడ్డి,కరీంనగర్,మహబూబ్ నగర్,అదిలాబాద్,నల్గొండ లాంటి జిల్లాల్లో కొన్నిచోట్ల వడగండ్ల వర్షాలు పడే ప్రమాదం ఉంచి ఉన్నట్లు స్పష్టం చేశారు.ఈ నెల చివరి దాకా ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయని కూడా తెలిపారు.ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు అని స్పష్టం చేశారు.మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 15వ తేదీ వరకు పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది.ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య నమోదు అవుతున్నాయి.మధ్యాహ్నం అయింది అంటే చాలు..విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.బయట కాలు పెట్టలేని పరిస్థితి నెలకొంటోంది.ఇంకా రాత్రి తీవ్రమైన ఉక్కపోతతో జనాలు అల్లాడుతున్నారని తెలుస్తుంది.

Comments
Post a Comment