13న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి
13న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి
- లోక్ అదాలత్ ద్వారానే సత్వర న్యాయం
- రాజీ పడితే ఆ ఇద్దరూ గెలిచినట్లే...
- రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝామంచిర్యాల న్యూస్,సెప్టెంబరు-11,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : రాజీమార్గమే రాజమార్గమని,కక్షలు,కార్పణ్యాలతో ఏమీ సాధించలేమని దాంతో రాజీపడితే ఇద్దరూ గెలిచినట్లేనని గురువారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఆ క్రమంలో చూస్తే...ఈ నెల 13వ తేదీన జరుగనున్న జాతీయ లోక్ అదాలత్ ను తప్పకుండా కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఆ లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని గుర్తు చేశారు.రాజీపడదగిన కేసులలో క్రిమినల్ కంపౌండ బుల్ కేసులు,సివిల్ తగాదా కేసులు,ఆస్తి విభజన కేసులు,కుటుంబపరమైన నిర్వాహణ కేసులు,వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు,బ్యాంకు రికవరీ,టెలిఫోన్ రికవరీ కేసులు,విద్యుత్ చౌర్యం,చెక్ బౌన్స్ కేసులు,ఇతర రాజీ పడ్డ దగిన సంబంధిత కేసుల్లో కక్షిదారులు రాజీ పడాలని సూచించారు.ఆ నేపథ్యంలోనే రాజీ మార్గం-రాజ మార్గమని చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని,డబ్బులను వృథా చేసుకోవద్దని ప్రకటించారు.అయితే జుడిషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.పోలీస్ అధికారులు కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్ లు పోలీస్ సిబ్బంది రాజీపడ్డ దగిన కేసులనులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ పడేటట్లు అవగాహన కల్పించాలని సూచించారు.కాగా లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.
Comments
Post a Comment