11 రోజులు భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలు రద్దు?

 11 రోజులు భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలు రద్దు?


 --  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...



మంచిర్యాల న్యూస్ ఫిబ్రవరి 9 జర్నలిస్టు తెలుగు దినపత్రిక :ఉత్తర తెలంగాణ వాసుల వరప్రదాయని,భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలు 11 రోజులపాటు నిలిచిపోనుంది.ఆ క్రమంలో చూస్తే..ఖమ్మం జిల్లాలో నూతనంగా ఆ రైల్వే లైన్ మరమ్మత్తు పనులు సాగుతున్నాయి.ఆ నేపథ్యంలోనే ఫిబ్రవరి 10 నుంచి 21 తేదీ వరకు సంబంధిత ఆ భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలు రాకపోకలను నిలిపివేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.ఆ తరుణంలో సిర్పూర్ కాగజ్నగర్ - సికింద్రాబాద్ మార్గంలో నడిచే భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ తో పాటు ఇంకా ప్యాసింజర్ రైళ్లను సైతం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కమర్షియల్ చీప్ అధికారి కైలాస్ ప్రకటనలో వెల్లడించారు.అదేవిధంగా భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ - సికింద్రాబాద్ రూట్లో గుంటూరు వరకు నడిచే గోల్కొండ ఎక్స్ప్రెస్ రైల్ లింకుతో భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.ముఖ్యంగా ప్రతి నిత్యం సికింద్రాబాద్ నుంచి బయలుదేరి కాజీపేట,ఉప్పల్ జమ్మికుంట,పోత్కపల్లి,పెద్దపల్లి,రామగుండం,మంచిర్యాల,కాగజ్ నగర్ వరకు ఆ ట్రైన్ లో వివిధ ఉద్యోగస్తులు,విద్యార్థులు,వ్యాపారస్తులు అధిక సంఖ్యలో ప్రయాణిస్తారు.ఆ సమయంలో ఇకనుంచి పైన పేర్కొన్న తేదీ వరకు వాళ్లకు కష్టాలు తప్పవని చెప్పడంలో అసలు సందేహం లేదు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి