Posts

Showing posts from July, 2025

ఆర్కేపి ఏరియా ఆసుపత్రి డివైసీఎంఓ డాక్టర్ ప్రభాకర్,ఎస్ఎన్ఎస్ పోలమ్మ ఉద్యోగ విరమణ పొందారు

Image
ఆర్కేపీ ఏరియా ఆసుపత్రి డివైసీఎంఓ డాక్టర్ జక్కుల ప్రభాకర్,ఎస్ఎన్ఎస్ గూడెపు పోలమ్మ ఉద్యోగ విరమణ పొందారు --  ఆసుపత్రిలో డాక్టర్ ప్రభాకర్,స్వీపర్ పోలమ్మకు ఘనంగా సత్కారం రామకృష్ణాపూర్ న్యూస్,జులై-31,జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్ : సింగరేణి కాలరీస్ లోని మందమర్రి డివిజన్ పరిధిలో గల రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి డివైసీఎంవో గా పనిచేసిన డాక్టర్ జక్కుల ప్రభాకర్ (61) అలాగే ఆసుపత్రిలో ఎస్.ఎన్.ఎస్ గా పనిచేసిన గూడెపు పోలమ్మ (61)అనే స్వీపర్ గురువారం ఉద్యోగ విరమణ పొందారు.ఆ క్రమంలో చూస్తే..రామకృష్ణాపూర్ లోని ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన సన్మాన సభలో డాక్టర్ ప్రభాకర్ అలాగే గూడెపు పోలమ్మను సింగరేణి యాజమాన్యం ఘనంగా సత్కరించింది.ఆ నేపథ్యంలోనే ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సన్మాన సభ కార్యక్రమంలో ముందుగా డివైసీఎంఓ డాక్టర్ ప్రభాకర్ ఉద్యోగరీత్యా ఆయన సర్వీసులో 30 సంవత్సరాల 8 నెలలు పూర్తి చేసినట్లు దాంతో ఉద్యోగ విరమణ పొందినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు.అలాగే గూడెపు పోలమ్మ కూడా 34 సంవత్సరాల 11 నెలలు ఉద్యోగంలో సర్వీస్ పూర్తి చేసి రిటైర్డ్ అయినట్లు పేర్కొన్నారు.ఆ సందర్భంగా ఆసుపత్రి డివ...

లావణ్య మృతితో న్యాయం చేయాలని బంధువుల న్యాయపోరాటం?

Image
లావణ్య మృతితో న్యాయం చేయాలని మృతదేహంతో బంధువుల న్యాయపోరాటం? --  రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతున్న లావణ్య మృతి  --  50-లక్షల కట్నం 30-తులాల బంగారం కట్నం ఇవ్వాలని విజ్ఞప్తి --  పంచాయతీలో సురేష్ తల్లిదండ్రులు 20 లక్షలకు అంగీకారం..  రామకృష్ణాపూర్ న్యూస్,జులై-26,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ కు చెందిన గాండ్ల సత్యం అతని కుమార్తె ముద్దసాని లావణ్యకు ఇటీవల కాలంలో జరిగిన గోర బైక్ రోడ్డు ప్రమాదంలో సత్యం సంఘటన స్థలంలో మృతి చెందిన విషయం తెలిసిందే.అయితే ఆ రోడ్డు ప్రమాదంలో లావణ్యకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె కూడా మృతి చెందారు.ముఖ్యంగా రామకృష్ణపూర్ కు చెందిన ముద్దసాని సురేష్ తో లావణ్యకు గతంలో వివాహం జరిగింది.ఆ భార్యాభర్తల మధ్య జరిగిన తగాధం కాస్తా కోర్టు దాకా వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది.అయితే ఊహించని విధంగా పెద్దపల్లి సమీపంలో వద్ద జరిగిన ఆ రోడ్డు ప్రమాదంలో తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా కూతురు కూడా చికిత్స పొందుతూ మృతి చెందారు.దాంతో లావణ్య మృతదేహాన్ని ఆంబులెన్స్ ద్వారా తీసుకువచ్చి ఆ మృతు...

గాంధారి మైసమ్మ తల్లి-మా..కోరికలన్నీ నెరవేర్చమ్మో...

Image
 గాంధారి మైసమ్మ తల్లి-మా..కోరికలన్నీ నెరవేర్చమ్మో... -  మైసమ్మ తల్లి బోనాల జాతరకు తరలిన వేలాది సంఖ్యలో భక్తులు  -  బొక్కలగుట్ట జాతీయ రహదారిపై భక్తులతో కిటకిట లాడిన జాతర  -  కార్మిక శాఖ మంత్రి జి.వివేక్ బోనమెత్తుకొని మైసమ్మకు సమర్పించారు -  బొక్కలగుట్ట చెరువు నుంచి బోనాలతో ఆలయం వరకు చేరిన భక్తులు  -  డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ..భక్తీశ్రద్ధలతో అమ్మవారికి మ్రొక్కులు -  వర్షాలు సమృద్ధిగా పడి రైతులకు పంట మంచిగా పండాలి -  ప్రజాపాలనలలో ప్రజలకు మేలు కలిగేలా ఆశీర్వాదించాలని అమ్మవారిని కోరిన మంత్రి వివేక్  -  జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ మీడియా న్యూస్... రామకృష్ణాపూర్ న్యూస్,జులై-20,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల బొక్కలగుట్ట జాతీయ రహదారి పక్కనే గల శ్రీ గాంధారి మైసమ్మ ఆషాడ మాస బోనాల జాతర పండుగ ఆదివారం అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో లాంఛనంగా ప్రారంభమైంది.ఆ జాతర వేడుకలకు రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్యఅతిథిగ...

రోడ్డు ప్రమాదంలో ఎస్ అండ్ పిసి సింగరేణి ఉద్యోగి మృతి?

Image
రోడ్డు ప్రమాదంలో ఎస్ అండ్ పిసి సింగరేణి ఉద్యోగి మృతి? పెద్దపల్లి న్యూస్,జులై-16,జర్నలిస్టు తెలుగు దినపత్రిక- టీవీ న్యూస్: పెద్దపల్లి మండలం అప్పన్నపేటలో బుధవారం జరిగిన గోర రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ కు చెందిన సింగరేణి సెక్యూరిటీ ఉద్యోగి గాండ్ల సత్యం అనే ఎస్ అండ్ పిసి మృతి చెందాడు.ఆ గాండ్ల సత్యం,అతని కూతురు లావణ్య బైక్ పై స్వగ్రామం కాబడిన ఓదెలకు వెళుతుండగా అప్పన్నపేట వద్ద ఒక లారీ ఢీకొని సత్యం మృతి చెందాడు.ఆ లావణ్యకు కూడా తీవ్ర గాయాలు కావడంతో కరీంనగర్ కు తరలించారు.ఇంకా మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రకృతిలోంచి భయంకరమైన సంకేతం?

Image
ప్రకృతిలోంచి భయంకరమైన సంకేతం•••• -- జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్... సముద్ర మధ్యభాగంలో అసలు ఏమి జరుగుతోంది?నీరు మరిగిపోతున్నట్లుగా కనిపిస్తోంది,అక్కడి నీటి ఉపరితలంపై విస్మయకరమైన గోతులు ఏర్పడుతున్నాయి.ఆ దృశ్యం నిజంగా భయపెట్టేలా ఉంది! శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఇది ఏదో భారీ భౌగోళిక లేదా పర్యావరణ ప్రకంపనకు సంకేతంగా ఉండవచ్చనీ అంటున్నారు.కొంతమంది నిపుణులు దీన్ని సముద్రపు అడుగున జ్వాలాముఖి చలనం లేదా భూమి పలకల కదలికల ప్రభావంగా చెబుతున్నారు!అయితే ఇప్పటివరకు అసలైన కారణం స్పష్టంగా తెలియకపోవడం,ఎక్కడైనా పెద్ద భూకంపం లేదా సునామీకి సంకేతం అయితే ఏంటన్న భయం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది.

మావోయిస్టులు లచ్చన్న,ఆంకుభాయి రామగుండం పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోయారు

Image
మావోయిస్టు రాష్ట్ర సభ్యుడు లచ్చన్న,ఆంకుభాయి రామగుండం పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోయారు - లొంగిపోయిన మావోయిస్టులకు పున:రావాసం కల్పిస్తాం..  -- పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా  రామగుండం కమిషనరేట్ ఆఫీస్,జులై-15,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : కమీషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం అంబర్ కిశోర్ ఝా ఎదుట మంగళవారం మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు, డీసీఎంలు లొంగిపోయారు.ఆ క్రమంలో చూస్తే..నాలుగు దశాబ్దాలపాటు సిపిఐ మావోయిస్టులో పనిచేసిన సీనియర్ మావోయిస్టు నాయకులు ఆత్రం లచ్చన్న,ఎస్ సీఎం చౌదరి ఆంకుభాయి డీసీఎంలు లొంగిపోయారు.అజ్ఞాతంలో ఉన్న అదిలాబాద్,కరీంనగర్ జిల్లా మావోయిస్టులు కూడా వారి గ్రామాలకు తిరిగి రావాలని సిపి కోరారు.లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు తెలంగాణ ప్రభుత్వం అందించే పునరావాస పథకం కింద లభించే ఫలితాలను అందచేస్తామని ప్రకటించారు.తెలంగాణ ప్రభుత్వం,పోలీస్ శాఖ ప్రజలకు చేస్తున్నటువంటి వివిధ రకాల సహాయ సహాకారాలు లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను గురించి తెలుసుకుని, తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని,కమీషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం ఎదుట కమిషనరేటు కార...

ప్రభుత్వ కస్తూర్బా పాఠశాల భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం... బ్రేకింగ్ న్యూస్...

Image
 *బ్రేకింగ్ న్యూస్* ప్రభుత్వ కస్తూర్బా పాఠశాల భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్,జులై-14 :మంచిర్యాల మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ లోగల ప్రభుత్వ కస్తూర్బా పాఠశాల విద్యార్థిని హాస్టల్ లో ఉండి చదువుకోవడం ఇష్టంలేక తొమ్మిదో తరగతి విద్యార్థిని మధులిఖిత పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య యత్నం చేసింది.దాంతో తీవ్రగాయాలు కావడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు చేయడంతో చికిత్స పొందుతుంది.

ఆర్కేపీలో జూనియర్ రాష్ట్రస్థాయి గర్ల్స్ ఫుట్బాల్ పోటీలు ఉత్సాహభరీతంగా సాగుతున్నాయి

Image
ఆర్కేపీలో జూనియర్ రాష్ట్రస్థాయి గర్ల్స్ ఫుట్బాల్ పోటీలు ఉత్సాహభరీతంగా సాగుతున్నాయి   రామకృష్ణాపూర్ న్యూస్,జులై-10,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : తెలంగాణ రాష్ట్ర జూనియర్ గర్ల్స్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్స్ పోటీలు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణపూర్ పట్టణంలో గల సింగరేణి టాగూర్ స్టేడియంలో ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి.ఆ క్రమంలో చూస్తే..రెండో రోజు స్టేడియంలో నిర్వహించిన ఫుట్బాల్ లీగ్ మ్యాచెస్ లో  మెదక్ తో రంగారెడ్డి టీం 0- 7 తేడాతో, ఆదిలాబాద్ తో నిజామాబాద్ టీం 0-3 తేడాతో గెలిచింది. ఖమ్మం తో నల్గొండ (0-0),వనపర్తి తో మహబూబ్ నగర్ (0-0) డ్రా గా ముగించాయి.లీగ్ స్టేజి లో గెలిచిన ఆదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం నల్గొండ, మహబూబ్ నగర్, గద్వాల్, వనపర్తి  8 టీమ్స్ క్వార్టర్ ఫైనల్ చేరగా గురువారం  మధ్యాహ్నo నుంచి క్వార్టరఫైనల్స్ లో  1.నల్గొండ vs మహబూబ్ నగర్  2.నిజామాబాద్ vs గద్వాల్  3.రంగారెడ్డి vs ఆదిలాబాద్  4.వనపర్తి vs ఖమ్మం జట్లు  తలపడనున్నాయి. క్వార్టర్ ఫైనల్ రిజల్ట్స్  1.నల్గొండ vs మహబూబ్ నగర్ (0-0) పెనాల్టీ షూటౌట్ (2-1) 2...

క్యాతనపల్లిలో 230 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లాటరీ ద్వారా కేటాయించారు

Image
క్యాతనపల్లిలో 230 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లాటరీ ద్వారా కేటాయించారు -- ఆర్కేసిఓఏ క్లబ్లో మంచిర్యాల ఆర్డీవో పర్యవేక్షణలో కేటాయించారు  రామకృష్ణాపూర్ న్యూస్,జులై-7,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : క్యాతనపల్లి మున్సిపాలిటీలో 230 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు నంబర్లు(2 బిహెచ్కె)లాటరీ పద్ధతిలో బుధవారం లబ్ధిదారులకు కేటాయించారు.ఆ క్రమంలో చూస్తే..బుదవారం ఉదయం నుంచి మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసులు పర్యవేక్షణలో మందమర్రి తహసీల్దార్(ఎంఆర్ఓ)పి.సతీష్ కుమార్ శర్మ క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ జి.రాజు,ఆర్ అండ్ బి అధికారినీ,ఆర్ఐలు  ద్వారా విద్యార్థినిలచే లాటరీ తీపించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సంబంధిత లబ్ధిదారులకు కేటాయింపు చేశారు.ఆ సందర్భంగా మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడారు.అయితే స్థానికంగా ఉన్న 286 ఇండ్లకు 230 ఇండ్లు కేటాయించినట్లు ప్రకటించారు.ముందుగా వికలాంగులకు13 మందికి ఆ ఇండ్లను కేటాయించారు.ఆ తర్వాత అర్హులైన లబ్ధిదారులకు సంబంధిత డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించడం జరిగింది.ముఖ్యంగా మిగిలిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను రెండవ దఫాలో మరోసారి చేపట్టిన కార్యక్రమంలో సంబ...

క్యాతనపల్లిలో 230 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ఈ నేల 9న లాటరీ

Image
క్యాతనపల్లిలో 230 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ఈ నేల 9న లాటరీ  -- ఆర్కేసిఓఏ క్లబ్లో ఆర్డీవో పర్యవేక్షణలో లాటరీ పద్ధతి  రామకృష్ణాపూర్ న్యూస్,జులై-7,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు జిల్లా కేంద్రంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో 230 లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నంబర్ లు(2 బిహెచ్కె)లాటరీ పద్ధతిలో ఈనెల 9న నిర్వహిస్తున్నట్లు మందమర్రి తహసిల్దార్ పి.సతీష్ కుమార్ శర్మ తెలిపారు.ఆ క్రమంలో చూస్తే..బుదవారం ఉదయం 10:15 గంటల నుంచి మంచిర్యాల ఆర్డీవో పర్యవేక్షణలో మందమర్రి తహసీల్దార్(ఎంఆర్ఓ)ద్వారా పోచమ్మ బస్తీ,అంబేద్కర్ అంగడి బజార్ సమీపంలోని ఆర్‌కేసీఓఏ క్లబ్(సింగరేణి క్లబ్)లో నిర్వహించబడుతుందని సోమవారం ప్రకటించారు.అయితే కేవలం లబ్దిదారులను మాత్రమే ఆ లాటరీ నిర్వహించే ప్రాంగణంలోకి అనుమతిస్తారని పేర్కొన్నారు.ఆ నేపద్యంలోనే లబ్ధిదారులు తహసిల్దార్ కార్యాలయం ఇష్యూ చేసిన స్లిప్ తో పాటు ఆధార్ కార్డు/పాన్ కార్డ్/ఓటర్ కార్డ్ లేదా ఇతర గవర్నమెంట్ గుర్తింపు పొందిన కార్డులలో ఏదో ఒకటి వెంట తీసుకొని రావాలని తెలిపారు.

ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జన్మదినంతో కేక్ కట్ చేసి సంబురాలు

Image
ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జన్మదినంతో కేక్ కట్ చేసి సంబురాలు ---  సూపర్ బజార్,శివాజీ నగర్ లో పతాకం ఆవిష్కరించిన ఆర్కేపి మాదిగ దండోరా రామకృష్ణాపూర్ న్యూస్,జులై-7,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి-ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ 60వ జన్మదిన వేడుకలు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతన పల్లి మున్సిపాలిటీ పట్టణంలో సోమవారం పెద్ద ఎత్తున నిర్వహించారు.ఆ క్రమంలో చూస్తే..రామకృష్ణాపూర్ పట్టణంలోని శివాజీ నగర్ లో ముందుగా ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించారు.అనంతరం పట్టణంలోని సూపర్ బజార్ చౌరస్తాలో గల ఎమ్మార్పీఎస్ జెండా వద్దకు చేరుకొని అక్కడ జెండాను కూడా కొబ్బరికాయలు కొట్టిన పిదప పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. కాగా మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఆర్ కే పి టౌన్ అధ్యక్షులు రాచర్ల సరేష్ తో ఆధ్వర్యంలో భారీ ఎత్తున నినాదాల మధ్యన ఈరోజు మాదిగలందరూ కలిసి ఐకమత్యంగా వేడుకలు నిర్వహించుకున్నారు.ఆ సందర్భంగా రాచర్ల సురేష్,ఆర్.పోశంమాట్లాడారు.ఆ కార్యక్రమంలో ఎం ఎస్ ఎఫ్ నాయకులు కన్నూరి రాజేం...