బ్యాంకాక్ భూకంపంలో క్షేమంగా తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం

బ్యాంకాక్  భూకంపంలో క్షేమంగా తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం

--  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...

హైదరాబాదు న్యూస్, జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ టీవీ న్యూస్ : థాయ్‌లాండ్, మయన్మార్ దేశాల్లో చోటు చేసుకున్న వరుస భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని మిగిల్చాయి.ఆ క్రమంలో చూస్తే...శుక్రవారం నాడు సంభవించిన భూకంపాల ధాటికి..వందల నిర్మాణాలు కుప్పకూలాయి.మయన్మార్, థాయ్‌లాండ్ రెండు దేశాల్లో కలిపి వందల మంది మృతి చెందారు.చాలా మంది గాయపడ్డారు.ఆ రెండు దేశాల ప్రభుత్వాలు సహాయక కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి.జనాలు భయంతో ప్రాణాలు గుప్పిట్లో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.తెలంగాణ రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కుటుంబం బ్యాంకాక్‌లో చిక్కుకుపోయారు.వారు క్షేమంగా ఇంటికి చేరాలని ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబ సభ్యులు,అభిమానులు,పార్టీ కార్యకర్తలు ప్రార్థించారు. అయితే వాళ్ల యొక్క ఆకాంక్షలు ఫలించాయి.దాంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అక్కడి ప్రమాదంలో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని క్షేమంగా ఇంటికి చేరుకున్నారు.ఆ నేపథ్యంలోనే శనివారం మధ్యాహ్నం..శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు.భార్యాబిడ్డలను రిసీవ్ చేసుకోవడానికి విమానాశ్రయానికి వచ్చిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను చూసి..తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు క్షేమంగా తిరిగి రావడంతో ఆయన కుటుంబ సభ్యులు,అభిమానులు,కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.ఆ సందర్భంగా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ భార్య మాట్లాడుతూ.."ఓక పెళ్లికి హాజరుకావడం కోసం నేను,నా కుమార్తె మానస,కుమారులు ప్రతీష్,నిధీష్‌లతో కలిసి బ్యాంకాక్ వెళ్లామన్నారు.అక్కడ నొవాటెల్ హోటల్‌లోని 35వ అంతస్తులని ఓక గదిలో దిగామని గుర్తు చేశారు. కాగా శుక్రవారం ఉదయం అక్కడ భూకంపం వచ్చిందని ఆ సమయంలో వెంటనే స్పందించి..ఆమె బిడ్డలను తీసుకుని మెట్ల మార్గం గుండా వేగంగా బయటకు వచ్చినట్లు తెలిపారు.కానీ ఆ భూప్రకంపనల ధాటికి భవనం పైకప్పు పెచ్చులు ఉడిపోయినట్లు వివరించారు.ఆ బిల్డింగ్ ఓక పక్కకు ఒరిగిపోయిందని తెలిపారు.ఆ తరుణంలో మృత్యువు నుంచి తప్పించుకోలేమని అర్థమయ్యిందని స్పష్టం చేశారు. కానీ ఏదో ఆశతో..బయటపడేందుకు ప్రయత్నాలు చేసినట్లు వెల్లడించారు.మా అదృష్టం బాగుండి..ఎలాంటి ప్రమాదం లేకుండా బయటకు వచ్చామన్నారు.ఆ బిల్డింగ్ నుంచి బయటకు రాగానే..మా కళ్లెదుటే.. పేకమేడల్లా భవనాలు కూలిపోవడం చూసి షాక్‌కు గురయ్యామన్నారు.తిరిగి ఇండియాకు వస్తామనే ఆశ లేకుండా పోయిందని వర్ణించారు.కానీ మా అదృష్టం బాగుండి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్నామని ఎమ్మెల్యే భార్య తీవ్ర భావోద్వేగంతో తెలిపారు.


Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి