Posts

Showing posts from September, 2025

క్యాతనపల్లి మెప్మా ఆఫీసును లాంఛనంగా ప్రారంభించిన కార్మిక శాఖ మంత్రి వివేక్

Image
క్యాతనపల్లి మెప్మా ఆఫీసును లాంఛనంగా ప్రారంభించిన కార్మిక శాఖ మంత్రి వివేక్ -  ఆరు లక్షల నిధులతో కార్యాలయం నిర్మాణం -  రెండు కోట్ల రుణాల చెక్కును పంపిణీ చేసిన మంత్రి  -  మంత్రి వివేక్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగం.... రామకృష్ణాపూర్ న్యూస్,సెప్టెంబరు-23,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల సింగరేణి ఠాగూర్ స్టేడియం ప్రక్కనే ఉన్నా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ప్రక్కన స్థలంలో సుమారు ఆరు లక్షల నిధుల వ్యయంతో నిర్మించిన మెప్మా కార్యాలయాన్ని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి మంగళవారం రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు.ఆ క్రమంలో చూస్తే..జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి మంత్రి కొబ్బరికాయలు కొట్టి పెద్ద ఎత్తున చేపట్టిన ప్రోగ్రాంలో మహిళా భవన్-మెప్మా కార్యాలయాన్ని మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఆ నేపథ్యంలోనే పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని 567 మహిళా సంఘాలలోని సుమారు 6000 మంది సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.ఆ సందర్భంగా మంత్రి వివేక్ అక్కడి వేదికపై మాట్లాడారు.తెలంగాణ ...

ప్రజలు సైబర్ నేరాలతో అప్రమత్తంగా ఉండాలి

Image
ప్రజలు సైబర్ నేరాలతో అప్రమత్తంగా ఉండాలి     రామకృష్ణాపూర్ ఎస్ఐ జి.రాజశేఖర్ రామకృష్ణాపూర్ న్యూస్,సెప్టెంబరు-22,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: నేటి ఆధునిక ప్రపంచంలో సాంకేతికమైన,ఆర్థికపరమైన  సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.ప్రజలను మభ్యపెట్టి,తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని, లేదా సులభంగా లోన్లు ఇప్పిస్తామని, ప్రజలను నమ్మించి గుర్తు తెలియని వ్యక్తులు అమాయకులను మోసం చేస్తున్నారు.తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ లో ఒక మహిళ ఆన్‌లైన్ సైబర్ నేరగాళ్ల మోసానికి గురి అయ్యి తన ఖాతాలోని డబ్బు కోల్పోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. --  వివరాల్లోకి వెళితే... రామకృష్ణాపూర్లోనీ గద్దెరగాడిలో గల అమ్మాగార్డెన్ లో నివాసం ఉంటున్న మహిళ తన మొబైల్ లో తన Face book ఖాతాలో Work from Home అనే Part time job ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ఒక గుర్తుతెలియని లింక్ చూసి, అది నిజమే అనీ నమ్మి ఆ లింక్ open చేసి అందులో Hotels కు సంబందించిన Reviwes ఉంటాయని వాటిని చేస్తూ కోన్ని Task లు కూడ చెయ్యాలని Task లు పూర్తి కాగానే డబ్బులు వస్తాయని చెప్పగా, సదరు మహిళ ...

సింగరేణిలో కార్మికులకు 34 శాతం లాభాల పంపిణీకి సిద్ధం

Image
సింగరేణిలో కార్మికులకు 34 శాతం లాభాలు పంపిణీ గోదావరిఖని ప్రతినిధి,సింగరేణి ప్రతినిధి,మంచిర్యాల,సెప్టెంబరు-22,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్:సింగరేణి కంపెనీ 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను లాభాలను సింగరేణి యాజమాన్యం ప్రకటించింది.కాగా మొత్తం ₹2360 కోట్ల లాభాల్లో 34 శాతంను కార్మికులకు పంచాలని నిర్ణయించింది.ఆ ప్రకారం ₹802.4 కోట్లు శాశ్వత కార్మికులకు పంపిణీ చేయనున్నారు.ఒక్కో కార్మికునికి సగటున ₹1.95 లక్షలు అందనున్నాయి.ఆ నేపథ్యంలోనే కాంట్రాక్టు కార్మికులకు ప్రత్యేకంగా ₹5,500 చొప్పున ఇవ్వనున్నారు.అయితే పర్మనెంట్,కాంట్రాక్టు కార్మికులకు కలిపి సింగరేణి మొత్తం ₹819 కోట్లు చెల్లించనుంది.సింగరేణి చరిత్రలో ఇది మరోసారి కార్మికులకు ఆనందం నింపే లాభాల ప్రకటనగా నిలిచిందని తెలుస్తుంది.

తెలంగాణలో సాంస్కృతికి ప్రతీకగా బతుకమ్మ సంబురాలు ప్రారంభం

Image
తెలంగాణలో సాంస్కృతికి ప్రతీకగా బతుకమ్మ సంబురాలు ప్రారంభం  జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్,సెప్టెంబరు-20:తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ సంబురాలు ఆదివారం సెప్టెంబరు 21వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలుకానున్నాయి.ఆ క్రమంలో చూస్తే..బ‌తుక‌మ్మ  ప్రారంభ వేడుక‌ల‌ను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పర్యాటక శాఖ సిద్ధమైంది.కాగా వరంగల్ జిల్లా వెయ్యి స్తంభాల గుడిలో వేడుకలను ప్రారంభించి...30వ తేదీన హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద ముగించనున్నారు.ఆ నేపథ్యంలోనే శనివారం కరీంనగర్ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.ఆ సందర్భంగా విద్యార్థులు వివిధ పుష్పాలతో బతుకమ్మలను పేర్చి సాంప్రదాయ దుస్తులు ధరించి ఆ బతకమ్మల చుట్టూ సంతోషంగా ఆనందంతో తిరుగుతూ..ఆడుతూ..పాడుతూ..నృత్యాలతో సందడి చేశారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.సకల జనులు,సబ్బండ వర్ణాలు కలిసి ఏకత్వస్ఫూర్తిని చాటేలా రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకల యొక్క సంబురాలు చేపట్టాలని ఆయన ...

తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టి ఆర్ పి)గా తీన్మార్ మల్లన్న పార్టీ పేరు ప్రకటన

Image
తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టి ఆర్ పి)గా తీన్మార్ మల్లన్న పార్టీ పేరు ప్రకటన తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ : జెండా, ఎజెండా ఇదే..! తెలంగాణ రాజకీయాల్లోకి మరో పార్టీ పుట్టుకొచ్చింది. బీసీ రిజర్వేషన్లు, రాజ్యాధికారం కోసం కొత్త పార్టీని స్థాపిస్తానని ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్.. జర్నలిస్టు తెలుగు దినపత్రిక -టీవీ న్యూస్ బుధవారం (2025, సెప్టెంబర్ 17) హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్ లో పార్టీని ప్రకటించారు.పార్టీ పేరును తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) గా ప్రకటించిన మల్లన్న..ఆ పార్టీ విధివిధానాలు,లక్ష్యాలు ప్రకటించారు.బీసీల ఆత్మగౌరవమే ప్రధాన ఎజెండాగా ఈ పార్టీని స్థాపిస్తున్నట్లు మల్లన్న స్పష్టం చేశారు.తెలంగాణ గడ్డ మీద బీసీలు తమకు తాముగా ఒక రాజకీయ పార్టీని తీసుకొస్తున్నారు.బీసీల ఆత్మగౌరవ జెండా రేపటి నుంచి రెపరెపలాడబోతోందని ఈ సందర్భంగా మల్లన్న అన్నారు. -- పార్టీ జెండా..అజెండా: పార్టీ జెండాను ఎరుపు,ఆకుపచ్చ రంగులో తీసుకొచ్చారు.జెండా మధ్యలో పడికిలి బిగించిన చేయితో పాటు..కార్మిక చక్రం,వరి కంకులతో జెండా రూపొందించారు.జెండా పై భాగంలో ఆత్మ గౌరవం,అధికారం,వా...

ఆర్కేపిలో పర్యటించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి.వివేక్

Image
ఆర్కేపిలో పర్యటించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి.వివేక్ -- కాంగ్రెస్ ఆఫీసులో మంత్రి సుదీర్ఘంగా చర్చలు  -- క్యాతనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి శ్రీకారం.. రామకృష్ణాపూర్ న్యూస్,సెప్టెంబరు-16,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గల క్యాతనపల్లి మున్సిపాలిటీలో మంగళవారం రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటించారు.ఆ తరుణంలో రామకృష్ణపూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేపట్టిన సమావేశంలో మంత్రి హాజరైనారు.ఆ నేపథ్యంలోనే స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఆ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడారు.చెన్నూరు నియోజకవర్గంతో పాటు క్యాతనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి అన్ని రంగాలలో కృషి చేస్తున్నట్లు తెలిపారు.రోడ్లు డ్రైనేజీ స్మశాన వాటిక ఇంకా ముఖ్యమైన అభివృద్ధి పనులపై కలెక్టర్ తో మాట్లాడినట్లు గుర్తు చేశారు.గతంలో బిఆర్ఎస్ హయాంలో అభివృద్ధి జరగలేదని కమిషన్ లకే ఎక్కువ అధికారం చూపెట్టినట్లు ప్రకటించారు.ఆ కార్యక్రమంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ జి.రాజు,సంబంధిత అధ...

కుక్కల భయంతో ఇంటి పైకప్పు ఎక్కిన ఎద్దు?

Image
కుక్కల భయంతో ఇంటి పైకప్పు ఎక్కిన ఎద్దు? ఆదిలాబాద్ జిల్లా న్యూస్, సెప్టెంబరు-15,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: అదిలాబాద్ జిల్లాలో ఓక విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.ఆ క్రమంలో చూస్తే..వీధి కుక్కల భారీ నుంచి తన ప్రాణాలు కాపాడుకునేందుకు ఎద్దు ఏకంగా ఓక ఇంటి పైకప్పు పైకి ఎక్కింది.అయితే మనుషులు ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికి అయినా వెనుకాడరు.ఆ విషయంలో మనుషులే కాదు జంతువులు కూడా దీనికి అతీతం కాదుని నిరూపించింది.ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఆ సంఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.భోరజ్ మండలం నిరాల గ్రామానికి చెందిన రైతు షేక్ గఫూర్ తన ఎద్దును ఇంటి బయట కట్టాడు.అదే సమయంలో కొన్ని వీధి కుక్కలు గుంపుగా వచ్చి ఆ ఎద్దుపై దాడికి ప్రయత్నించాయి.దాంతో భయపడిన మూగ పశువు కాబడిన ఆ ఎద్దు ప్రాణ భయంతో కట్టు తాళ్లను తెంచుకుని పరుగులు పెట్టింది.ఆ విధంగా పరుగెడుతూ..పక్కనే ఉన్న రాళ్ల కుప్పపైకి ఎక్కి,అక్కడి నుంచి నేరుగా ఓక ఇంటి పైకప్పు మీదకు చేరి ఆ ఎద్దు తన ప్రాణాలు కాపాడుకుంది.ఇంటిపై ఎద్దును చూసిన గ్రామస్థులు ఒక్కసారిగా నివ్వెరపోయారు.తాళ్ళ సహాయంతో చాలా సేపు శ్రమించి చివరకు ఆ ఎద్దును కిందక...

మంచిర్యాలలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఆగింది

Image
మంచిర్యాలలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఆగింది -- జర్నలిస్టు తెలుగు దినపత్రిక- టీవీ మీడియా న్యూస్... మంచిర్యాల న్యూస్,సెప్టెంబరు-15,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : మంచిర్యాల రైల్వే స్టేషన్లో నాగపూర్–సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సోమవారం ఆగింది.ఆ సందర్భంగా జెండా ఊపి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్,రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి,పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణలు వందే భారత రైలును అధికారికంగా లాంఛనంగా ప్రారంభించారు.ఆ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్,రాష్ట్ర మంత్రి వివేక్,పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడారు.రైల్వే శాఖకు సింగరేణి ద్వారా పదివేల కోట్లకు పైగా ఆదాయం వస్తున్నా,ఇక్కడి ప్రజలు రైల్వే కనెక్టివిటీ కోసం ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు.ఆ కృషి ఫలంగా వందే భారత్ హాల్టింగ్ సాధ్యమైందని గుర్తు చేశారు. అయితే వందే భారత్ హాల్టింగ్ కల్పించినందుకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు, రైల్వే శాఖకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

15న-మంచిర్యాల రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైలు ప్రారంభం

Image
15న-మంచిర్యాల రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైలు ప్రారంభం .. - మంచిర్యాల చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఎన్.దేవేందర్ మంచిర్యాల న్యూస్,సెప్టెంబరు-12,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్.కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ నెల-15వ తేదీన మంచిర్యాల రైల్వే స్టేషన్ లో కేంద్ర హోమ్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేతుల మీదుగా వందే భారత్ రైలు ప్రారంభించడం జరుగుతుందని శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ మంచిర్యాల చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఎన్.దేవేందర్ తెలిపారు.కాగా 15వ తేదీ సోమవారం ఉదయం 8.15 గంటలకు మంచిర్యాల రైల్వే స్టేషన్ లో వందే భారత్ 20101 నాగ్ పూర్-సికింద్రాబాద్ రైలును జెండా ఊపి ప్రారంభించడం జరుగుతుందని,అధికారులు,ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

13న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి

Image
13న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి -  లోక్ అదాలత్ ద్వారానే సత్వర న్యాయం  -  రాజీ పడితే ఆ ఇద్దరూ గెలిచినట్లే... -  రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంచిర్యాల న్యూస్,సెప్టెంబరు-11,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : రాజీమార్గమే రాజమార్గమని,కక్షలు,కార్పణ్యాలతో ఏమీ సాధించలేమని దాంతో రాజీపడితే ఇద్దరూ గెలిచినట్లేనని గురువారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఆ క్రమంలో చూస్తే...ఈ నెల 13వ తేదీన జరుగనున్న జాతీయ లోక్ అదాలత్ ను తప్పకుండా కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఆ లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని గుర్తు చేశారు.రాజీపడదగిన కేసులలో క్రిమినల్ కంపౌండ బుల్ కేసులు,సివిల్ తగాదా కేసులు,ఆస్తి విభజన కేసులు,కుటుంబపరమైన నిర్వాహణ కేసులు,వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు,బ్యాంకు రికవరీ,టెలిఫోన్ రికవరీ కేసులు,విద్యుత్ చౌర్యం,చెక్ బౌన్స్ కేసులు,ఇతర రాజీ పడ్డ దగిన సంబంధిత కేసుల్లో కక్షిదారులు రాజీ పడాలని సూచించారు.ఆ నేపథ్యంలోనే రాజీ మార్గం-రాజ మార్గమని చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరు...

వందశాతం సక్సెస్ రేట్ సాధించిన రష్యా క్యాన్సర్ వాక్సిన్?

Image
వందశాతం సక్సెస్ రేట్ సాధించిన రష్యా క్యాన్సర్ వాక్సిన్ జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్,సెప్టెంబరు-8:ఎంటెరోమిక్స్ అని పిలవబడే ఈ వ్యాక్సిన్ నాలుగు నాన్-పాథోజెనిక్ (హానికరం కాని)వైరస్‌లతో తయారుచేసారు.అవి క్యాన్సర్ కణాలను నేరుగా లక్ష్యంగా చేసి నాశనం చేస్తాయి.అంతే కాకుండా ఈ వైరస్‌లు రోగి యొక్క రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచి, క్యాన్సర్‌ను మరింత సమర్థవంతంగా గుర్తించి పోరాడేలా చేస్తాయి.అంటే రెండు రకాల పనులు చేస్తాయన్నమాట.ఒకటి ఆంకోలిసిస్ అనగా ట్యూమర్ ను నాశనం చేయడం.రెండు యాంటీ-ట్యూమర్ రోగనిరోధకశక్తిని యాక్టివేట్ చేయడం.కీమోథెరపీ లేదా రేడియేషన్‌కు భిన్నంగా,ఇది ఆరోగ్యకరమైన కణజాలాలను కాపాడుతుంది.క్లినికల్ ట్రయల్స్‌లో తీవ్రమైన దుష్ప్రభావాలు ఏమీ చూపలేదు.రోగులు దీనిని బాగా తట్టుకున్నారు.18-75 సంవత్సరాల వయస్సు గల 48 వాలంటీర్స్ తో ఫేజ్-1 క్లినికల్ ట్రయల్స్ మూడు నెలల క్రితం మొదలు పెట్టారు.సెప్టెంబర్ 6వ తేదీన ప్రిలిమినరీ డేటా రష్యా ఆరోగ్య శాఖకు సబ్మిట్ చేసారు.100% saftey profile కన్ఫర్మ్ అయింది. 60-80% ట్యూమర్ సైజ్ తగ్గింది.ఈ మొత్తం ట్రయల్స్ లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ వాలంటీర్లు అందరూ కీమో థె...

ఆర్కేపి సిహెచ్పిలో రైలు ఇంజన్ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి?

Image
ఆర్కేపి సిహెచ్పిలో రైలు ఇంజన్ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి? -  అద్దాలు,మీటర్ అద్దాలు పగలగొట్టిన వైనం..  -  సిఐఎస్ఎఫ్ జవానులు,సింగరేణి ఎస్ అండ్ పిసి అధికారి ఎంక్వైరీ  రామకృష్ణాపూర్ న్యూస్,సెప్టెంబరు-6,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :సింగరేణి కాలరీస్లోని మందమర్రి డివిజన్ పరిధిలో గల రామకృష్ణాపూర్ పట్టణంలోని సిహెచ్పీలో రైల్వే ట్రాక్ పై ఆగి ఉన్న సెంట్రల్ రైల్వే ఇంజన్ పై గుర్తుతెలియని వ్యక్తులు ఇంజను అద్దాలు,మీటర్ అద్దాలు పగలగోట్టారు.ఆ క్రమంలో చూస్తే..సీఎస్పీలో నిలిచి ఉన్న సంబంధిత బొగ్గును తీసుకువెళ్లే గూడ్స్ రైలు ఇంజన్ యొక్క అద్దాలు అలాగే ఇంజన్ యొక్క మీటర్ కు సంబంధించిన అద్దాలు తదితర ఇంకా ఇంజన్ కు సంబంధించిన వస్తువులను గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారు.ఆ విషయం తెలిసిన వెంటనే మందమర్రి జనరల్ మేనేజర్ రాధాకృష్ణ శుక్రవారం రాత్రి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది.దాంతో ఆ విషయమై జిఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలిసింది.ఆ విషయమై సిహెచ్పి ముఖ్య అధికారి బాలాజీ భగవత్ ఝాను జర్నలిస్టు పత్రిక-మీడియా న్యూస్ వివరాలు అడిగి తెలుసుకుంద...

ఆర్కేపిలో భక్తి శ్రద్ధలతో సంతోషంగా గణేష్ శోభయాత్ర సక్సెస్

Image
ఆర్కేపిలో భక్తి శ్రద్ధలతో సంతోషంగా గణేష్ శోభయాత్ర - ముఖ్య అతిథి బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ - రాజీవ్ చౌక్ లో కొబ్బరికాయలు కొట్టి,మెమోంటోలు ప్రదానం.. - పట్టణ గణేశ్ ఉత్సవ కమిటీ బృందం రామకృష్ణాపూర్ న్యూస్,సెప్టెంబరు-5,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం గణనాథుడి శోభయాత్ర అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో సంతోషంగా నిర్వహించారు.ఆ క్రమంలో చూస్తే..బేల్లంపల్లి ఏసీపి రవికుమార్ ఆ శోభాయాత్రకు ముఖ్య అతిథిగా హాజరైనారు.ఆ సందర్భంగా ఏసిపి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.ప్రజలు సుఖ:సంతోషాలతో జీవించాలని నిరుద్యోగులకు యువకులకు ఉద్యోగాలు రావాలని మంచిగా చదువుకున్న అభివృద్ధిలో వెళ్లాలని వినాయకుని కోరారు.ప్రధానంగా పట్టణంలోని అనేక మండపాలలో కొలువుదీరిన విఘ్నేశ్వరునీ ఆయా పురవీధుల గుండా శోభాయాత్ర చేపట్టారు.దాంతో పట్టణంలోని రాజీవ్ చౌక్ నుంచి గోదావరి నదికి గణేష్ నిమజ్జనానికి బయలుదేరి వెళ్లారు.ఆ నేపథ్యంలోనే నవరాత్రులు భక్తుల నుంచి విశిష్ట పూజలు అందుకున్న బొజ్జ గణపయ్యను బ్యాండ్ మేళాల మధ్య టపాకాయలు పెంచడంతో పాటు నృత్యాలు చేస్తూ..పట్టణం...

మంచిర్యాల ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లాలి

Image
మంచిర్యాల ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లాలి....  - డీసీపీ భాస్కర్.. -కన్నుల పండువగా అంజనీపుత్ర గణనాథుని నవరాత్రుల వేడుకలు.... మంచిర్యాల న్యూస్,సెప్టెంబరు-5,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :మంచిర్యాల జిల్లా వినాయక చవితి వేడుకలు సందర్భంగా ఆధ్యాత్మిక కేంద్రంగా,శాంతి యుతంగా నిమజ్జన వేడుకలు నిర్వహించుకోవాలని శుకార మంచిర్యాల జిల్లా డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు.జిల్లా కేంద్రంలోని వంద ఫీట్ల రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఆ వినాకయకుని మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం డీసీపీ ఆఫీసర్ ను అంజనీ పుత్ర ఎస్టేట్స్ చైర్మెన్ గుర్రాల శ్రీధర్,ఎండీ పిల్లి రవి ఘనంగా సన్మానించారు.ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మంచిర్యాల జిల్లా ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లి శాంతి,కుల మతాలకతీతంగా అందరూ ఐక్యతతో పండుగలో నిర్వహించుకోవాలన్నారు.తెలంగాణ పండుగలు మన సంస్కృతికి అద్దం పడతాయని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదన్నారు.భిన్నత్వంలో ఏకత్వంగా ప్రతి పండుగను వేడుక గా నిర్వహించుకుని మధుర జ్ఞాపకాలుగా మలచుకోవాలన్నారు.అనంతరం అంజనీ పుత్ర సంస్థ చైర్మెన్ గుర్రాల శ్రీధర్,మేన...