సమాజ రక్షణలో సేవలందించిన పోలీస్ అధికారులకు ఘన సత్కారం.
సమాజ రక్షణలో సుదీర్ఘ సేవలందించిన పోలీస్ అధికారులకు ఘన సత్కారం. సమాజ శ్రేయస్సు కోసం పనిచేసేది పోలీసులే.. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్ మంచిర్యాల న్యూస్,మార్చి- 1,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్:ప్రజల యొక్క క్షేమం కోసం నిరంతరం విధులు నిర్వహించేది పోలీసులు మాత్రమేనని,ఉద్యోగ విరమణ చేస్తున్న పోలీస్ అధికారులు ఇకనుంచి వారి కుటుంబాల కోసం ఎక్కువ సమయం కేటాయించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు.ఆ క్రమంలో చూస్తే..రామగుండం పోలీస్ కమిషనరేట్లో సుధీర్ఘకాలంగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను రామగుండం పోలీస్ కమిషనర్ అంబ ర్ కిషోర్ ఝా శనివారం ఘనంగా సత్కరించారు.పోలీస్ కమిషనరేట్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులు ఎస్సై నక్క శామ్యూల్ పాల్ సీసీఎస్ మంచిర్యాల,ఎస్సై నూనే శ్రీనివాస్ మందమర్రి,ఏ ఎస్ ఐ హెచ్ వెంకటేష్ బాబు గోదావరిఖని వన్ టౌన్,ఏ ఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎండి అలీముద్దీన్ సి ఏ ఆర్ రామగుండం, హెడ్ కానిస్టేబుల్ ఎం విజేందర్రెడ్డి జూలపల్లి ని పోలీస్ కమిషనర్ పూలమాలలత...