గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరలో పర్యటించిన ఐటీడీఏ పీవో కుష్బూ గుప్త
గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర లో పర్యటించిన ఐటీడీఏ పీవో కుష్బూ గుప్త
-- మైసమ్మ మహా జాతర ఏర్పాట్లను తెలుసుకున్నా వైనం
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...
రామకృష్ణాపూర్ న్యూస్ ఫిబ్రవరి 15 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల గాంధారి ఖిల్లా మూడు రోజుల మైసమ్మ మహా జాతరలో భాగంగా రెండోవ రోజు శనివారం ఉట్నూర్ ఐటీడీఏ పిఓ అధికారిని కుష్బూ గుప్తా ఏట్టకేలకు అక్కడి జాతరలో పర్యటించారు.ఆ క్రమంలో చూస్తే..ఆర్డీవో శ్రీనివాస్ తో కలిసి ఈరోజు గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర చేరుకొన్నారు.ఆ నేపథ్యంలోనే గుట్టపైకి చేరుకొని మైసమ్మ తల్లికి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు.అనంతరం ఆదివాసీ నాయక్ పోడు గిరిజన సంఘం నాయకులతో మాట్లాడారు.ఆ జాతర యొక్క ఏర్పాట్లు ఇంకా అక్కడ భక్తుల సౌకర్యం కోసం ఏర్పాటుచేసిన
వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో రామకృష్ణాపూర్ ఎస్ఐ జి.రాజశేఖర్,ఆదివాసీ నాయక్ పోడు సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పెద్ది భార్గవ్,సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు మేసినేని రాజయ్య,ఆదివాసి నాయక్ పోడు సంఘం రాష్ట్ర జిల్లా కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment