తెలంగాణలో ఆ రెండు ఘటనలో ఇద్దరు ఎస్సైలు మృతి ?
తెలంగాణలో ఆ రెండు ఘటనలో ఇద్దరు ఎస్సైలు మృతి ?
--- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...
మంచిర్యాల జిల్లా న్యూస్ ఫిబ్రవరి 4 : తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల,జగిత్యాల జిల్లాల్లో మంగళవారం ఉదయం రెండు దుర్ఘటనలు చోటుచేసుకున్నాయి.దాంతో పోలీస్ డిపార్మెంట్ లో ఘోర విషాదాన్ని మిగిల్చాయి. ఆ క్రమంలో చూస్తే...జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ శ్వేత మృతి చెందారు.అలాగే మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ-2 గా విధులు నిర్వహిస్తున్న రాథోడ్ తానాజీ (60) ఈరోజు తెల్లవారుజామున తన క్వార్టర్లో ఉన్న సమయంలో హఠాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందారు.కాగా తానాజీ స్వస్థలం ఉట్నూర్ మండలం, ఎందా గ్రామంగా ఉంది.
ఆయన అకస్మాత్తుగా మృతి చెందడం సహోద్యోగుల మధ్య తీవ్ర విషాదాన్ని నింపింది.
Comments
Post a Comment