తెలంగాణలో 4-రోజులు భగభ ఎండలు-జాగ్రత్త సుమా!

తెలంగాణలో 4 రోజులు ఎండలు అధికం-జాగ్రత్త!

హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటన
మంచిర్యాల న్యూస్,మార్చి-3,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్:తెలంగాణ రాష్ట్రంలో రానున్న 4 రోజులు ఎండలు అధికంగా ఉంటాయి.ఆ క్రమంలో చూస్తే..రాష్ట్రంలో ఎండల తీవ్ర పెరుగుతోందనీ మంగళవారం హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.ప్రధానంగా రాబోయే నాలుగు రోజులు ఉష్ణోగ్రత 2-3 డిగ్రీలు పెరుగుతుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.ఆ నేపథ్యంలోనే ఆదిలాబాద్,కొత్తగూడెం,భూపాలపల్లి,గద్వాల,ఆసిఫాబాద్,మహబూబ్ నగర్,మంచిర్యాల,ములుగు,నాగర్ కర్నూల్,నారాయణ్ పేట,నిర్మల్,నిజామాబాద్ జిల్లాల్లో 36°సి నుంచి 40°సి వరకు సంబంధిత ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.దాంతో ప్రజలు తగిన విధంగా ఎండ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

ఆర్కేపిలో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి-ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్...

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ