Posts

Showing posts from May, 2025

క్యాతనపల్లి కమాన్ ముందు ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి?

Image
క్యాతనపల్లి కమాన్ ముందు ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి? ---  రోడ్డు ప్రమాదాలు లేకుండా రక్షణ కల్పించాలి  ---  జర్నలిస్టు తెలుగు దినపత్రిక--టీవీ న్యూస్ ప్రత్యేక కథనం.... రామకృష్ణాపూర్ న్యూస్ మే-19 జర్నలిస్టు తెలుగు దినపత్రిక -టీవీ మీడియా న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రధాన మార్గం కాబడిన కమాన్ ముందు రాష్ట్ర రహదారిపై ట్రాఫిక్ సిగ్నల్ లేదా ట్రాఫిక్ నిబంధనలు లేదా ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.ఆ క్రమంలో చూస్తే..క్యాతనపల్లి కమాన్ ముందు గల రహదారిపై ఇటీవల కాలంలో ఊహించని విధంగా రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తోంది.దాంతో అక్కడి ప్రాంతంలో ఏంఎన్ఆర్ గార్డెన్ వెళ్లాలని అలాగే పెట్రోల్ బంక్ కు వెళ్లాలని లేదా ఆంజనేయ టెంపుల్ కి వెళ్లాలని అటుపక్కనే గ్రామంలోకి వెళ్లాలని మళ్లీ అటువైపు నుంచి రామకృష్ణాపూర్-క్యాతనపల్లి మున్సిపాలిటీకి వచ్చి వెళ్లే వాళ్లకు అక్కడి రోడ్డుపై ట్రాఫిక్ నిబంధనలు లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.ఈ విషయంలో మంచిర్యాల ఆర్ అండ్ బి అధికారులు,సంబంధిత అధికారులు కూడా వ...

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి

Image
ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్...ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి --  ఆ పశువుల ఖరీదు పది లక్షలు పైగానే ఉంటుంది  --  అమరవాది పశువుల యాజమానుల కన్నీటి రోదనలు మిన్నంటాయి  --  ఆ దోషులపై కేసు నమోదు చేసిన పోలీసులు --  జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్... రామకృష్ణాపూర్ న్యూస్,మే-18,జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల సింగరేణి ఏరియాసుపత్రి సమీపంలోని అమరావాది చెరువు సమీపంలో గల పంట పొలంలో ఆదివారం కరెంట్ షాక్ (కరెంటు విద్యుత్ తీగలు) తగిలి అభం శుభం తెలియని మూగజీవులు కాబడిన 11 గేదెలు,ఒక దున్నపోతు అక్కడికక్కడే మరణించిన గోరమైన విషాద సంఘటన ఇక్కడ చోటుచేసుకుంది.ఆ క్రమంలో చూస్తే..శేషయ్య అనే ల్యాండ్ ఓనర్ కు చెందిన ఆ పొలంను కొమురయ్య అనే వ్యక్తి అక్కడి పంట పొలంను లీజుకు తీసుకున్నాడు.దాంతో ఆ పంట పొలంలోకి అడవి పందులు ఇతర జంతువులు రాకుండా ఉండడానికి ఆ పొలం చుట్టూ విద్యుత్ తీగలు సరఫరా చేసి కంచెలాగా అమర్చాడు.ఆ సమయంలో పశువుల మంద అటువైపు పంట పొలంలోకి చేరుకొని మేత చేస్తుండగా ఆ పొలం చుట్టువైపు ఏర్పాటు చేసిన ...

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్...పాలవాగు బ్రిడ్జిపై నుంచి బోల్తా పడిన బొగ్గు టిప్పర్?

Image
ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్...పాలవాగు బ్రిడ్జిపై నుంచి బోల్తా పడిన బొగ్గు టిప్పర్? --  జర్నలిస్టు తెలుగు దినపత్రిక--టీవీ మీడియా న్యూస్ రామకృష్ణాపూర్ న్యూస్ మే-15 జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల పాకిస్తాన్ క్యాంపు సమీపంలోని పాలవాగు బ్రిడ్జిపై నుంచి ఊహించని విధంగా బొగ్గు టిప్పర్ లారీ బోల్తా పడింది.ఆ క్రమంలో చూస్తే..గురువారం జరిగిన ఆ ప్రమాదంలో పాలవాగు బ్రిడ్జిపై నుంచి సంబంధిత వాగులో పల్టీలు కొడుతూ బొగ్గు టిప్పర్ పడినట్లు తెలుస్తుంది.ఇంకా ఆ ప్రమాదానికి సంబంధించిన పూర్తి విషయాలు-వివరాలు తెలియాల్సి ఉంది.ఆ సమయంలో సంబంధిత ప్రధాన రోడ్డుపై వెళ్లి వచ్చే వాహన చోదకులు అక్కడ ఆగి జరిగిన ఆ లారీ బోల్తా పడిన ప్రమాదం సంఘటన దృశ్యం ను వీక్షించడం కనిపించింది.

ఫ్లాష్.. ఫ్లాష్...న్యూస్..సింగరేణి బొగ్గు గనిలో భారీ పేలుడు--ప్రజలకు గాయాలు

Image
ఫ్లాష్.. ఫ్లాష్...న్యూస్ సింగరేణి బొగ్గు గనిలో భారీ పేలుడు--ప్రజలకు గాయాలు ---   జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్... పెద్దపల్లి -రామగిరి న్యూస్ మే 15 జర్నలిస్టు తెలుగు దినపత్రిక మీడియా న్యూస్:  సింగరేణి బొగ్గు గనిలో గురువారం భారీ పేలుడు జరిగి పలువురికి గాయాలు ఆయన సంఘటన నెలకొంది.ఆ క్రమంలో చూస్తే...పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ఓసీ2 బొగ్గు గనిలో ఆ భారీ పేలుడు సంభవించింది. ఆ నేపథ్యంలోనే పేలుడు ధాటికి చుట్టు పక్కల ఉన్న నాగేపల్లి,లద్నాపూర్,ఆదివారం పేట,రాజాపూర్,పన్నూరు గ్రామాల్లో భూమి ఒక్కసారిగా కంపించి,ఇండ్లు ధ్వంసమైనట్లు అక్కడి ప్రజలు తీవ్రభయంతో గురయ్యారు.అక్కడి ప్రాంతంలోని ఇండ్లపై రాళ్లు ఎగిరిపడి వచ్చి మీద పడి పలువురికి గాయాలు అయినట్లు వాపోయారు.ఆ బ్లాస్టింగ్ కార్యకలాపాలు నిలిపివేయాలని, వెంటనే బాధితులకు నష్ట పరిహారం అందజేయాలని అక్కడి గ్రామానికి చెందిన ప్రజలు ధర్నా చేపట్టడం కనిపించింది.

సింగరేణిలో 5 లక్షల టన్నుల బొగ్గు సరఫరాకు ఎన్ఎస్పిసిఎల్ ఒప్పందం

Image
సింగరేణి నుంచి 5-లక్షల టన్నుల బొగ్గు సరఫరాకు ఎన్ఎస్పిసిఎల్ ఒప్పందం --  జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ మీడియా న్యూస్... సింగరేణి భవన్,మే 15,జర్నలిస్టు తెలుగు దినపత్రిక:సింగరేణి సంస్థ నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు లక్షల టన్నుల బొగ్గు సరఫరాకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గాపూర్ లో ఉన్న ఎన్ఎస్పిసిఎల్ గురువారం  ఒప్పందం కుదుర్చుకుంది.ఆ క్రమంలో చూస్తే..సింగరేణి ఛైర్మన్-ఎండీ ఎన్.బలరామ్ ఆదేశాలు మేరకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ ఎస్డీఎం సుభాని సమక్షంలో సింగరేణి జనరల్ మేనేజర్ మార్కెటింగ్ ఏన్.వి.రాజశేఖర్ రావు,ఎన్ఎస్పిసిఎల్ సీఈవో దివాకర్ కౌశల్,జనరల్ మేనేజర్లు నీల్ కమల్,పలాష్ లు అగ్రిమెంట్ పై సంతకాలు చేసారు.ప్రముఖ జాతీయ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఆయన ఎన్టీపీసీ,స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు సంయుక్తంగా ఏర్పాటు చేసుకున్న జాయింట్ వెంచర్ కంపెనీ ఎన్ఎస్పిసిఎల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో దుర్గాపూర్ వద్ద ఏర్పాటు చేసిన  థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఈ బొగ్గును సరఫరా చేయనున్నారు.సింగరేణి సంస్థ నాణ్యత గల  బొగ్గును తగిన పరిమాణంలో సకాలంలో అందజేస్తుందని, కనుక తాము ఈ కంపెనీ నుంచి బొగ్గు కొనడానికి...

*గుడ్‌న్యూస్‌*---ఒకేసారి మూడు నెలల రేషన్‌*

Image
*గుడ్‌న్యూస్‌*-ఒకేసారి మూడు నెలల రేషన్‌* హైదరాబాద్‌ న్యూస్ మే-15 జర్నలిస్టు తెలుగు దినపత్రిక- టీవీ మీడియా న్యూస్ : వర్షాకాలంలో తిండి గింజల నిల్వ,రవాణాలో అంతరాయాలు తలెత్తే అవకాశం ఉన్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.ఆ క్రమంలో చూస్తే..జూన్‌ నుంచి మొదలయ్యే వర్షాకాలం, వరదల వంటివి రాష్ట్రాలకు అడ్డంకులుగా మారవచ్చన్న అంచనాల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఆగస్టు 2025 వరకు అవసరమైన తిండి ధాన్యాలను ముందస్తుగానే లిఫ్టింగ్‌ చేసి,పంపిణీ చేయాలని స్పష్టం చేసింది.ఆ మూడు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది.ఆ మేరకు అన్ని రాష్ట్రాల పౌరసరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శులకు కేంద్ర ఆహార,ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రాహుల్‌ సింగ్‌ లేఖ రాశారు.మే 30లోగా జూన్, జూలై,ఆగస్టు నెలలకు సంబంధించిన సరకును లబ్ధిదారులకు అందించాలని పేర్కొన్నారు.ముందస్తు బియ్యం లిఫ్టింగ్, పంపిణీ ప్రక్రియలో భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) గోడౌన్లలో తగినంత నిల్వలు ఉండేలా చూసుకోవాలని,రాష్ట్ర ప్రభుత్వా లతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని క...

సెక్సువల్ హరాస్మెంట్ ఆక్ట్-లైంగిక వేధింపుల నివారణపై సెమినార్

Image
సెక్సువల్ హరాస్మెంట్ ఆక్ట్-లైంగిక వేధింపుల నివారణపై సెమినార్  --  జర్నలిస్టు తెలుగు దినపత్రిక- మీడియా న్యూస్... మందమర్రి న్యూస్ మే-13 జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ మీడియా న్యూస్ : సింగరేణి కాలరీ  స్ లోని మందమర్రి ఏరియాలో గల స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ సెంటర్ లో మంగళవారం వర్క్ షాప్ టు క్రియేట్ అవేర్నెస్ సెక్సువల్ హరాస్మెంట్ ఆక్ట్-పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నివారణ అనే ప్రోగ్రాంపై సెమినార్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మందమర్రి జనరల్ మేనేజర్ జి.దేవేందర్ హాజరైనారు.అలాగే బెల్లంపల్లి రీజియన్ లోని శ్రీరాంపూర్ మందమర్రి,బెల్లంపల్లి ఏరియాల నుంచి ఉద్యోగులు హాజరైనారు.ఆ నేపథ్యంలోనే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి తమ సందేశాన్ని అందజేసారు.ఈ సమావేశంలో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ వారికి "పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నివారణ అనే అంశంపై"అవగాహన కల్పించడానికి వి.పార్వతీశం(విశాఖపట్నం, రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్, అడ్వకేట్ ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీ వాల్లు విచ్చేసి అనేక అంశాలపై అవగాహన కల్పించారు.ఆ సందర్భంగా మాట్లాడుతూ..పని ప్రదేశాలలో లైంగిక వేధింపులకు గురైనట్టయితే సంబంధిత ఇంటర్నల...

భారతదేశం కోసం ఆర్మీ జవాన్ కు సెల్యూట్...💥

Image
భారతదేశం కోసం ఆర్మీ జవాన్ కు సెల్యూట్...💥 --  జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ మీడియా న్యూస్.. పాకిస్తాన్ కు సరైన జవాబు చెప్పడానికి మన ఇండియన్ ఆర్మీ జవాన్ లు నిరంతరం ప్రాణాలు తెగించి రక్షణ కల్పిస్తున్నారు.ఆ క్రమంలో చూస్తే..మన దేశ ఒక ఆర్మీ జవాను దేశ ప్రజలు ధైర్యంగా ఉండాలని దేశం కోసం ప్రజల కోసం యుద్ధంలో ఉన్నట్లు ఆయన మాటలతో చెప్తున్నాడు.మన దేశం కోసం మేము ఉన్నామని అసలు భయపడొద్దని చెబుతున్నాడు.అందుకనే మన దేశ రక్షణ కోసం యుద్ధం చేస్తున్న మన దేశ వీర జవానులకు అందరం కూడా ముక్తకంఠంతో సెల్యూట్..చేద్దాం..జై..భారత్ జై..జై..జై..భారత్ జై జై జై...జవాన్

ఠాగూర్ స్టేడియంలో ఆర్ఆర్ మెమోరియల్ ఇన్విటేషన్ వాలీబాల్ పోటీలు లాంఛనంగా ప్రారంభం

Image
ఆర్కేపి ఠాగూర్ స్టేడియంలో ఆర్ఆర్ మెమోరియల్ ఇన్విటేషన్ వాలీబాల్ పోటీలు లాంఛనంగా ప్రారంభం  --  ముఖ్య అతిథులుగా మందమర్రి జిఎం జి.దేవేందర్,డివైపిఎం శ్యాంసుందర్,సిఐ శశిధర్ రెడ్డి,క్యాతనపల్లి కమిషనర్ రాజు,ఎస్ఐ రాజశేఖర్,వసుధ హాస్పిటల్ చైర్మన్ ప్రశాంత్ లు హాజరైనారు --  ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి 24 జట్ల క్రీడాకారులు అత్యంత ఉత్సాహంతో బరిలో నిలిచారు రామకృష్ణాపూర్ న్యూస్ మే-10 జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ మీడియా న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల సింగరేణి టాగూర్ స్టేడియంలో శనివారం సాయంత్రం ఆర్ఆర్ మెమోరియల్ ఇన్విటేషన్ వాలీబాల్ ఉమ్మడి అదిలాబాద్ క్రీడా పోటీలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి.ఆ క్రీడా పోటీలకు ముఖ్య అతిథులు మందమర్రి జిఎం జి.దేవేందర్,డివైపిఎం శ్యామ్ సుందర్,మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి,క్యాతనపల్లి కమిషనర్ రాజు,ఆర్కేపి ఎస్ఐ రాజశేఖర్,వసుధ హాస్పిటల్ చైర్మన్ ప్రశాంత్ లు హాజరైనారు.దాంతో ముందుగా రిబ్బన్ కట్ చేసి కొబ్బరికాయలు కొట్టి వాలీబాల్ క్రీడా పోటీలు ప్రారంభించారు.ఈ సందర్భంగా క్రీడాకారుల ఉద్దేశించి ముఖ్య అతిథులు అమూల్యమైన సందేశం అందించారు.అలాగే స్వర్గీయ ఈదు...