ఆర్కేపిలో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్
జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్ జనవరి 30 రామకృష్ణ పూర్ న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల సింగరేణి ఠాగూర్ స్టేడియం ముందు గల మహాత్మా గాంధీ విగ్రహానికి చెన్నూరు అసెంబ్లీ ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేశారు.ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. స్వాతంత్ర సమరయోధుడు జాతిపిత మహాత్మా గాంధీ యొక్క గొప్పతనం గురించి క్లుప్తంగా అభివర్ణించారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆర్కేపీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు పిసిసి సెక్రెటరీ రఘునాథ్ రెడ్డి సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్ గాండ్ల సమ్మయ్య గోపతి రాజయ్య కళ్యాణ్, క్యాతనపల్లి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కౌన్సిలర్లు యువ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment