కేసీఆర్,కేటీఆర్,కవిత ఎవరికి మీ ఓటు చెప్తారా?
కేసీఆర్,కేటీఆర్,కవితలు ఎవరికి ఓటు వేస్తారో చెప్తారా?
- మంచిర్యాలలో భారీ ఎత్తున పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేదికపై ప్రసంగం..
- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...
మంచిర్యాల న్యూస్ ఫిబ్రవరి 24 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఇంకా కవితలు ఎవరికి ఓటు వేస్తారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో సూటిగా అడిగారు.ఆ క్రమంలో చూస్తే..మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో గల అక్కడి ప్రదేశంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం పెద్ద ఎత్తున సభకు సీఎం ముఖ్యఅతిథిగా హాజరైనారు.ఆ సందర్భంగా వేదికపై రేవంత్ రెడ్డి ప్రసంగించారు.ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఓడించాలని బిఆర్ఎస్ బిజెపితో కుట్రలు చేస్తుందని పేర్కొన్నారు.ఆ బిజెపి బిఆర్ఎస్ చేసే కుట్రలను అందరూ గమనించాలన్నారు.బిజెపిలో ఎనిమిది మంది ఎంపీలు,ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా రాష్ట్రానికి ఏమి తెచ్చారో చెప్పాలన్నారు.ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న బిజెపి ప్రధాని మోడీ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు.అయితే తెలంగాణలో మాత్రం బండి సంజయ్ ఇంకా కిషన్ రెడ్డికి మాత్రం రెండు ఉద్యోగాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించాలని సీఎం ప్రసంగించారు.అలాగే మంచిర్యాల ప్రజలు అదృష్టవంతులని గుర్తు చేశారు.ఆ ఒక్క ఓటు వేసి ఇద్దరు సేవకులను పొందారని తెలిపారు.మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు తో పాటు డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ మంచిగా సేవలందిస్తున్నట్లు కొనియాడారు.తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే కేంద్రం నిధులు ఇవ్వకుండా అడ్డుకుంటూ నిర్లక్ష్యం చేస్తుందన్నారు.ఆ నిధులను కిషన్ రెడ్డి సైతం అడ్డుకుంటున్నట్లు ప్రకటించారు.ముఖ్యంగా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అడ్డువచ్చిన కూడా తోసుకుంటూ వెళ్లి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు.ఆ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రులు శ్రీధర్ బాబు,సీతక్క,పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్,ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాల్,ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి,ప్రేమ్ సాగర్ రావు,గడ్డం వినోద్, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Post a Comment