భారత్ పాకిస్తాన్ పై యుద్ధం మొదలుపెట్టిందా?



 భారత్ పాకిస్తాన్ పై యుద్ధం మొదలుపెట్టిందా?

--   సింధు నదిలో భారతీయుల రక్తం పారుతుంది...

--   పాకిస్తాన్ బరితెగింపు మాటలు

--   జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ టీవీ మీడియా న్యూస్...

హైదరాబాద్ న్యూస్ ఏప్రిల్ 26 జర్నలిస్టు తెలుగు దినపత్రిక :పేహల్గాం ఉగ్రవాదులదాడితో భారత్ -పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి.ఆ క్రమంలో చూస్తే...ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి.సింధూ జలాల నుంచి చుక్క నీరు కూడా పాక్ భూభాగానికి వెళ్లనివ్వరాదని భారత ప్రభుత్వం నిర్ణయించింది.మరోవైపు పాకిస్థాన్ సైతం భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.ఉగ్రదాడితో ఆగ్రహంతో ఉన్న భారత్ ను రెచ్చగొట్టేలా పాక్ ప్రభుత్వం వ్యవహరిస్తుండటంతో ఇరు దేశాల మధ్య ఎప్పుడైనా యుద్ధం మొదలయ్యే పరిస్థితి ఉందన్న వాదన వినిపిస్తోంది.అయితే గతంలో భారత్ -పాకిస్థాన్ దేశాల మధ్య ఎన్నిసార్లు యుద్ధాలు జరిగాయన్న విషయాలను ఓక సారి మంచిగా పరిశీలిద్దాం...

1947లో బ్రిటిష్ వారు భారతదేశ విభజన చేసినప్పటి నుంచి భారతదేశం,పాకిస్థాన్ మధ్య విభేదాలు ఉన్నాయి.గతంలో ఏకీకృత పెద్ద భారతదేశంలో భాగమైన రెండు దేశాల మధ్య జరిగిన మొదటి యుద్ధం 1947లో జరిగింది.ఆ తరువాత మూడు సార్లు..మొత్తంగా నాలుగు సార్లు ఇరు దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి.ఆ తరువాత కూడా పలు సార్లు భారత్,పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి.ఇరు దేశాల మధ్య ఎప్పుడెప్పుడు ఘర్షణలు తలెత్తాయంటే..?1947 నుంచి భారతదేశం, పాకిస్థాన్ దేశాల మధ్య నాలుగు సార్లు యుద్ధాలు జరిగాయి.మొదటి ఇండో -పాక్ యుద్ధం (1947- 1948) మధ్య కాలంలో జరిగింది.స్వాతంత్ర్య వచ్చిన వెంటనే కాశ్మీర్ ప్రాంతం కోసం ఇరు దేశాలు తలపడ్డాయి.ఆ యుద్ధం 1947 అక్టోబర్ 21 నుంచి 1948 డిసెంబర్ 31 వరకు కొనసాగింది.ఐక్యరాజ్యసమితి కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చింది.రెండవ ఇండో-పాక్ యుద్ధం 1965లో జరిగింది.. పాక్ కాశ్మీర్ లోకి చొరబడటానికి ప్రయత్నించింది. ఆ సమయంలో పాక్ దళాలు భారత దేశం ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లోకి ప్రవేశించి తిరుగుబాటును ప్రేరేపించడానికి ప్రత్నించాయి.దాంతో భారతదేశం పశ్చిమ పాకిస్థాన్ పై పూర్తిస్థాయి సైనిక చర్యను ప్రారంభిం చింది.ఆ యుద్ధం 17రోజుల పాటు జరిగింది.కాగా సోవియట్ యూనియన్,అమెరికా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.ఆ సమయంలో కాల్పుల విరమణ ప్రకటించారు.పాకిస్థాన్ తిరుగుబాటుతో కారణమైన ఆ యుద్ధంలో భారతదేశం పైచేయి సాధించింది.1971 ఇండో-పాక్ యుద్ధం (బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం..పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఒక కీలకమైన సంఘటన.ఆ యుద్ధంలో బంగ్లాదేశ్ ప్రజలు పాకిస్తాన్ సైన్యం నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాడారు.ఆ పోరాటంలో భారతదేశం వారిని మద్దతు ఇచ్చింది.ఆ యుద్ధం 1971 డిసెంబర్ 16న బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం సాధించడంతో ముగిసింది.ఆ సమయంలో భారత సైన్యం దాదాపు 15000 చదరపు కిలోమీటర్ల వరకు పాకిస్థాన్ భూభాగాన్ని ఆక్రమించింది. అయితే ఆ భూమిని తరువాత సిమ్లా ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్‌కు తిరిగి బహుమతిగా ఇచ్చింది.కార్గిల్ యుద్ధం (1999)..జమ్మూకశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో పాకిస్థాన్ దళాలు ఆక్రమించిన భూభాగాలపై భారతదేశం తిరిగి నియంత్రణ సాధించింది.ఆ పాకిస్థాన్ దళాలు కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో భారత భూభాగంలోకి చొరబడ్డాయి.భారతదేశం సైనిక చర్యతోపాటు..పాకిస్థాన్ ను దౌత్యపరంగా కూడా ఎదుర్కొంది.ఆ చొరబాటు జరిగిన రెండు నెలల్లోనే వారు ఆక్రమించిన భూభా గాన్ని తిరిగి భారత్ సైన్యం స్వాధీనం చేసుకుంది.అమెరికా సహా అంతర్జా తీయంగా పాకిస్థాన్ పై ఒత్తిడి పెంచడంలో భారత్ విజయవంతం అయింది.ఆ నేపథ్యంలోనే పెద్ద ఏత్తున సైనిక దాడులు జరుగుతాయని భావించిన పాకిస్థాన్..వెనక్కి తగ్గింది.ఆ యుద్ధంలో పాకిస్థాన్ 4వేల మంది సైనికులను కోల్పోయింది.అయితే పాకిస్థాన్ కు ఎదురైన అతిపెద్ద ఓటముల్లో ఇది ఒకటని తెలుస్తుంది.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి