మత సామరస్యంతో గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం





మత సామరస్యంతో గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం

--  మందమర్రి సిఐ కే.శశిధర్ రెడ్డి

రామకృష్ణాపూర్ న్యూస్,ఆగస్టు-21,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : రానున్న వినాయక చవితి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో మత సామరస్యంతో విజయవంతంగా నిర్వహించుకోవాలని గురువారం మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కే.శశిధర్ రెడ్డి తెలిపారు.ఆ క్రమంలో చూస్తే..మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు,వివిధ మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐ.శశిధర్ రెడ్డి,క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు హాజరైనారు.ఆ సందర్భంగా సీఐ మాట్లాడుతూ..పండుగలు మన సంస్కృతికి,ఐక్యతకు ప్రతీకాలని,వాటిని సహోదర భావంతో జరుపుకోవాలన్నారు.ఆ ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ శాఖ పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తుందని తెలిపారు.ఆ గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని,ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.గణేష్ నవరాత్రులలో డీజే సిస్టమ్‌లకు ఎలాంటి అనుమతి లేదని తెలిపారు.సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు,ఇతరుల మనోభావాలను దెబ్బతీసే అభ్యంతరకర పోస్టుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అలాంటివి దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని,చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని,ప్రజాశాంతికి భంగం కలిగిస్తే ఉరుకునేది లేదని హెచ్చరించారు.అనంతరం రామకృష్ణాపూర్ ఎస్.ఐ.రాజశేఖర్ మాట్లాడుతూ..విగ్రహాల నిమజ్జనం సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని,ప్రజలు,ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.అనంతరం వివిధ మత పెద్దలు మాట్లాడుతూ..గణేష్ ఉత్సవాలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని, శాంతియుత వాతావరణాన్ని కాపాడటానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.ఆ శాంతి కమిటీ సమావేశంలో మందమర్రి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శశిధర్ రెడ్డి,క్యాతనపల్లి మునిసిపల్ కమిషనర్ గద్దె రాజు,రామకృష్ణాపూర్ ఎస్.ఐ రాజశేఖర్,ఏ.ఎస్.ఐ వెంకయ్య,హెడ్ కానిస్టేబుళ్లు జంగు,అంకయ్య,పోలీస్ సిబ్బంది,వివిధ మతాలకు చెందిన మత పెద్దలు,హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు,పుర ప్రముఖులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి