Posts

ఫ్లాష్ ఫ్లాష్ న్యూస్..ఆర్కే-5 గనిలో ప్రమాదం-ఇద్దరికి గాయాలు?

Image
ఫ్లాష్ ఫ్లాష్ న్యూస్..ఆర్కే-5 గనిలో ప్రమాదం-ఇద్దరిలో ఒకరికి గాయాలు,మరొకరికి తీవ్ర గాయాలు! తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక... శ్రీరాంపూర్ న్యూస్,తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక న్యూస్-టీవీ ఛానల్ న్యూస్,ఏప్రిల్-9:సింగరేణి కాలరీస్ లోని శ్రీరాంపూర్ డివిజన్ పరిధిలోగల ఆర్కే ఐదు గనిలో గురువారం రెండవ షిఫ్ట్ లో జరిగిన ఒక ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు తీవ్రంగా గాయాలు అయ్యాయి.ఆ క్రమంలో చూస్తే...గని భూగర్భంలో వేల్డర్ గా పనిచేస్తున్న వేణుగోపాల్ అనే కార్మికుడు ఇనుప రాడ్లను వెల్డింగ్ చేస్తున్న సమయంలో దాంట్లో ఒక చిన్న రాడ్ చువ్వలు మిరుగులు వెళ్లి అక్కడే ఉన్న పాత పూర్ణికి తగలడంతో అది ఒక్కసారిగా బ్లాస్ట్ అయిందనీ తెలుస్తుంది.ఆ ప్రమాదంలో వేణుగోపాల్ పై బ్లాస్టింగ్ వల్ల ఒక్కసారిగా బొగ్గు పిల్లలు ఇనుపరాడులు అన్ని కూడా మీద పడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.అలాగే అతని హెల్పర్ కు కూడా స్వల్పంగా గాయాలు పాలయ్యాడు. వెంటనే రామకృష్ణాపూర్ లోని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించడంతో ఆ ఇద్దరు కార్మికులు చికిత్స పొందుతున్నారు.దాంట్లో వేణుగోపాల్ కు బలమైన గాయాలు కావడంతో ఎక్స్రేలు తీసారు.ఆయన దేహంలో చిన్న చిన్న ఇనుప ముక్కలు ఉన్నట్లుగా వైద...

2-లక్షలు లంచం తీసుకుంటూ ఏసిబికి పట్టుబడ్డ సిఐ,ఎస్ఐ

Image
2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసిబికి పట్టుబడ్డ సిఐ,ఎస్ఐ  తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక... హైదరాబాద్ న్యూస్,ఏప్రిల్-8,తెలంగాణ జర్నలిస్టు న్యూస్ పేపర్-టీవీ ఛానల్ న్యూస్:నకిలీ పాస్ పోర్ట్ కేసులో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ సిఐ సంపతి కనకయ్య,ఎస్సై సిద్దేశ్వర్,రూ.రెండు లక్షలు లంచం తీసుకుం టూ ఏసీబీ అధికారులకు మంగళవారం సాయంత్రం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.ఆ క్రమంలో చూస్తే...ఆ దాడులు మంగళ వారం సాయంత్రం ప్రారంభ మై అర్ధరాత్రి వరకు కొనసాగాయి.రంగారెడ్డి జిల్లా ఏసీబీ డిఎస్పి ఆనంద్ కుమార్ తెలిపిన వివరాలు ప్రకారం చూస్తే..కేరళకు చెందిన ఒక వ్యక్తి ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ తో ప్రయాణించేందుకు ప్రయత్నిస్తూ ఇటీవల కాలంలో అతను పట్టు పడ్డాడు.శంషాబాద్ ఔట్  పోస్ట్ పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు  నమోదు అయింది.అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.కొద్దిరోజుల తర్వాత జైలు నుంచి అతడు రిలీజ్ అయ్యాడు.ఆ నేపథ్యంలోనే అతడు ప్రతి వారం పోలీస్ స్టేషన్ కు హాజరవుతున్నాడు.ఆ కేసులో ఛార్జ్ సీట్ ధాఖలు  చేయడానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ కనుకయ్య ఎస్సై సిద్ధేశ్వర్ తో కలిసి ఆ బాధితుడి నుంచి...

9 మంది పోలీసులకు ఉరిశిక్షలో తమిళనాడు హెడ్ కానిస్టేబుల్ రేవతి కీలక సాక్షి!

Image
తమిళనాడులో హెడ్ కానిస్టేబుల్ రేవతి కీలక సాక్షి -- తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక న్యూస్.... ఏప్రిల్-8,తెలంగాణ జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్:సాత్తాన్‌కుళం లాకప్ డెత్ కేసులో 9 మంది తోటి పోలీసులకు ఉరి శిక్ష పడటానికి కారణమైన కీలక సాక్షిగా రేవతి ఉంది.ఒక సందర్భంలో మనసాక్షి ఎలా వ్యవస్థ కంటే పెద్దదవుతుందో చూపించిన ఒక అద్భుతమైన ఉదాహరణ ఇది.తమిళనాడులో జరిగిన ఆ లాకప్ మరణాలు దేశాన్ని కుదిపేసిన ఘటన.కానీ ఆ దారుణం బయటకు రావడానికి కారణం రేవతిగా ఉంది.ఆ సంఘటన జరిగిన తర్వాత స్టేషన్‌లో పరిస్థితి ఎలా ఉందంటే జరిగినది బయటికి రాకూడదనే ఒక ఒత్తిడి స్పష్టంగా కనిపించింది.ఆ సాక్ష్యాలను తుడిచేయాలి,కథను మార్చాలనీ ఇవే ప్రధాన లక్ష్యాలుగా మారిపోయాయి.ఆ సమయంలో చాలా మంది పోలీసులు సైలెంట్‌గా ఉండటాన్నే సేఫ్‌గా భావిస్తారు.కానీ రేవతి  ఆ ఆప్షన్ తీసుకోలేదు ఆమెకి అది కేవలం డ్యూటీ విషయం కాదు.ఆమె కళ్లముందు జరిగిన దారుణానికి స్పందించాల్సిన బాధ్యత.తోటి సిబ్బంది ఒకవైపు పైఅధికారుల ఒత్తిడి మరోవైపు ఆలాంటి పరిస్థితిలో నిలబడటం అనేది చిన్న విషయం కాదు. యినా ఆమె వెనక్కి తగ్గలేదు.మేజిస్ట్రేట్ ముందు చెప్పిన ప్రతి విషయం కేసు ది...

సూర్యపేట ఆపిల్ స్కాన్ సెంటర్ పై(సువో మోటో)విచారణ

Image
సూర్యపేట ఆపిల్ స్కాన్ సెంటర్ పై(సువో మోటో)విచారణ  -- తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక... తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సూర్యాపేటలోని ఆపిల్ స్కాన్ సెంటర్‌లో జరిగిన అనైతిక కార్యకలాపాలపై స్వయంగా(సువో మోటో)విచారణ చేపట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.ఆ విచారణలో డా.కిరణ్ కుమార్ సోమ(రిజిస్ట్రేషన్ నం.59019)తాను గుర్తింపు పొందిన అర్హతలు లేకపోయినా,తాను క్వాలిఫైడ్ రేడియాలజిస్టుగా తప్పుడు విధంగా పరిచయం చేసుకున్నట్లు నిర్ధారించబడింది.అలాగే అతను గడువు ముగిసిన రిజిస్ట్రేషన్‌తో వైద్య సేవలు కొనసాగించడమే కాకుండా,తప్పుడు పత్రాలు సమర్పించిన వ్యవహారంలో కూడా పాల్గొన్నట్లు తెలిసింది.ఈ ఉల్లంఘనలను దృష్టిలో ఉంచుకుని,కౌన్సిల్ అతని పేరును మెడికల్ రిజిస్టర్ నుంవంచి రెండు సంవత్సరాల పాటు తొలగించాలని ఆదేశించింది.ఆ విషయానికి సంబంధించి డా.షేక్ జుల్ఫకర్ అలీ(రిజి. నం. 62456) చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ లేకుండా వైద్య సేవలు అందించినట్లు తేలింది.దానికి సంబంధించి,కౌన్సిల్ అతనిపై సెన్సర్ తీవ్రమైన హెచ్చరిక విధించింది.

ఆ తొమ్మిది మందికి మరణశిక్ష ఖరారు- మదురై సెషన్స్ కోర్టు సంచలన తీర్పు

Image
ఆ తొమ్మిది మందికి మరణశిక్ష ఖరారు మదురై సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక.... ఏప్రిల్ 6,తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్:2020 లాక్ డౌన్ లో మొబైల్ షాప్ తెరిచి ఉంచారని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టడంతో సంబంధిత తండ్రికొడుకులు మరణించారు.ఆ నేపథ్యంలోనే తండ్రి కొడుకుల మరణానికి కారణమైన ఆ తొమ్మిది మంది పోలీసులకు సోమవారం మరణశిక్ష వేసిన మదురై సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది.

ఆర్కేపి సిఎస్ఐ చర్చిలో సంబరాలతో ఈస్టర్ పండుగ వేడుకలు!

Image
యేసుక్రీస్తు ప్రభువు పున:రుత్థానుడై మూడవరోజు మృత్యుంజయుడుగా తిరిగి లేచాడు  - ఆర్కేపి సిఎస్ఐ చర్చిలో సంబరాలతో ఈస్టర్ పండుగ వేడుకలు - యేసు సిలువపై కొవ్వొత్తులతో విరజిల్లే వెలుగు దీపాలు  - పాస్టర్ ఎం జాషువా దైవ సందేశం... - తెలంగాణ జర్నలిస్టు పేపర్... రామకృష్ణాపూర్ న్యూస్,ఏప్రిల్-5,తెలంగాణ జర్నలిస్టు న్యూస్ పేపర్-తెలంగాణ టీవీ ఛానల్ న్యూస్: ప్రపంచ మానవాళిని రక్షించడానికి సిలువ వేయబడిన పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభువు పున:రుత్తానుడై మూడవ దినము తిరిగి లేచాడు.ఆ క్రమంలో చూస్తే...మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ పట్టణంలోని సిఎస్ఐ-సెయింట్ పీటర్స్ చర్చి దేవాలయంలో ఆదివారం ఈస్టర్ పండుగ వేడుకలు భారీ ఎత్తున నిర్వహించారు.ఆ నేపథ్యంలోనే ఉదయం నాలుగు గంటలకే క్రైస్తవులు ఆలయానికి చేరుకొని ఏసుక్రీస్తు ప్రభువుకు మహిమ కనపరిచే విధంగా భక్తిశ్రద్ధలతో అత్యంత విశ్వాసంతో ఆరాధించారు. ఆ సందర్భంగా చర్చి దైవ సేవకులు రేవా.పాస్టర్ ఎం.జాషువా దేవుని సందేశంను ఆయన ప్రసంగం ద్వారా వివరించారు. కాగా ఏసుక్రీస్తు ప్రభువు మరణమును జయించి సజీవుడుగా ప్రత్యక్షమయ్యాడనీ గుర్తు చేశారు.అయితే బాధలో ఉన్న వారందరికి ఆ క్రీస...

గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తి అరెస్టు

Image
గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తి అరెస్టు ఐదు మొక్కలు స్వాధీనం తెలంగాణ జర్నలిస్టు న్యూస్... సుల్తానాబాద్ న్యూస్ ఏప్రిల్ 4 జర్నలిస్టు దినపత్రిక-మీడియా న్యూస్ పెద్దపల్లి జిల్లా బ్యూరో: పెద్దపల్లి జిల్లాసుల్తానాబాద్ మండలం ఆరేపల్లి గ్రామ శివారులో గల సాయిరాం బ్రిక్స్‌లో ఒక వ్యక్తి గంజాయి మొక్కలు పెంచుతున్నాడనే సమాచారం మేరకు ఈరోజు సుల్తానాబాద్ ఎస్ఐ తన సిబ్బందితో పాటు మండల వ్యవసాయ అధికారి పైడితల్లితో కలిసి సాయిరాం బ్రిక్స్‌లో తనిఖీ నిర్వహించారు.ఆ తనిఖీల సమయంలో అక్కడ గంజాయి మొక్కలు పెంచుతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.ఒడిశా రాష్ట్రానికి చెందిన సుకల్పరబోయి అనే వ్యక్తి గత ఐదు నెలల క్రితం సాయిరాం బ్రిక్స్‌లో పనిచేయడానికి వచ్చాడు.గంజాయి సేవించే అలవాటు ఉండడంతో తన వెంట తెచ్చుకున్న గంజాయి గింజలను నాటి మొక్కలను పెంచుతున్నట్లు తెలిసింది.ఈ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఐదు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసిన ఐదు మొక్కల విలువ సుమారు రూ.50,000 వరకు ఉంటుందని అంచనా.