అంగన్వాడీ టీచర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
అంగన్వాడీ టీచర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-- 11 మంది అంగన్వాడి సిబ్బందిపై కేసు నమోదు
-- ఆర్కేపి ఎస్ఐ జి.రాజశేఖర్
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్..
రామకృష్ణాపూర్ న్యూస్ మార్చి 4 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : ప్రజాభవన్ ముట్టడి కోసం హైదరాబాదుకు వెళ్తున్న (11) మంది అంగన్వాడీ సిబ్బందిని మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఆ క్రమంలో చూస్తే..ఆర్కేపి పట్టణంలో గల రాజీవ్ చౌక్ ఇంకా-జోన్ సెంటర్ లో 11 మంది అంగన్వాడీ సిబ్బంది అందరు కలిసి ఈరోజు హైదరాబాద్ లోని ప్రజాభవన్ ముట్టడికి కోసం గుమిగూడినారు.ఆ నేపథ్యంలోనే ప్రభుత్వంకు వ్యతిరేకంగా అంగన్వాడీ టీచర్లు నినాదాలు చేసారు.ఈ సమయంలో ఆ టీచర్ల బృందం యొక్క చర్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ఉన్నట్లు తేలడంతో ముందస్తు చర్యలో భాగంగా పోలీసులు వాళ్లను అదుపులోకి తీసుకోన్నారు.దాంతో స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు.అనంతరం అండర్ సెక్షన్ -170 ఆఫ్ బి ఎన్ ఎస్ ప్రకారం టీచర్ల మీద పోలీసు కేసు చేసినట్లు పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.రాజశేఖర్ తెలిపారు.
Comments
Post a Comment